సోషల్ మీడియాలో జరిగే నెటిజన్ల కామెంట్లు, వాళ్లు చేసే ట్రోలింగ్నంతా పట్టించుకుంటే సెలబ్రెటీల బండి నడవడం చాలా కష్టం. అలాంటి వాటిని చూసీ చూడనట్లు వెళ్లిపోవాల్సిందే. అదే సమయంలో ఎవరైనా నిర్మాణాత్మక విమర్శలు చేస్తే, తప్పుల్ని ఎత్తి చూపితే వాటికి స్పందించి దిద్దుకునే ప్రయత్నం చేయడమూ మంచిదే. కానీ నెగెటివ్ కామెంట్లను సానుకూలంగా తీసుకునే మనస్తత్వం అందరికీ ఉండదు. ఐతే మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్ ఓ నెటిజన్ తన గురించి చేసిన కామెంట్కు ఫీలైపోకుండా తన తప్పును దిద్దుకుంటానని వినమ్రంగా చెప్పడం ట్విట్టర్ జనాలను ఆకట్టుకుంటోంది.
నిన్ననే రిలీజ్ చేసిన తేజు కొత్త చిత్రం ‘రిపబ్లిక్’ టైటిల్ మోషన్ పోస్టర్లో.. ‘‘యువరానర్.. ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకులు.. శాసనాలను అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు.. న్యాయాన్ని కాపాడే కోర్టు.. ఈ మూడు గుర్రాలు ఒకరి తప్పులు ఒకరు దిద్దుకుంటూ క్రమబద్దంగా సాగినపుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది.. ప్రభుత్వం అవుతుంది.. అదే అసలైన రిపబ్లిక్’’ అన్న వాయిస్ ఓవర్ వినిపించిన సంగతి తెలిసిందే. ఐతే ఓ నెటిజన్ మోషన్ పోస్టర్ మీద స్పందిస్తూ.. తేజు ‘ప్రభుత్వ ఉద్యోగులు’ అనే మాటను కూడా సరిగా పలకలేకపోయాడని.. దర్శకుడు దేవా కట్టా సినిమాల్లో డైలాగులకు అధిక ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడాలని సూచిస్తూ ఓ ట్వీట్ వేశాడు.
ఐతే తన గురించి ఇలాంటి కామెంట్ చేస్తే ఏ హీరో అయినా ఫీలవుతాడు. కానీ తేజు అలా ఏమీ హర్టయిపోకుండా వినమ్రంగా ఆ నెటిజన్కు బదులిచ్చాడు. తనలోని ఈ లోపాన్ని ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు చెబుతూ, దాని మీద పని చేస్తానని ఆ నెటిజన్ను పేరు పెట్టి సంబోధిస్తూ ట్వీట్ వేయడం విశేషం. తప్పు ఒప్పుకుని సరిదిద్దుకుంటానని చెప్పడానికి గట్స్ ఉండాలని, తేజు ఆ పని చేసి తన ప్రత్యేకతను చాటుకున్నాడని అతడిని నెటిజన్లు పొగిడేస్తున్నారు.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…