Movie News

థియేటర్లలో ఇప్పటికీ 50 శాతమే


ఫిబ్రవరి 1 నుంచి దేశవ్యాప్తంగా థియేటర్లను 100 శాతం ఆక్యుపెన్సీతో నడపడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సుదీర్ఘ నిరీక్షణకు తెరపడిందంటూ సినీ జనాలు హర్షం వ్యక్తం చేశారు. కానీ ఈ వారం ‘జాంబి రెడ్డి’ సహా కొత్త సినిమాలు కొన్ని రిలీజవుతున్న నేపథ్యంలో టికెట్లు బుక్ చేద్దామని చూస్తున్న ప్రేక్షకులకు ‘బుక్ మై షో’ సహా టికెటింగ్ వెబ్ సైట్లలో ఆక్యుపెన్సీ 50 శాతమే చూపిస్తున్నాయి. సగం సీట్లను బ్లాక్ చేసి ఉంచారు. ఆల్టర్నేట్ సీట్లను మాత్రమే బుక్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మరి కేంద్రం ఆదేశాలు ఇంకా ఎందుకు అమలు కావట్లేదని అంతా ఆశ్చర్యపోతున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఇంకా 50 పర్సంట్ ఆక్యుపెన్సీనే అమల్లో ఉంది. కేంద్రం 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు ఇచ్చినప్పటికీ.. రాష్ట్రాలు ఇందుకు అనుగుణంగా జీవోలు పాస్ చేయకపోవడమే ఇందుక్కారణం.


తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ రూల్‌నే కొనసాగిస్తున్నారు. దక్షిణాదిన ఒక్క తమిళనాడు మాత్రమే 100 శాతం ఆక్యుపెన్సీకి అనుగుణంగా మార్గదర్శకాలు జారీ చేసింది. నార్త్‌లో ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలు 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశం కల్పించాయి. మిగతా రాష్ట్రాలన్నింట్లోనూ 50 శాతంతోనే థియేటర్లు నడుస్తున్నాయి.

కర్ణాటకలో ఈ నెల చివరి వరకు 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడపాలని ఆదేశాలు జారీ చేశారు. రాజస్థాన్‌లో ఈ నెల 8 వరకు 50 శాతం కొనసాగేలా మార్గదర్శకాలు ఇచ్చారు. ఏపీ, తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాల్లో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు జారీ చేయడం లాంఛనమే అని భావిస్తున్నారు. ఐతే ఈ శుక్రవారం లోపు ఆదేశాలు వస్తే ‘జాంబి రెడ్డి’ లాంటి కొత్త సినిమాలకు కలిసొస్తుంది. థియేటర్లపై మెయింటైనెన్స్ భారం తగ్గుతుంది.

This post was last modified on February 3, 2021 2:14 pm

Share

Recent Posts

స్పైడర్ మ్యాన్ సక్సెస్… ఏ పాఠం నేర్చుకోవాలి

సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…

35 minutes ago

టాక్సిక్ ట్రైలర్ మీద కోట్ల కళ్లున్నాయి

కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…

60 minutes ago

ఎదిగే స్టేజిలో అలాంటి ఆలోచనలే రిస్కు

హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…

2 hours ago

సందీప్ కిషన్ మూవీకి టెన్షన్ లేదు

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…

3 hours ago

అప్పుడు కుటుంబ పేర్లు… ఇప్పుడు వీరుల పేర్లు

భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…

3 hours ago

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

6 hours ago