తెలుగు సినిమా చరిత్రలో నిర్మాత ఎం.ఎస్.రాజుది ఒక ప్రత్యేక ప్రస్థానం. ‘శ్రతువు’ సినిమాతో మొదలుపెట్టి.. దేవి, ఒక్కడు, మనసంతా నువ్వే, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్బస్టర్లు అందించిన నిర్మాత ఆయన. ఇప్పుడు దిల్ రాజు పేరు ఎలా అయితే ఒక బ్రాండ్ లాగా మారిందో.. ఒకప్పుడు అంతకుమించిన ఇమేజ్ తెచ్చుకున్న నిర్మాత ఆయన.
రాజు కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ అంటే ‘ఒక్కడు’నే. అంతకుముందు ఫ్లాపుల్లో ఉన్న గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్గా అప్పుడే ఎదుగుతున్న మహేష్ బాబును పెట్టి రాజు నిర్మించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. మహేష్ బాబును సూపర్ స్టార్ను చేసింది. సరిగ్గా 18 ఏళ్ల కిందట ఈ చిత్రం సంక్రాంతికే విడుదలై భారీ విజయాన్నందుకుంది. ఈ సందర్భంగా రాజు ఈ సినిమా అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
ఇలాంటి తరుణంలో రాజును హర్ట్ చేసే పరిణామం చోటు చేసుకుంది. ‘ఒక్కడు’ సినిమా గురించి మహేష్ బాబు భార్య నమ్రత ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్టు పెట్టగా.. అందులో దర్శకుడు గుణశేఖర్ పేరు ప్రస్తావించి.. నిర్మాత రాజు పేరును మరిచిపోయింది. నిజానికి ‘ఒక్కడు’ లాంటి సాహసోపేత సినిమా సాధ్యమైందంటే అందుకు ఎక్కువ క్రెడిట్ నిర్మాతకే ఇవ్వాలి. ఏమాత్రం రాజీ లేకుండా ఆ సినిమాను నిర్మించారాయన. పొరబాటుగా అయినా సరే.. రాజు పేరును విస్మరించడం తప్పే. ఈ విషయంపై రాజు కొంత ఆవేదన పూర్వకంగానే ట్వీట్ పెట్టాడు.
మహేష్ బాబు ట్విట్టర్ హ్యాండిల్ను ట్యాగ్ చేస్తూ.. ‘‘కొన్నిసార్లు తప్పులు జరుగుతాయి బాబూ. ఒక్కడు సినిమాకు 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పెట్టిన ఇన్స్టాగ్రామ్లో నమ్రత గారు నా పేరు మరిచిపోయారు. ఐతే ఈ సినిమా ఆమె ఫేవరెట్ క్లాసిక్ అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నా. మీకంతా మంచే జరగాలి’’ అంటూ ట్వీట్ వేశారు. ఏం పర్వాలేదు అంటూనే నమ్రత తీరుతో తాను హర్టయిన విషయాన్ని చెప్పకనే చెప్పారు రాజు.
This post was last modified on January 16, 2021 2:02 pm
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఊహించని ఘటన ఎదురైంది. ఇటీవల కాలంలో ఆయన యువతను చేరదీసే పనిలో పడిన విషయం…
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…