టాలీవుడ్ టాప్ స్టార్లు డీగ్లామరస్గా కనిపించడానికి పెద్దగా ఇష్టపడరు. సిక్స్ ప్యాక్స్ అవీ చేసి, ఫిజిక్ మార్చుకుని కనిపించడానికి సిద్ధం అంటారే కానీ.. డీగ్లామరస్ రోల్స్ అంటే మాత్రం దండం పెట్టేస్తారు. తమిళంలో విక్రమ్ లాగానో, సూర్య మాదిరో గుండ్లు చేయించుకోమన్నా.. లేదా అడ్డదిడ్డంగా జుట్టు, గడ్డం పెంచమన్నా.. మురికి బట్టలతో కనిపించమంటే అంతే సంగతులు. ఇప్పటిదాకా టాలీవుడ్ స్టార్లెవ్వరూ కూడా అలాంటి రోల్స్ చేయనే లేదు.
ఐతే తొలిసారి అల్లు అర్జున్ ఈ సాహసం చేస్తున్నాడు. ‘పుష్ప’ సినిమా కోసం అతను ఎలాంటి అవతారం ఎత్తాడో ఇప్పటికే చూశాం. ఫస్ట్ లుక్, ఆన్ లొకేషన్ స్టిల్స్ చూసి బన్నీ అభిమానులతో సహా అందరూ షాకైపోయారు. కొందరు దీనిపై నెగెటివ్ కామెంట్లు కూడా చేశారు. బన్నీ శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మలింగలా తయారయ్యాడని కౌంటర్లు వేశారు. కానీ బన్నీ అండ్ కో అవేమీ పట్టించుకోలేదు.
ముందు బన్నీ స్టిల్స్ చూసి సినిమాలో కొంత సేపు మాత్రమే ఈ లుక్లో కనిపిస్తాడేమో.. మళ్లీ అవతారం మార్చుకుని మామూలుగా తయారవుతాడేమో అనుకున్నారు. కానీ లేటెస్ట్గా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ చూస్తే బన్నీ మరింత నాటుగా, ఊర మాస్గా కనిపించాడు. ఇది మామూలు డీగ్లామర్ రోల్ కాదు అనిపిస్తోంది ఈ పోస్టర్ చూస్తే. తమిళ స్టార్లు సైతం మరీ ఇంత నాటుగా కనిపించడానికి సందేహిస్తారేమో అనిపిస్తోంది.
‘అల వైకుంఠపురములో’ అంత స్టైలిష్గా కనిపించి ఒక్కసారిగా ఇంత మేకోవర్ అంటే సామాన్యమైన విషయం కాదు. ఇలాంటి పాత్రను డిజైన్ చేసిన సుక్కుకు, దర్శకుడిని నమ్మి ఆయన చెప్పినట్లు కనిపించడానికి ఒప్పుకున్న బన్నీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇలాంటి గట్స్ అందరికీ ఉండవు. ఈ సినిమా అంచనాలకు తగ్గట్లు ఆడితే, బన్నీ చేస్తున్న పుష్పరాజ్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటే ఇదో ట్రెండ్ సెట్టర్ అయ్యే అవకాశముంది. మున్ముందు మిగతా స్టార్లు కూడా ఇలాంటి డీగ్లామరస్ రోల్స్ చేయడానికి ధైర్యం చేయొచ్చు.
This post was last modified on January 28, 2021 3:42 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…