సోషల్ మీడియాలో జరిగే నెటిజన్ల కామెంట్లు, వాళ్లు చేసే ట్రోలింగ్నంతా పట్టించుకుంటే సెలబ్రెటీల బండి నడవడం చాలా కష్టం. అలాంటి వాటిని చూసీ చూడనట్లు వెళ్లిపోవాల్సిందే. అదే సమయంలో ఎవరైనా నిర్మాణాత్మక విమర్శలు చేస్తే, తప్పుల్ని ఎత్తి చూపితే వాటికి స్పందించి దిద్దుకునే ప్రయత్నం చేయడమూ మంచిదే. కానీ నెగెటివ్ కామెంట్లను సానుకూలంగా తీసుకునే మనస్తత్వం అందరికీ ఉండదు. ఐతే మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్ ఓ నెటిజన్ తన గురించి చేసిన కామెంట్కు ఫీలైపోకుండా తన తప్పును దిద్దుకుంటానని వినమ్రంగా చెప్పడం ట్విట్టర్ జనాలను ఆకట్టుకుంటోంది.
నిన్ననే రిలీజ్ చేసిన తేజు కొత్త చిత్రం ‘రిపబ్లిక్’ టైటిల్ మోషన్ పోస్టర్లో.. ‘‘యువరానర్.. ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకులు.. శాసనాలను అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు.. న్యాయాన్ని కాపాడే కోర్టు.. ఈ మూడు గుర్రాలు ఒకరి తప్పులు ఒకరు దిద్దుకుంటూ క్రమబద్దంగా సాగినపుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది.. ప్రభుత్వం అవుతుంది.. అదే అసలైన రిపబ్లిక్’’ అన్న వాయిస్ ఓవర్ వినిపించిన సంగతి తెలిసిందే. ఐతే ఓ నెటిజన్ మోషన్ పోస్టర్ మీద స్పందిస్తూ.. తేజు ‘ప్రభుత్వ ఉద్యోగులు’ అనే మాటను కూడా సరిగా పలకలేకపోయాడని.. దర్శకుడు దేవా కట్టా సినిమాల్లో డైలాగులకు అధిక ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడాలని సూచిస్తూ ఓ ట్వీట్ వేశాడు.
ఐతే తన గురించి ఇలాంటి కామెంట్ చేస్తే ఏ హీరో అయినా ఫీలవుతాడు. కానీ తేజు అలా ఏమీ హర్టయిపోకుండా వినమ్రంగా ఆ నెటిజన్కు బదులిచ్చాడు. తనలోని ఈ లోపాన్ని ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు చెబుతూ, దాని మీద పని చేస్తానని ఆ నెటిజన్ను పేరు పెట్టి సంబోధిస్తూ ట్వీట్ వేయడం విశేషం. తప్పు ఒప్పుకుని సరిదిద్దుకుంటానని చెప్పడానికి గట్స్ ఉండాలని, తేజు ఆ పని చేసి తన ప్రత్యేకతను చాటుకున్నాడని అతడిని నెటిజన్లు పొగిడేస్తున్నారు.
This post was last modified on January 26, 2021 4:08 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…