తమిళ స్టార్ హీరో ధనుష్కు ఇప్పుడో పెద్ద చిక్కొచ్చి పడింది. అతడితో సినిమాలు తీసిన ఇద్దరు నిర్మాతలు భిన్నంగా ఆలోచించడంతో అతడికి తలనొప్పి తెచ్చి పెట్టింది. కరోనా-లాక్డౌన్ కంటే ముందు ధనుష్.. యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్తో ‘జగమే తంత్రం’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని గత ఏడాది వేసవిలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ వైరస్ ప్రభావంతో వాయిదా పడింది. మధ్యలో ఓటీటీల నుంచి చాలానే ఆఫర్లు వచ్చినా చిత్ర బృందం తొణకలేదు. థియేటర్లలోనే తమ సినిమా విడుదలవుతుందని ప్రకటన చేసింది. కానీ ఇప్పుడు థియేటర్లు తెరుచుకుని నెలలు గడుస్తున్నా ‘జగమే తంత్రం’ను విడుదల చేయట్లేదు.
తాజాగా కేంద్ర ప్రభుత్వం థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశమిచ్చింది కూడా. అదే సమయానికి ‘జగమే తంత్రం’ ఓటీటీ రిలీజ్ అంటూ వార్త బయటికి వచ్చింది. ఈ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ వాళ్లకు అమ్మేశారని.. త్వరలోనే ప్రిమియర్స్ పడబోతున్నాయని అంటున్నారు.
ఈ ప్రచారాన్ని చిత్ర బృందం ఖండించకపోవడంతో ధనుష్ అభిమానులు మంటెత్తి పోతున్నారు. థియేట్రికల్ రిలీజ్ కోసమే ఇన్నాళ్లు ఎదురు చూస్తే ఇప్పుడు ఓటీటీలో విడుదల చేస్తారా అంటూ నిన్నట్నుంచి సోషల్ మీడియాను హోరెత్తించేస్తున్నారు. కానీ ‘జగమే తంత్రం’ టీం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇదిలా ఉంటే ఆదివారం ధనుష్ నటించిన మరో సినిమా ‘కర్ణన్’ నుంచి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్లో విడుదలవుతుందంటూ ఒక ఆసక్తికర టీజర్ వదిలారు. ధనుష్ కత్తి పట్టి రణరంగానికి సిద్ధమవుతున్నట్లుగా ఉన్న ఆ టీజర్ ఆకట్టుకుంది. ఈ చిత్రం ఏప్రిల్లో ‘థియేటర్లలోనే’ రిలీజవుతుందని నొక్కి వక్కాణించారు.
‘కర్ణన్’ థియేటర్లలో వస్తుందంటే తన అభిమానులు శాంతిస్తారన్న ఉద్దేశంతో ధనుష్ ఈ ప్రకటన చేయించాడో ఏమో కానీ.. వాళ్లయితే తమ ఆగ్రహాన్ని కొనసాగిస్తున్నారు. ‘జగమే తంత్రం’ మీద భారీ అంచనాలున్న నేపథ్యంలో అలాంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. దీంతో ఆ దిశగా డిమాండ్లు చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కొనసాగిస్తున్నారు.
This post was last modified on January 31, 2021 4:41 pm
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్యుత్తమమైన, విభిన్నమైన చిత్రాల్లో అరవింద సమేత ఒకటి. అందులో కీలక పాత్రలు పోషించిన ఆర్టిస్టులందరికీ మంచి…
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ కెరీర్లో చూడాలని ఉంది, ఒక్కడు లాంటి బ్లాక్బస్టర్లతో పాటు సైనికుడు, వరుడు, నిప్పు లాంటి దారుణమైన…
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో రియల్మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్ను విడుదల చేసింది.…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…
అమ్మాయిది అగ్రకులం... అబ్బాయిది వెనుకుబడిన కులం...ఇద్దరూ ప్రేమించుకున్నారు...కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు...ఆ తర్వాత ఆ ప్రేమ…
ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ…