టాలీవుడ్లో చిన్న, పెద్ద అని తేడా లేకుండా రెండు రకాల సినిమాలూ నిర్మించే ప్రొడ్యూసర్ అనిల్ సుంకర. 14 రీల్స్ బేనర్లో రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంటలతో కలిసి ఆయన నమో వెంకటేశ, దూకుడు, 1 నేనొక్కడినే, ఆగడు లాంటి భారీ చిత్రాలు నిర్మించారు. అవి చేస్తుండగానే ఏకే ఎంటర్టైన్మెంట్స్ పేరుతో సొంతంగా ఓ బేనర్ పెట్టి చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేశారు.
ఒకప్పుడు అందులో చేసిన సినిమాల్లో కొన్ని ఆడాయి. కొన్ని పోయాయి. మధ్యలో రామ్, గోపీనాథ్లతో విభేదాలొచ్చి ఆయన 14 రీల్స్ నుంచి బయటికొచ్చేశారు. వాళ్లు 14 రీల్స్ ప్లస్ పేరుతో వేరే బేనర్ పెట్టి సినిమాల నిర్మాణం మొదలుపెట్టారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బేనర్లోనే సినిమాలు తీస్తున్నారు. గత ఏడాది బ్లాక్బస్టర్ అయిన మహేష్ బాబు సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’లో అనిల్ కూడా భాగస్వామి అన్న సంగతి తెలిసిందే.
ఐతే ఆయన చిన్న హీరోలతో తీస్తున్న సినిమాలు మాత్రం చేదు అనుభవాన్నే మిగులుస్తున్నాయి. యువ కథానాయకుల్ని నమ్మి ఆయన నిండా మునిగిపోతున్నారు. ఫామ్లో ఉన్న యువ కథానాయకుల మీద గురితో వాళ్లతో ఒప్పందాలు చేసుకుని వరుసగా సినిమాలు తీస్తున్నారు అనిల్. ఇంతకుముందు హ్యాట్రిక్ హిట్లతో ఊపుమీదున్న యంగ్ హీరో రాజ్ తరుణ్తో ఇలాగే అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ అతడితో తీసిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు, రాజు గాడు.. ఇవేవీ ఆయనకు ఆశించిన ఫలితాన్నివ్వలేదు.
ఇక అల్లరి నరేష్తో ఆయనకు ఎప్పట్నుంచో మంచి అసోసియేషన్ ఉంది. అతడితో మొదట్లో తీసిన ‘అహనా పెళ్లంట’ బాగానే ఆడింది. కానీ ఆ తర్వాత మాత్రం అన్నీ చేదు అనుభవాలే. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘యాక్షన్ 3డీ’తో పాటు జేమ్స్ బాండ్, సెల్ఫీ రాజా తేడా కొట్టాయి. చాలా ఏళ్ల విరామం తర్వాత, ఇప్పుడు నరేష్ ఏమాత్రం ఫామ్లో లేడని తెలిసి కూడా అతడితో ‘బంగారు బుల్లోడు’ అనే సినిమా తీశాడు అనిల్. అది కూడా అనిల్ను గట్టి దెబ్బే కొట్టినట్లుంది. ఈ దెబ్బతో ఒకే హీరోను నమ్ముకుని వరుస బెట్టి సినిమాలు తీయడం మానేస్తాడేమో అనిల్.
This post was last modified on January 26, 2021 9:09 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…