Movie News

ప్రభాస్‌కు పాఠం నేర్పిన నాగ్ అశ్విన్

ప్రభాస్ హీరోగా వైజయంతీ మూవీస్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ రూపొందించనున్న చిత్రం స్థాయి ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రూ.400 కోట్లకు పైగా బడ్జెట్లో ఈ సినిమా తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్‌యే స్వయంగా ప్రకటించారు. ముందు నుంచి దీన్ని అంతర్జాతీయ స్థాయి సినిమాగానే చెబుతున్నారు. ‘ఆదిత్య 369’ మోడర్న్ వెర్షన్‌గా దీన్ని అభివర్ణిస్తున్న సంగతీ తెలిసిందే. ఇంత పెద్ద స్థాయి సినిమా అన్నాక ఇండియాలో టాప్ టెక్నీషియన్లను తీసుకోవడానికి చూస్తారు ఎవరైనా.
దేశవ్యాప్తంగా పాపులారిటీ, రేంజ్ అన్నీ చూసుకుని టెక్నీషియన్ల ఎంపిక జరుగుతుందని అనుకుంటారు. కానీ నాగ్ అశ్విన్ మాత్రం భిన్నమైన దారిలో నడిచాడు. బ్రాండ్ వాల్యూ, పాపులారిటీ వంటి విషయాలు పట్టించుకోకుండా తన కంఫర్ట్ చూసుకున్నాడు. తన అభిరుచికి తగ్గట్లు పని చేసే, తనతో మంచి సమన్వయం ఉన్న టెక్నీషియన్లనే ఎంచుకున్నాడు.
‘మహానటి’కి తన ఛాయాగ్రహణంతో డానీ లోపెజ్ సాంచెజ్, తన సంగీతంతో మిక్కీ జే మేయర్ ఎలా ప్రాణం పోశారో తెలిసిందే. ఆ సినిమా క్లాసిక్ స్టేటస్ అందుకోవడంలో వాళ్లిద్దరిదీ కూడా ముఖ్య పాత్ర.

ఐతే ప్రభాస్ సినిమా రేంజ్ ఎక్కువ కాబట్టి ఇంకా పెద్ద స్థాయి టెక్నీషియన్లను తీసుకుందామనో.. సంగీతం విషయానికి వస్తే పాటలు వేర్వేరు సంగీత దర్శకులతో, నేపథ్య సంగీతం ఒకరితో చేయించి దీని రేంజ్ పెంచుదామనో అశ్విన్ చూడలేదు. తన టెక్నీషియన్ల రేంజ్ చూడకుండా వాళ్ల టాలెంట్ మీద నమ్మకం పెట్టాడు. తనకేం కావాలో వాళ్ల నుంచి రాబట్టుకోగలనని నమ్మాడు. అందుకే డానీ, మిక్కీలను ఎంచుకున్నాడు. ఇది ఒక రకంగా ప్రభాస్ నేర్చుకోవాల్సిన పాఠమే.

‘సాహో’ విషయంలో ఈ స్పష్టత లేక సంగీతం విషయంలో కంగాళీ అయింది. పాన్ ఇండియా సినిమా అని చెప్పి.. లోకల్ సంగీత దర్శకుల్ని అతను నమ్మలేదు. బాలీవుడ్ మీద పడింది చిత్ర బృందం. ఒక్కో సంగీత దర్శకుడితో ఒక్కో పాట చేయించారు. బ్యాగ్రౌండ్ స్కోర్ ఒకరితో చేయించుకున్నారు. ఈ విషయంలో బాగా హడావుడి అయింది. చివరికి చూస్తే పాటలు సినిమాకు ప్లస్ కాలేకపోయాయి. బ్రాండ్ కోసం చూసి అయిన కాడికి ఖర్చు పెడితే చివరికి వచ్చిన ఫలితమిది. అశ్విన్ అలా కాకుండా మిక్కీ మీద భరోసా ఉంచాడు. ‘సాహో’ అనుభవం తర్వాత ‘రాధేశ్యామ్’ సంగీత దర్శకుడి విషయంలోనూ మీనమేషాలు లెక్కించిన చిత్ర బృందం.. చాలా ఆలస్యంగా ‘డియర్ కామ్రేడ్’ ఫేమ్ జస్టిన్ ప్రభాకరన్‌కు బాధ్యతలు అప్పగించింది. బహుశా అశ్విన్ ప్రభావం కూడా ప్రభాస్ మీద కొంత ఉండి ఉండొచ్చేమో. ‘ఆదిపురుష్’ విషయంలోనూ ‘సాహో’ మాదిరి ప్రభాస్ అండ్ కో ‘అతి’ చేయకుంటే మంచిది.

Satya

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

5 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

6 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

8 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

8 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

9 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

9 hours ago