టాలీవుడ్ టాప్ స్టార్లు డీగ్లామరస్గా కనిపించడానికి పెద్దగా ఇష్టపడరు. సిక్స్ ప్యాక్స్ అవీ చేసి, ఫిజిక్ మార్చుకుని కనిపించడానికి సిద్ధం అంటారే కానీ.. డీగ్లామరస్ రోల్స్ అంటే మాత్రం దండం పెట్టేస్తారు. తమిళంలో విక్రమ్ లాగానో, సూర్య మాదిరో గుండ్లు చేయించుకోమన్నా.. లేదా అడ్డదిడ్డంగా జుట్టు, గడ్డం పెంచమన్నా.. మురికి బట్టలతో కనిపించమంటే అంతే సంగతులు. ఇప్పటిదాకా టాలీవుడ్ స్టార్లెవ్వరూ కూడా అలాంటి రోల్స్ చేయనే లేదు.
ఐతే తొలిసారి అల్లు అర్జున్ ఈ సాహసం చేస్తున్నాడు. ‘పుష్ప’ సినిమా కోసం అతను ఎలాంటి అవతారం ఎత్తాడో ఇప్పటికే చూశాం. ఫస్ట్ లుక్, ఆన్ లొకేషన్ స్టిల్స్ చూసి బన్నీ అభిమానులతో సహా అందరూ షాకైపోయారు. కొందరు దీనిపై నెగెటివ్ కామెంట్లు కూడా చేశారు. బన్నీ శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మలింగలా తయారయ్యాడని కౌంటర్లు వేశారు. కానీ బన్నీ అండ్ కో అవేమీ పట్టించుకోలేదు.
ముందు బన్నీ స్టిల్స్ చూసి సినిమాలో కొంత సేపు మాత్రమే ఈ లుక్లో కనిపిస్తాడేమో.. మళ్లీ అవతారం మార్చుకుని మామూలుగా తయారవుతాడేమో అనుకున్నారు. కానీ లేటెస్ట్గా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ చూస్తే బన్నీ మరింత నాటుగా, ఊర మాస్గా కనిపించాడు. ఇది మామూలు డీగ్లామర్ రోల్ కాదు అనిపిస్తోంది ఈ పోస్టర్ చూస్తే. తమిళ స్టార్లు సైతం మరీ ఇంత నాటుగా కనిపించడానికి సందేహిస్తారేమో అనిపిస్తోంది.
‘అల వైకుంఠపురములో’ అంత స్టైలిష్గా కనిపించి ఒక్కసారిగా ఇంత మేకోవర్ అంటే సామాన్యమైన విషయం కాదు. ఇలాంటి పాత్రను డిజైన్ చేసిన సుక్కుకు, దర్శకుడిని నమ్మి ఆయన చెప్పినట్లు కనిపించడానికి ఒప్పుకున్న బన్నీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇలాంటి గట్స్ అందరికీ ఉండవు. ఈ సినిమా అంచనాలకు తగ్గట్లు ఆడితే, బన్నీ చేస్తున్న పుష్పరాజ్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటే ఇదో ట్రెండ్ సెట్టర్ అయ్యే అవకాశముంది. మున్ముందు మిగతా స్టార్లు కూడా ఇలాంటి డీగ్లామరస్ రోల్స్ చేయడానికి ధైర్యం చేయొచ్చు.
This post was last modified on January 28, 2021 3:42 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…