సోషల్ మీడియాలో జరిగే నెటిజన్ల కామెంట్లు, వాళ్లు చేసే ట్రోలింగ్నంతా పట్టించుకుంటే సెలబ్రెటీల బండి నడవడం చాలా కష్టం. అలాంటి వాటిని చూసీ చూడనట్లు వెళ్లిపోవాల్సిందే. అదే సమయంలో ఎవరైనా నిర్మాణాత్మక విమర్శలు చేస్తే, తప్పుల్ని ఎత్తి చూపితే వాటికి స్పందించి దిద్దుకునే ప్రయత్నం చేయడమూ మంచిదే. కానీ నెగెటివ్ కామెంట్లను సానుకూలంగా తీసుకునే మనస్తత్వం అందరికీ ఉండదు. ఐతే మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్ ఓ నెటిజన్ తన గురించి చేసిన కామెంట్కు ఫీలైపోకుండా తన తప్పును దిద్దుకుంటానని వినమ్రంగా చెప్పడం ట్విట్టర్ జనాలను ఆకట్టుకుంటోంది.
నిన్ననే రిలీజ్ చేసిన తేజు కొత్త చిత్రం ‘రిపబ్లిక్’ టైటిల్ మోషన్ పోస్టర్లో.. ‘‘యువరానర్.. ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకులు.. శాసనాలను అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు.. న్యాయాన్ని కాపాడే కోర్టు.. ఈ మూడు గుర్రాలు ఒకరి తప్పులు ఒకరు దిద్దుకుంటూ క్రమబద్దంగా సాగినపుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది.. ప్రభుత్వం అవుతుంది.. అదే అసలైన రిపబ్లిక్’’ అన్న వాయిస్ ఓవర్ వినిపించిన సంగతి తెలిసిందే. ఐతే ఓ నెటిజన్ మోషన్ పోస్టర్ మీద స్పందిస్తూ.. తేజు ‘ప్రభుత్వ ఉద్యోగులు’ అనే మాటను కూడా సరిగా పలకలేకపోయాడని.. దర్శకుడు దేవా కట్టా సినిమాల్లో డైలాగులకు అధిక ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడాలని సూచిస్తూ ఓ ట్వీట్ వేశాడు.
ఐతే తన గురించి ఇలాంటి కామెంట్ చేస్తే ఏ హీరో అయినా ఫీలవుతాడు. కానీ తేజు అలా ఏమీ హర్టయిపోకుండా వినమ్రంగా ఆ నెటిజన్కు బదులిచ్చాడు. తనలోని ఈ లోపాన్ని ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు చెబుతూ, దాని మీద పని చేస్తానని ఆ నెటిజన్ను పేరు పెట్టి సంబోధిస్తూ ట్వీట్ వేయడం విశేషం. తప్పు ఒప్పుకుని సరిదిద్దుకుంటానని చెప్పడానికి గట్స్ ఉండాలని, తేజు ఆ పని చేసి తన ప్రత్యేకతను చాటుకున్నాడని అతడిని నెటిజన్లు పొగిడేస్తున్నారు.
This post was last modified on January 26, 2021 4:08 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…