మూడేళ్ల కిందట పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై పెద్ద విజయం సాధించిన చిన్న సినిమా ఛలో. అప్పటిదాకా చిన్న స్థాయిలో ఉన్న నాగశౌర్య ఈ సినిమాలో పెద్ద విజయాన్నందుకుని ఫాలోయింగ్, మార్కెట్ పెంచుకున్నాడు. ఇది అతడి సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కిన తొలి చిత్రం కావడం విశేషం.
ప్రస్తుతం తెలుగులో పెద్ద స్టార్గా ఎదిగిన రష్మిక మందన్నాకు తెలుగులో అరంగేట్ర చిత్రం ఇదే. అలాగే దర్శకుడిగా మంచి స్థాయిని అందుకున్న వెంకీ కుడుములకు కూడా ఇదే తొలి సినిమా. ఇలా చాలామంది జీవితాలను మార్చేసింది ఛలో. అంత ప్రత్యేకమైన చిత్రానికి మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో చిత్ర బృందంలోని ముగ్గురు కీలక వ్యక్తులు సోషల్ మీడియాలో స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది.
ముందుగా రష్మిక ఈ సినిమా ఆన్ లొకేషన్ ఫొటోలు పెట్టి ఎమోషనల్గా ఒక ఫొటో పెట్టింది. అందులో ప్రధానంగా దర్శకుడు వెంకీతో పాటు తాను హైలైట్ అయ్యేలా చూసింది. నాగశౌర్య ఒక ఫొటోలో నామమాత్రంగా కనిపించాడు. వెంకీ దీనికి స్పందిస్తూ రష్మిక పెద్ద హీరోయిన్ అవుతుందన్న తన అంచనా నిజమైందంటూ ఒక ఫొటోను షేర్ చేశాడు. అతను ఈ రిప్లైలో కానీ, వేరుగా ఛలో మూడో వార్షికోత్సవం గురించి పెట్టిన పోస్టులో కానీ నాగశౌర్య పేరే ప్రస్తావించలేదు.
మరోవైపు నాగశౌర్య ఏమో ఈ సినిమాతో నిర్మాతగా పరిచయమైన తన తల్లి గురించి ఒక పోస్టు పెట్టాడు. అంతే తప్ప దర్శకుడు వెంకీ ప్రస్తావన తేలేదు. రష్మిక ఊసూ ఎత్తలేదు. ఛలో రిలీజ్ తర్వాత వెంకీకి, నాగశౌర్యకు తీవ్ర విభేదాలు తలెత్తడం.. ముఖ్యంగా శౌర్య వెంకీని టార్గెట్ చేయడం.. తాము బహుమతిగా ఇచ్చిన కారును వెంకీ వాడలేదంటూ అతణ్ని తక్కువ చేసి మాట్లాడ్డం.. ఆ తర్వాత వెంకీ వివరణ ఇవ్వడం తెలిసిందే. అప్పుడు మొదలైన గ్యాప్ ఇప్పటికీ కొనసాగుతోందని, ఇప్పుడు ఇంకా పెరిగిందని తాజా సోషల్ మీడియా పోస్టులను బట్టి స్పష్టమవుతోంది. చూస్తుంటే రష్మికకు, శౌర్యకు మధ్య కూడా సత్సంబంధాలు లేవని అర్థమవుతోంది.
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…
పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…
రాజకీయ చతురతలో మరోసారి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చాణక్యం వెలుగు చూసింది. ఇంకేముంది.. సర్కారును ఇరుకున పెట్టేసి.. కుల,…
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల ఫిజిక్, లుక్స్ మీద రకరకాల కామెంట్స్ రావడం చాలా కామన్. కొంచెం బరువు పెరిగినా లేదా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. గతంలో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో…
రాజకీయ నాయకులను దేవుళ్లుగా పూజించే ఘటనలు కొత్తవి కావు. సినిమా నటులకు, రాజకీయ నాయకులకు గుడులు కట్టడం, ప్రత్యేక పూజలు…