థియేటర్లు పునఃప్రారంభమై, మళ్లీ ప్రేక్షకులు థియేటర్లు రావడం మొదలవగానే టాలీవుడ్ నిర్మాతలు ఏమాత్రం ఆలస్యం చేయట్లేదు. ఆల్రెడీ విడుదల కోసం చూస్తున్న సినిమాలు, మధ్యలో పూర్తయినవి, త్వరలో పూర్తి కాబోయేవి.. ఇలా చాలా సినిమాలు లైన్లో ఉండటంతో రిలీజ్ డేట్లు ఖరారు చేసుకోవడానికి పోటీ పడుతున్నారు. వేసవికి అప్పుడే దాదాపుగా అన్ని బెర్తులు బుక్ అయిపోయాయి. అన్ సీజన్ అనదగ్గ ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా సినిమాల సందడి తక్కువగా ఏమీ ఉండేలా లేదు.
ఫిబ్రవరి తొలి రెండు వారాల్లో ఉప్పెన, జాంబీ రెడ్డి, ఎ1 ఎక్స్ప్రెస్, శశి లాంటి సినిమాలు రాబోతున్న సంగతి తెలిసిందే. మార్చి నెల చివర్లో రంగ్దె, అరణ్య రాబోతున్నాయి. మధ్యలో ఖాళీ దొరికిన వారాలకు కూడా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు ఫిక్స్ అవుతున్నాయి.
ఫిబ్రవరి 19న నితిన్-చంద్రశేఖర్ యేలేటిల చెక్ను ఫిక్స్ చేశారు.
ఇప్పుడు శర్వానంద్ సినిమా శ్రీకారం విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ చిత్రం మార్చి 11న మహా శివరాత్రి కానుకగా విడుదల కానున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్రకటించింది. శర్వాకు ఈ సినిమా విజయం సాధించడం చాలా అవసరం. పడి పడి లేచె మనసు, రణరంగం, జాను లాంటి డిజాస్టర్లతో అతను రేసులో బాగా వెనుకబడిపోయాడు. శ్రీకారం టైటిల్, పోస్టర్లు, ఇతర ప్రోమోలు చూస్తే శతమానం భవతి తరహా సినిమాలా కనిపిస్తోంది.
ఈ సినిమా సంక్రాంతికి వచ్చి ఉంటే పర్ఫెక్ట్ టైమింగ్ అయ్యేదని, మంచి ఫలితాన్నందుకునేదని ఇండస్ట్రీ జనాల అభిప్రాయం. కానీ అప్పటికి సినిమాను సిద్ధం చేయలేకపోయారు. వేసవికి విపరీతమైన పోటీ ఉండటంతో మధ్యే మార్గంగా మహాశివరాత్రికి సినిమాను విడుదల చేయబోతున్నారు. కిషోర్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రంలో శర్వా సరసన ప్రియాంక మోహన్ నటించింది.
This post was last modified on January 24, 2021 12:38 am
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. తద్వారా ఉద్యోగాలకు పొంచి…
తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…
తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…
సంచలనంగా మారిన అనంతపురం హనీట్రాప్ గుట్టు రట్టైంది. ప్లాన్ చేసి.. టార్గెట్ చేసి ముగ్గులోకి దించటం.. లక్షలాది రూపాయిలు కొల్లగొట్టే…
బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.…