పాపం హిట్టు కోసం దాదాపు ఎనిమిదేళ్ల నుంచి ఎదురు చూస్తున్నాడు అల్లరి నరేష్. ఒకప్పుడు వరుసబెట్టి హిట్లు ఇచ్చి రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ స్థాయిలో కామెడీ హీరోగా ఒక వెలుగు వెలిగిన అల్లరోడు.. ‘సుడిగాడు’ తర్వాత హీరోగా ఒక్క హిట్టూ లేకుండా అల్లాడుతున్నాడు. ఒక టైంలో ఎక్కువగా స్పూఫ్ల మీదే అతడి సినిమాలు నడిచాయి. కానీ ‘సుడిగాడు’లో ఆ డోస్ బాగా ఎక్కువైపోయింది. ఆ తర్వాత ఆ టైపు కామెడీ జనాలకు మొహం మొత్తేయడం, అల్లరోడి సినిమాలు ఒక మూసలో సాగిపోవడం ప్రతికూలంగా మారింది.
మధ్య మధ్యలో కొంచెం రూటు మార్చి వేరే కథలు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మధ్యలో అతడి కెరీర్లో చాలా గ్యాప్ కూడా వచ్చేసింది. ‘మహర్షి’ సినిమాలో ప్రత్యేక పాత్ర చేయకుంటే ఆ గ్యాప్ ఇంకా పెరిగిపోయేది. ఎట్టకేలకు అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అదే.. బంగారు బుల్లోడు.
ఇంతకుముందు అల్లరోడిగా ‘యాక్షన్’ సహా కొన్ని సినిమాలు నిర్మించిన అగ్ర నిర్మాత అనిల్ సుంకర ప్రొడక్షన్లో ‘నందిని నర్సింగ్ హోం’ ఫేమ్ గిరి రూపొందవించిన చిత్రం.. బంగారు బుల్లోడు. ట్రైలర్ చూస్తే నరేష్ ఒకప్పుడు చేసిన కామెడీ సినిమాల్లాగే కనిపించింది. బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారాన్ని వేరే వాళ్లకు రెంట్కు ఇచ్చి డబ్బులు సంపాదించే బ్యాంకు ఉద్యోగి పాత్రలో నరేష్ కనిపించనున్నాడు ఈ చిత్రంలో.
వెన్నెల కిషోర్, ప్రవీణ్, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ లాంటి కమెడియన్లు చాలామంది నరేష్కు అండగా ఈ సినిమాలో ఉన్నారు. నవ్వించేందుకు వాళ్లు గట్టి ప్రయత్నమే చేసినట్లున్నారు. పూజా జవేరి అందాలు సినిమాలో మరో ఆకర్షణ. సంక్రాంతి సినిమాల జోరు ఇంకా కొనసాగుతుండగా.. ‘బంగారు బుల్లోడు’కు బజ్ ఆశించిన స్థాయిలో లేదు. ఐతే ఒకప్పుడు తమను ఎంతగానో నవ్వించిన నరేష్కు హిట్ పడాలని ప్రేక్షకులు బాగానే కోరుకుంటున్నారు. సినిమా బాగుందంటే మళ్లీ అతడి సినిమా చూసేందుకు థియేటర్లకు వస్తారు. ఈ నేపథ్యంలో ‘బంగారు బుల్లోడు’ వారిని ఏమేర ఆకర్షిస్తాడో.. అల్లరోడికి పట్టిన గ్రహణం ఈ సినిమాతో అయినా వీడుతుందేమో చూడాలి.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…
పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…
టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో సిటీ హాల్ బయట ఒక అమెరికన్ భారత జాతీయ జెండాను చించివేయడం ఇప్పుడు తీవ్ర దుమారం…
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్న ప్రచారం అల్లు అర్జున్ 23 క్యాన్సిల్ కావొచ్చని. దానికి తగ్గట్టే…