Movie News

థియేటర్లలో ఇప్పటికీ 50 శాతమే


ఫిబ్రవరి 1 నుంచి దేశవ్యాప్తంగా థియేటర్లను 100 శాతం ఆక్యుపెన్సీతో నడపడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సుదీర్ఘ నిరీక్షణకు తెరపడిందంటూ సినీ జనాలు హర్షం వ్యక్తం చేశారు. కానీ ఈ వారం ‘జాంబి రెడ్డి’ సహా కొత్త సినిమాలు కొన్ని రిలీజవుతున్న నేపథ్యంలో టికెట్లు బుక్ చేద్దామని చూస్తున్న ప్రేక్షకులకు ‘బుక్ మై షో’ సహా టికెటింగ్ వెబ్ సైట్లలో ఆక్యుపెన్సీ 50 శాతమే చూపిస్తున్నాయి. సగం సీట్లను బ్లాక్ చేసి ఉంచారు. ఆల్టర్నేట్ సీట్లను మాత్రమే బుక్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మరి కేంద్రం ఆదేశాలు ఇంకా ఎందుకు అమలు కావట్లేదని అంతా ఆశ్చర్యపోతున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఇంకా 50 పర్సంట్ ఆక్యుపెన్సీనే అమల్లో ఉంది. కేంద్రం 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు ఇచ్చినప్పటికీ.. రాష్ట్రాలు ఇందుకు అనుగుణంగా జీవోలు పాస్ చేయకపోవడమే ఇందుక్కారణం.


తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ రూల్‌నే కొనసాగిస్తున్నారు. దక్షిణాదిన ఒక్క తమిళనాడు మాత్రమే 100 శాతం ఆక్యుపెన్సీకి అనుగుణంగా మార్గదర్శకాలు జారీ చేసింది. నార్త్‌లో ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలు 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశం కల్పించాయి. మిగతా రాష్ట్రాలన్నింట్లోనూ 50 శాతంతోనే థియేటర్లు నడుస్తున్నాయి.

కర్ణాటకలో ఈ నెల చివరి వరకు 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడపాలని ఆదేశాలు జారీ చేశారు. రాజస్థాన్‌లో ఈ నెల 8 వరకు 50 శాతం కొనసాగేలా మార్గదర్శకాలు ఇచ్చారు. ఏపీ, తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాల్లో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు జారీ చేయడం లాంఛనమే అని భావిస్తున్నారు. ఐతే ఈ శుక్రవారం లోపు ఆదేశాలు వస్తే ‘జాంబి రెడ్డి’ లాంటి కొత్త సినిమాలకు కలిసొస్తుంది. థియేటర్లపై మెయింటైనెన్స్ భారం తగ్గుతుంది.

This post was last modified on February 3, 2021 2:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

5 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

6 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

6 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

6 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

8 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

9 hours ago