లాక్ డౌన్ నెమ్మదిగా ఎత్తేస్తున్న వేళ, సినిమా థియేటర్లు కూడా తెరిచేస్తారని ఆశ చిగురించింది. లిక్కర్ షాప్స్ కి పర్మిషన్ వచ్చింది కనుక ఒక నెల రోజుల్లో సినిమా హాళ్లు కూడా తెరిచేస్తారని భావించారు. అయితే లిక్కర్ షాప్స్ వద్ద సామాజిక దూరం గంగలో కలిసి… పోలీసులు కూడా చేతులు ఎత్తేయడంతో జనం గుమికూడే వ్యాపారాలకు పర్మిషన్ ఇవ్వడం ఎంత తప్పో గవర్నమెంట్ కి తెలిసి వచ్చింది.
జనాల్లో అసలు కరోనా భయం లేదని, తమ వ్యసనం, తమ విలాసం తప్ప తనకీ, తన కుటుంబ సభ్యులకి ఏమవుతుందో అనే ఆలోచన అసలు లేదని మద్యం షాపుల వద్ద సన్నివేశాలే చూపించాయి. ఇలాంటి సమయంలో సినిమా థియేటర్లు తెరిస్తే ఇంత కంటే ఇదిగా ఎగబడిపోతారని, గవర్నమెంట్ లాక్ డౌన్ ఎట్టేసిందంటే కరోనా వెళ్ళిపోయింది అనుకుంటారని ఇప్పుడు స్పష్టంగా తెలిసింది.
అసలే సినిమా హాళ్ళని ఆఖరులో తెరవాలని ముందే డిసైడ్ అయిపోగా బాధ్యత లేని జనం తీరు చూసాక కరోనా బూచి పూర్తిగా వదిలిపోతే తప్ప పర్మిషన్ ఇవ్వరని అనిపిస్తోంది. రేపు థియేటర్లు తెరిచినా వెంటనే సినిమాలకు వస్తారా రారా అనే నిర్మాతల భయాన్ని అయితే లిక్కర్ షాపుల వద్ద క్యూ లైన్లు పోగొట్టేశాయి. ఎప్పుడు తెరిస్తే అప్పుడు సినిమా హాళ్లలో జాతరే అని నిర్మాతలకి ధైర్యం వచ్చేసింది.
This post was last modified on May 5, 2020 7:49 pm
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…