సోషల్ మీడియాలో జరిగే నెటిజన్ల కామెంట్లు, వాళ్లు చేసే ట్రోలింగ్నంతా పట్టించుకుంటే సెలబ్రెటీల బండి నడవడం చాలా కష్టం. అలాంటి వాటిని చూసీ చూడనట్లు వెళ్లిపోవాల్సిందే. అదే సమయంలో ఎవరైనా నిర్మాణాత్మక విమర్శలు చేస్తే, తప్పుల్ని ఎత్తి చూపితే వాటికి స్పందించి దిద్దుకునే ప్రయత్నం చేయడమూ మంచిదే. కానీ నెగెటివ్ కామెంట్లను సానుకూలంగా తీసుకునే మనస్తత్వం అందరికీ ఉండదు. ఐతే మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్ ఓ నెటిజన్ తన గురించి చేసిన కామెంట్కు ఫీలైపోకుండా తన తప్పును దిద్దుకుంటానని వినమ్రంగా చెప్పడం ట్విట్టర్ జనాలను ఆకట్టుకుంటోంది.
నిన్ననే రిలీజ్ చేసిన తేజు కొత్త చిత్రం ‘రిపబ్లిక్’ టైటిల్ మోషన్ పోస్టర్లో.. ‘‘యువరానర్.. ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకులు.. శాసనాలను అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు.. న్యాయాన్ని కాపాడే కోర్టు.. ఈ మూడు గుర్రాలు ఒకరి తప్పులు ఒకరు దిద్దుకుంటూ క్రమబద్దంగా సాగినపుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది.. ప్రభుత్వం అవుతుంది.. అదే అసలైన రిపబ్లిక్’’ అన్న వాయిస్ ఓవర్ వినిపించిన సంగతి తెలిసిందే. ఐతే ఓ నెటిజన్ మోషన్ పోస్టర్ మీద స్పందిస్తూ.. తేజు ‘ప్రభుత్వ ఉద్యోగులు’ అనే మాటను కూడా సరిగా పలకలేకపోయాడని.. దర్శకుడు దేవా కట్టా సినిమాల్లో డైలాగులకు అధిక ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడాలని సూచిస్తూ ఓ ట్వీట్ వేశాడు.
ఐతే తన గురించి ఇలాంటి కామెంట్ చేస్తే ఏ హీరో అయినా ఫీలవుతాడు. కానీ తేజు అలా ఏమీ హర్టయిపోకుండా వినమ్రంగా ఆ నెటిజన్కు బదులిచ్చాడు. తనలోని ఈ లోపాన్ని ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు చెబుతూ, దాని మీద పని చేస్తానని ఆ నెటిజన్ను పేరు పెట్టి సంబోధిస్తూ ట్వీట్ వేయడం విశేషం. తప్పు ఒప్పుకుని సరిదిద్దుకుంటానని చెప్పడానికి గట్స్ ఉండాలని, తేజు ఆ పని చేసి తన ప్రత్యేకతను చాటుకున్నాడని అతడిని నెటిజన్లు పొగిడేస్తున్నారు.
This post was last modified on January 26, 2021 4:08 pm
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై…
చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు తమ సోషల్ మీడియా అకౌంట్లను సబ్స్క్రిప్షన్ మోడ్లోకి మార్చి, వాటి ద్వారా హాట్…
టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…