తెలుగు వాడైన తమిళ యాక్షన్ హీరో విశాల్ గత ఏడాది కరోనా కంటే ముందే ‘చక్ర’ అనే సినిమాను పూర్తి చేశాడు. లాక్ డౌన్ టైంలో దాని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరిగాయి. వరుసగా కొత్త సినిమాలన్నీ ఓటీటీ బాట పడుతున్న సమయంలో ‘చక్ర’ను కూడా అదే తరహాలో విడుదల చేయబోతున్నట్లు గట్టి ప్రచారం జరిగింది.
ఓటీటీల్లో కొత్త సినిమాల సందడి నెలకొన్న సమయంలోనే ఈ సినిమా ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. దీంతో అది డిజిటల్ రిలీజ్కు రెడీ అయిపోయిందనే ప్రచారం ఊపందుకుంది. జీ5 వాళ్లు ఫ్యాన్సీ రేటుకు ఈ సినిమాను కొనేశారని, పే పర్ వ్యూ పద్ధతిలో సినిమాను రిలీజ్ చేయబోతున్నారని వార్తలొచ్చాయి. రిలీజ్ డేట్ గురించి కూడా మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. కానీ ఎంతకీ ఈ సినిమా విడుదల కాలేదు. చూస్తుండగానే నెలలు నెలలు గడిచిపోయాయి.
ఐతే ఇప్పుడు విశాల్ వచ్చి కొత్త కబురు చెప్పాడు. ఉన్నట్లుండి ‘చక్ర’ సినిమా థియేట్రికల్ రిలీజ్కు రెడీ అయినట్లు వెల్లడించాడు. రెండు మూడు రోజులుగా మీడియాలో ఈ దిశగానే వార్తలొస్తున్నాయి. విశాల్ స్వయంగా ట్విట్టర్లో ఈ ప్రచారాన్ని ధ్రువీకరించాడు. తన సినిమా థియేటర్లలో విడుదల కాబోతున్న మాట వాస్తవమే అని.. ఫిబ్రవరి 19న ఈ చిత్రాన్ని తమిళంతో పాటు మిగతా మూడు దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుందని విశాల్ ప్రకటించాడు. దీంతో ఉన్నట్లుండి విశాల్ ఇలా యు టర్న్ తీసుకున్నాడేమిటి అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు.
తెలుగులో ‘సోలో బ్రతుకే సో బెటర్’ తరహాలోనే జీ గ్రూప్ వాళ్లు సినిమాను హోల్సేల్గా కొనేసి ముందు థియేటర్లలో ఆ తర్వాత డిజిటల్, శాటిలైట్ రిలీజ్కు ప్లాన్ చేసుకున్నారా.. లేక వారితో డీల్ క్యాన్సిల్ అయి విశాల్ ఈ చిత్రాన్ని ముందు థియేటర్లలో రిలీజ్ చేయించి వేరుగా డిజిటల్, శాటిలైట్ హక్కులు అమ్ముతాడా అన్న దానిపై స్పష్టత లేదు. ఆనందన్ అనే దర్శకుడు రూపొందించిన ఈ చిత్రాన్ని విశాల్ హిట్ మూవీ ‘ఇరుంబు తిరై‘ (అభిమన్యుడు)కు సీక్వెల్గా భావిస్తున్నారు. ఇందులో శ్రద్ధ శ్రీనాథ్ కథానాయిక కాగా.. రెజీనా విలన్ పాత్ర పోషించినట్లు సమాచారం.
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…