టాలీవుడ్లో ఎప్పుడూ ఒక హీరో పారితోషకం గురించి తరచుగా చర్చ జరుగుతూ ఉంటుంది. ఆ హీరో మాస్ రాజా రవితేజ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మాస్ రాజా పారితోషకం పెంచేశాడని.. తగ్గించుకోమన్నా తగ్గించుకోవట్లేదని తరచుగా రూమర్లు వినిపిస్తుంటాయి టాలీవుడ్ సర్కిల్స్లో. రెమ్యూనరేషన్ విషయంలో రవితేజ అస్సలు రాజీ పడడని అంటుంటారు. ఫ్లాపుల్లో ఉన్నపుడు కూడా ఎక్కువ పారితోషకాలు డిమాండ్ చేసి నిర్మాతల్ని ఇబ్బంది పెడుతుంటాడని కూడా వార్తలు వినిపిస్తుంటాయి.
ఐతే ఇప్పుడు మాస్ రాజా కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు ‘క్రాక్’తో. కరోనా విరామం తర్వాత, థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తుండగా మరో మూడు చిత్రాలతో పోటీ పడి సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం అనూహ్యమైన వసూళ్లు సాధించింది. ఇప్పటికే రూ.30 కోట్ల షేర్ మార్కును దాటేసి రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది.
ఈ నేపథ్యంలో మాస్ రాజా మళ్లీ పారితోషకం పెంచేశాడని అంటున్నారు. ఇంతకుముందు రూ.10-12 కోట్ల మధ్య తీసుకున్న రవితేజ.. ఇప్పుడు రూ.15 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. రవితేజ తీరు తెలిసిన వాళ్లకు ఇదేమీ ఆశ్చర్యంగా అనిపించడం లేదు. ఐతే రవితేజ సినిమా హిట్టయితే ఆ పారితోషకం పెద్ద విషయమే కాదు అని, ఆయన అన్నీ ఓకే అనుకున్న వాళ్లే సినిమాలు నిర్మిస్తారు కాబట్టి దీనిపై ఇతరులు రచ్చ చేయాల్సిన అవసరం లేదని అతడి సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
ప్రస్తుతం మాస్ రాజా రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా చేస్తున్నాడు. రమేష్ వర్మ ట్రాక్ రికార్డు ఏమంత బాగా లేదు. ప్రొడ్యూస్ చేస్తున్నది పేరున్న నిర్మాత కాదు. హీరోయిన్లూ కొత్త వాళ్లే. నేపథ్యంలో ఈ సినిమాకు రవితేజ పేరు మీదే బిజినెస్ జరగాలి. ఇలాంటి సినిమాకు రవితేజ రూ.15 కోట్ల పారితోషకం తీసుకుంటే తప్పేంటన్నది అతడి సన్నిహితుల మాట.
This post was last modified on January 27, 2021 11:29 am
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…