‘టక్ జగదీష్’ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసుకునే వీలున్నా కానీ ఆ చిత్ర బృందం సంక్రాంతి రేసులోకి వెళ్లకూడదంటూ తాపీగా సినిమా ముగించుకున్నారు. కరోనాతో తలనొప్పి దేనికిలెమ్మని హ్యాపీగా ఏప్రిల్ రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. అందరికంటే ముందుగా స్లాట్ బుక్ చేసుకుని ఏప్రిల్ 16న విడుదల చేస్తున్నట్టు ప్రకటించేసారు. అయితే ఆ రోజు టక్ జగదీష్ వుందని తెలిసినా కానీ ‘లవ్స్టోరీ’ నిర్మాతలు ఏప్రిల్ 16నే తమ సినిమా రిలీజ్ ప్రకటించారు. నాగచైతన్య, సాయి పల్లవితో పాటు శేఖర్ కమ్ముల బ్రాండింగ్ కూడా కలిసిన ‘లవ్స్టోరీ’తో పోటీ అంటే ‘టక్ జగదీష్’కు కాస్త ఇబ్బందే. అఫ్కోర్స్ నాని సినిమాతో పోటీ వల్ల ‘లవ్స్టోరీ’కి కూడా ఇబ్బంది తప్పదు.
అనుకోకుండా ఈ రిలీజ్ డేట్లు వస్తే అనుకోవచ్చు కానీ తెలిసి తెలిసీ లవ్స్టోరీ నిర్మాతలు ఈ డేట్ ఫిక్స్ చేసారు. మరిప్పుడు ఈ రెండు సినిమాలు ఒకే రోజు తలపడతాయా లేక తల్లీ బిడ్డా న్యాయమంటూ తలా ఒక తేదీని ఫిక్సవుతాయా అనేది ఆయా సినిమాల నిర్మాతల మధ్య జరిగే చర్చలతో ముడిపడి వుంటుంది. కానీ ఈ సినిమాలు కొన్న వాళ్లు మాత్రం ఈ న్యూస్తో హ్యాపీగా వుండరు. ఎందుకంటే ఈ రెండు సినిమాల బిజినెస్ రేంజ్తో పాటు టార్గెట్ ఆడియన్స్ కూడా ఒకరే. అందుకే సేమ్ డేట్కి రెండు సినిమాలు రావడం ఆల్మోస్ట్ సూసైడ్ లాంటిదే.
అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…
మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…
పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…