ప్రతి హీరోకూ కెరీర్లో ఒక స్పెషల్ ప్రొడ్యూసర్ ఉంటాడు. ఆ నిర్మాతతో సినిమా అంటే కంఫర్ట్ ఫీలవుతుంటారు. ప్రత్యేక అభిమానం చూపించడమే కాక.. మళ్లీ మళ్లీ వాళ్లతో సినిమాలు చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన కెరీర్లో అలాంటి నిర్మాత ఎ.ఎం.రత్నం అనే చెప్పాలి. పవన్తో ‘ఖుషి’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన నిర్మాత ఆయన. ఆ సినిమాకు ముందు రత్నం అటు తమిళంలో, ఇటు తెలుగులో భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా ఉండేవారు. టాప్ రేంజిలో ఉన్న ఆయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు లైన్లో ఉండేవారు.
అలాంటి సమయంలో పవన్తో ‘ఖుషి’ తీసి అతడికి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారాయన. పవన్ కోసం మంచి సబ్జెక్ట్ ఎంచుకుని రాజీ లేకుండా నిర్మించి అతడి అభిమానాన్ని చూరగొన్నారాయన. అందుకే పవన్ మళ్లీ ఆయనతో ‘బంగారం’ సినిమా చేశాడు. స్వీయ దర్శకత్వంలో ‘సత్యాగ్రహి’ అనే సినిమాను కూడా రత్నంతో చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. అనివార్య కారణాలతో అది ఆగిపోయింది.
కొన్నేళ్ల కిందట రత్నంతో ఓ సినిమా మొదలుపెట్టినట్లే పెట్టి ఆపేసిన పవన్.. రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. మళ్లీ సినిమాల్లోకి రావడం ఆలస్యం.. రత్నంతో ఓ సినిమా మొదలుపెట్టాడు. అదే క్రిష్ మూవీ. ఎన్నో ఏళ్ల కమిట్మెంట్ను ఈ సినిమాతో తీరుస్తున్నాడు పవన్. ఇదిలా ఉంటే గురువారం రత్నం పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ని ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశాడు పవన్. అంతే కాదు.. రత్నం మీద తనకున్న ఆపేక్షను తెలియజేస్తూ మీడియాకు ఒక నోట్ కూడా ఇచ్చాడు.
తన మొత్తం కెరీర్లో తనతో సినిమా చేయమని అడిగిన నిర్మాత ఒక్క రత్నం మాత్రమే అని పవన్ తెలిపాడు. నెల్లూరులో తన మిత్రుడు ఒకరి ద్వారా రత్నంతో పరిచయం జరిగిందని, ఆయన్ని చెన్నైకి వెళ్లి కలుస్తుండేవాడినని.. ఈ క్రమంలోనే తనతో ఓ సినిమా చేయమని ఆయన్ని అడిగానని పవన్ వెల్లడించాడు. తన కోరికను మన్నిస్తూ ‘ఖుషి’ లాంటి ప్రత్యేకమైన సినిమాను తనకు అందించారని పవన్ గుర్తు చేసుకున్నాడు.
This post was last modified on February 5, 2021 11:05 am
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…