పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కతున్న చిత్రానికి ముందు నుంచి ‘ఫైటర్’ అనే టైటిలే ప్రచారంలో ఉంది. ఆ వర్కింగ్ టైటిల్తోనే షూటింగ్ చేస్తూ వచ్చారు. కానీ ఈ చిత్రానికి ఆ టైటిల్ ఫైనలైజ్ కాలేదని.. వేరే ఆకర్షణీయమైన టైటిల్ కోసం చూస్తున్నామని చిత్ర సమర్పకురాలు చార్మి కౌర్ ఇంతకుముందే ప్రకటించింది. అందులోనూ ఈ మధ్య హృతిక్ రోషన్ హీరోగా ‘ఫైటర్’ అనే సినిమా గురించి ప్రకటన రావడంతో పూరి-విజయ్ సినిమాకు వేరే టైటిల్ పెట్టబోతున్నారని తేలిపోయింది.
ఇప్పుడా టైటిలేంటో ప్రకటించారు. ‘లిగర్’ అంటూ వెరైటీ పేరు పెట్టారు ఈ సినిమాకు. ముందు చూడగానే అసలేంటీ టైటిల్ అనిపించింది. ఐతే చిత్ర బృందం సోషల్ మీడియాలో వివరణ ఇచ్చాక కానీ విషయం బోధ పడలేదు. Lionలోని తొలి రెండు అక్షరాలు.. Tigerలోని చివరి మూడు అక్షరాలు తీసుకుని Liger అని పేరు పెట్టారట.
ఫస్ట్ లుక పోస్టర్ బ్యాగ్రౌండ్లో సింహం, పులి ఫొటోలు పెట్టడం.. టైటిల్ కింద ‘సాలా క్రాస్ బ్రీడ్’ అని క్యాప్షన్ ద్వారా ఈ టైటిల్ గురించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారన్నమాట. అయినా సరే.. జనాలకు విషయం బోధపడలేదు. టైటిల్ గురించి ఇంత ప్రయాస అవసరమా అన్న ఫీలింగ్ జనాలకు కలుగుతోంది. సోషల్ మీడియాలో చాలా వరకు జనాలు ఈ టైటిల్ విషయమై నెగెటివ్గానే స్పందిస్తున్నారు.
టైటిల్ చాలా కృతకంగా, కృత్రిమంగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్యాగ్రౌండ్లో సింహం, పులి పెట్టడం చూసి ఇదేదో సెకండ్ గ్రేడ్ సినిమాలా ఉందే అన్న కామెంట్లు చేస్తున్నారు. టైటిల్ ఏమాత్రం క్యాచీగా లేదని.. అంత ఈజీగా జనాల్లోకి వెళ్లదని అంటున్నారు. దీని బదులు లయన్ అనో, టైగర్ అనో పెట్టినా బాగుండేదని.. అసలు ‘ఫైటర్’ అనే టైటిలే రిజిస్టర్ చేయించుకుని ఉంటే ఇప్పటికే అలవాటు పడ్డ జనాల్లోకి అది ఈజీగా వెళ్లిపోయేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on January 18, 2021 1:15 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…