కేజీఎఫ్ 2 ఏప్రిల్ 2022లో వచ్చింది. ఆ తర్వాత యశ్ తన కొత్త సినిమా ఏంటో చెప్పడానికి కూడా చాలా టైమ్ తీసుకున్నాడు. దాదాపు 20 నెలల తర్వాత, 2023 డిసెంబర్లో టాక్సిక్ను ప్రకటించాడు. అక్కడి నుంచి సినిమా థియేటర్లకు రావడానికి మరో రెండున్నరేళ్లకు పైగానే పట్టింది. మొత్తంగా చూస్తే కేజీఎఫ్ 2 నుంచి టాక్సిక్ వరకు నాలుగేళ్లకు పైగా గ్యాప్ వచ్చింది.
ఇప్పుడు టాక్సిక్ పని అయిపోయింది. మరి యశ్ తన నెక్స్ట్ హీరో సినిమాను కూడా ఇంత ఆలస్యంగానే ప్రకటిస్తాడా అన్నది చూడాలి. యశ్ చేతిలో సినిమా లేదని మాత్రం కాదు. నవంబర్ 6న రామాయణ పార్ట్ 1 వస్తోంది. ఇందులో రావణుడిగా కనిపించడంతో పాటు నిర్మాతగానూ ఉన్నాడు. పార్ట్ 2 కూడా 2027లో రావాల్సి ఉంది. పైగా రామ్, రావణ్ మధ్య కీలకమైన భాగాల షూటింగ్ ఇంకా మిగిలి ఉందని రణ్బీర్ కపూర్ ఇటీవల చెప్పాడు. అంటే టాక్సిక్ తర్వాత యశ్ వెంటనే పూర్తిగా ఖాళీ అవుతున్నాడని అనుకోలేము.
అయితే రామాయణ యశ్ సోలో సినిమా కాదు. టాక్సిక్ తర్వాత తన హీరోగా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇటీవల దిల్ రాజు మాత్రం యశ్తో సినిమా చేసే ప్లాన్ ఉందని చెప్పారు. కానీ దర్శకుడు ఎవరో చెప్పలేదు. అదే పెద్ద టాస్క్. దానికి ఇప్పుడే టైమ్లైన్ చెప్పలేమని కూడా తెలిపారు.
ఫ్యాన్స్కు మరో ఆప్షన్ కేజీఎఫ్ 3. కానీ దానిపైనా యశ్ ముందే క్లారిటీ ఇచ్చాడు. ప్రశాంత్ నీల్తో మాట్లాడుతూనే ఉన్నామని, సరైన కథ కుదిరిన తర్వాత తప్పకుండా చేస్తామని చెప్పాడు. ఇప్పట్లో మాత్రం ప్లాన్ లేదన్నాడు. నీల్ కూడా ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్తో ఉన్నాడు. సలార్ 2 కూడా లైన్ లో ఉంది. కాబట్టి కేజీఎఫ్ 3 వెంటనే మొదలయ్యే అవకాశం కనిపించడం లేదు.
ఇక కొత్త దర్శకుడిని ఎంచుకోవాలన్నా యశ్కు ఈసారి నిర్ణయం అంత ఈజీ కాదు. అందరూ బిజీగానే ఉన్నారు. గీతూ మోహన్దాస్తో చేయాలా వద్దా అని ఫైనల్ చేయడానికే యశ్ చాలా టైమ్ తీసుకున్నాడు. అందుకే నెక్స్ట్ దాని కోసం కూడా తొందరగా ఒక పేరు ఫిక్స్ చేస్తాడని చెప్పలేము. కేజీఎఫ్ 2 తర్వాత యశ్ తీసుకున్న గ్యాప్ అప్పట్లోనే హాట్ టాపిక్ గా మారింది. మరి ఈసారి ఎంత త్వరగా ఫిక్స్ చేశాడో చూడాలి.
This post was last modified on September 5, 2026 8:34 am
తెలంగాణాలో కొండా సురేఖ నుమంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయడం, తదుపరి పరిణామాల గురించి హాట్ హాట్ గా చర్చలు…
కొన్ని ప్యాన్ ఇండియా సినిమాల ఫలితాలు చూస్తే పేరు గొప్ప ఊరు దిబ్బ సామెత గుర్తుకొస్తుంది. గత వారం విడుదలైన…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే గ్రేటెస్ట్ డైరెక్టర్లలో మణిరత్నం ఒకరు. భాషా భేదం లేకుండా దేశవ్యాప్తంగా ఆయనకు భారీ అభిమాన గణం…
చిన్న మూవీ, అందులోనూ కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో తీశారు. పైగా డివోషనల్ బ్యాక్ గ్రౌండ్. ఎంత దేవుడి…
టాలీవుడ్ గత పుష్కర కాలంలో పాన్ ఇండియా స్థాయిలో బాహుబలి, పుష్ప లాంటి అసాధారణ విజయాలను చూసింది. కానీ ఇప్పుడు…
`ఇంటింటికీ టీడీపీ` పేరుతో ఏపీ అధికార కూటమి పార్టీ టీడీపీ చేపట్టిన కార్యక్రమం సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. మరో…