పాపం హిట్టు కోసం దాదాపు ఎనిమిదేళ్ల నుంచి ఎదురు చూస్తున్నాడు అల్లరి నరేష్. ఒకప్పుడు వరుసబెట్టి హిట్లు ఇచ్చి రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ స్థాయిలో కామెడీ హీరోగా ఒక వెలుగు వెలిగిన అల్లరోడు.. ‘సుడిగాడు’ తర్వాత హీరోగా ఒక్క హిట్టూ లేకుండా అల్లాడుతున్నాడు. ఒక టైంలో ఎక్కువగా స్పూఫ్ల మీదే అతడి సినిమాలు నడిచాయి. కానీ ‘సుడిగాడు’లో ఆ డోస్ బాగా ఎక్కువైపోయింది. ఆ తర్వాత ఆ టైపు కామెడీ జనాలకు మొహం మొత్తేయడం, అల్లరోడి సినిమాలు ఒక మూసలో సాగిపోవడం ప్రతికూలంగా మారింది.
మధ్య మధ్యలో కొంచెం రూటు మార్చి వేరే కథలు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మధ్యలో అతడి కెరీర్లో చాలా గ్యాప్ కూడా వచ్చేసింది. ‘మహర్షి’ సినిమాలో ప్రత్యేక పాత్ర చేయకుంటే ఆ గ్యాప్ ఇంకా పెరిగిపోయేది. ఎట్టకేలకు అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అదే.. బంగారు బుల్లోడు.
ఇంతకుముందు అల్లరోడిగా ‘యాక్షన్’ సహా కొన్ని సినిమాలు నిర్మించిన అగ్ర నిర్మాత అనిల్ సుంకర ప్రొడక్షన్లో ‘నందిని నర్సింగ్ హోం’ ఫేమ్ గిరి రూపొందవించిన చిత్రం.. బంగారు బుల్లోడు. ట్రైలర్ చూస్తే నరేష్ ఒకప్పుడు చేసిన కామెడీ సినిమాల్లాగే కనిపించింది. బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారాన్ని వేరే వాళ్లకు రెంట్కు ఇచ్చి డబ్బులు సంపాదించే బ్యాంకు ఉద్యోగి పాత్రలో నరేష్ కనిపించనున్నాడు ఈ చిత్రంలో.
వెన్నెల కిషోర్, ప్రవీణ్, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ లాంటి కమెడియన్లు చాలామంది నరేష్కు అండగా ఈ సినిమాలో ఉన్నారు. నవ్వించేందుకు వాళ్లు గట్టి ప్రయత్నమే చేసినట్లున్నారు. పూజా జవేరి అందాలు సినిమాలో మరో ఆకర్షణ. సంక్రాంతి సినిమాల జోరు ఇంకా కొనసాగుతుండగా.. ‘బంగారు బుల్లోడు’కు బజ్ ఆశించిన స్థాయిలో లేదు. ఐతే ఒకప్పుడు తమను ఎంతగానో నవ్వించిన నరేష్కు హిట్ పడాలని ప్రేక్షకులు బాగానే కోరుకుంటున్నారు. సినిమా బాగుందంటే మళ్లీ అతడి సినిమా చూసేందుకు థియేటర్లకు వస్తారు. ఈ నేపథ్యంలో ‘బంగారు బుల్లోడు’ వారిని ఏమేర ఆకర్షిస్తాడో.. అల్లరోడికి పట్టిన గ్రహణం ఈ సినిమాతో అయినా వీడుతుందేమో చూడాలి.
This post was last modified on January 23, 2021 11:56 am
గత ఏడాది డిసెంబర్ లో రిలీజైన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏ…
కొన్ని ల్యాండ్ మార్క్ సినిమాలకు కాలదోషం ఉండదు. టాలీవుడ్ స్థాయిని ప్రపంచ వీధుల దాకా తీసుకెళ్లి అక్కడ జెండా పాతేలా…
మాటల మాంత్రీకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. తమ వ్యం గ్యాస్త్రాలు,…
ఈ ఏడాది ఎండలు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఏకంగా 44, 45 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీచేస్తున్నది. ఆంధ్రప్రదేశ్,…
తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…