వాయిదాల ప్రచారాలకు చెక్ పెడుతూ నిన్న ప్యారడైజ్ బృందం మరోసారి సెప్టెంబర్ 24 విడుదలని కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. విపరీతమైన ఒత్తిడి ఉన్నప్పటికీ వెనక్కు తగ్గే పరిస్థితి లేకపోవడంతో ఆఘమేఘాల మీద పనులు పూర్తి చేస్తున్నారు. రీ రికార్డింగ్ కు సంబంధించి అనిరుధ్ రవిచందర్ నుంచి స్పష్టమైన హామీ రావడంతో ఆ మేరకు దాని వర్క్ కూడా వీలైనంత త్వరలో ఫినిష్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మీద మాములు ప్రెజర్ లేదు.
ఇప్పుడు చేతిలో ఉన్నది కేవలం 16 రోజులు. ప్యాన్ ఇండియా ప్రమోషన్లు పూర్తి స్థాయిలో సాధ్యం కాదు. నానికి ఇంటర్వ్యూలు ఇచ్చే టైం కూడా లేదని తెలిసింది. గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, నేషనల్ మీడియాతో ముఖాముఖీ తప్ప ఇంకే స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉండకపోవచ్చని వినికిడి. సరే పబ్లిసిటీ సంగతి ఎలా ఉన్నా ఓపెనింగ్స్ గురించి ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే బజ్ ఆ స్థాయిలో ఉంది కాబట్టి. ఆయా షేర్, యెషనాగుల కట్ట పాటలు మాయ మంత్రంలా పని చేశాయి.
ప్రమోషన్ల సంగతి పక్కన పెడితే ప్యారడైజ్ నిలబెట్టుకోవాల్సింది ఒకే ఒకటుంది. అదే కంటెంట్ మీద ఆడియన్స్ పెట్టుకున్న నమ్మకం. ఇది అందరు హీరోల సినిమాలకు జరిగేదే అయినా నానికి ప్యారడైజ్ ఆ కోవలోకి రాదు. ఎందుకంటే దీని కోసం చాలా రిస్క్ చేశాడు. క్యారెక్టరైజేషన్ పరంగా సాహసం అనిపించే పాయింట్ ఒప్పుకున్నాడు. మొదటిసారి ఒక హీరో రెండు జెడలు వేసుకుని సినిమా మొత్తం నటించే కాన్సెప్ట్ కు ఎస్ చెప్పాడు. అన్నింటికి మించి రెండు సంవత్సరాలు దీని మీదే ఉన్నాడు.
ప్రేక్షకుల్లో ఇంత కష్టం చూసిన సానుభూతి ఎలాగూ ఉంది కాబట్టి వాళ్ళ ఎక్స్ పెక్టేషన్స్ కనీస స్థాయిలో అందుకున్నా చాలు బ్లాక్ బస్టర్ దక్కుతుంది. జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కు శుభ సూచకాలు జరుగుతున్నాయి. పెద్ది నుంచి ఇరుముడి దాకా మంచి హిట్లు పడ్డాయి. వీరభద్రుడు నుంచి బెత్లెహాం కుటుంబ యూనిట్ దాకా డబ్బింగులు సైతం విజయం సాధించాయి. ఈ ఫ్లోని ప్యారడైజ్ పది రెట్లు పైకి తీసుకెళ్తుందని డిస్ట్రిబ్యూషన్ వర్గాలు ఆశిస్తున్నాయి. అంతకన్నా కావాల్సింది ఏముంది.
This post was last modified on September 8, 2026 12:09 pm
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో వున్న కూటమి పార్టీల్లో కొన్ని రోజులుగా క్షేత్రస్థాయి కార్యకర్తలు, నాయకుల మధ్య సోషల్ వార్ జరుగుతుంది.…
ప్యాన్ ఇండియా పేరుతో ప్రతి హీరో వరల్డ్ బిల్డింగ్, ఎలివేషన్ల వెనుక పడటంతో సినిమాల వేగం తగ్గిపోయింది. టయర్ 2,…
ఢిల్లీలో ఏడుగురి ప్రాణాలు తీసిన సత్య నికేతన్ భవనం ఘటనలో ఒక విషయం ఎక్కువగా ఆలోచింపజేస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు…
హైదరాబాద్కు చెందిన ఓ దంపతులు ఐదు నెలలు అమెరికాలో ఉండాలని ప్లాన్ చేసుకుని మయామీ వెళ్లారు. ఐదు నెలల తర్వాత…
సినిమా చూడాలంటే బుక్మైషోలో టికెట్ తీసుకోవడం కామన్. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే ప్రభుత్వ కార్యక్రమానికి కూడా…
ప్రస్తుతం తెలుగు దర్శకుల్లో రాజమౌళి తర్వాతి స్థానం ఎవరిది అంటే మరో మాట లేకుండా సుకుమార్ పేరు చెప్పేయొచ్చు. టాలీవుడ్లోనే…