Movie News

నమ్రత పేరు మిస్ చేసిందని నిర్మాత హర్టు

తెలుగు సినిమా చరిత్రలో నిర్మాత ఎం.ఎస్.రాజుది ఒక ప్రత్యేక ప్రస్థానం. ‘శ్రతువు’ సినిమాతో మొదలుపెట్టి.. దేవి, ఒక్కడు, మనసంతా నువ్వే, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్‌బస్టర్లు అందించిన నిర్మాత ఆయన. ఇప్పుడు దిల్ రాజు పేరు ఎలా అయితే ఒక బ్రాండ్ లాగా మారిందో.. ఒకప్పుడు అంతకుమించిన ఇమేజ్ తెచ్చుకున్న నిర్మాత ఆయన.

రాజు కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అంటే ‘ఒక్కడు’నే. అంతకుముందు ఫ్లాపుల్లో ఉన్న గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్‌గా అప్పుడే ఎదుగుతున్న మహేష్ బాబును పెట్టి రాజు నిర్మించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. మహేష్ బాబును సూపర్ స్టార్‌ను చేసింది. సరిగ్గా 18 ఏళ్ల కిందట ఈ చిత్రం సంక్రాంతికే విడుదలై భారీ విజయాన్నందుకుంది. ఈ సందర్భంగా రాజు ఈ సినిమా అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

ఇలాంటి తరుణంలో రాజును హర్ట్ చేసే పరిణామం చోటు చేసుకుంది. ‘ఒక్కడు’ సినిమా గురించి మహేష్ బాబు భార్య నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెట్టగా.. అందులో దర్శకుడు గుణశేఖర్ పేరు ప్రస్తావించి.. నిర్మాత రాజు పేరును మరిచిపోయింది. నిజానికి ‘ఒక్కడు’ లాంటి సాహసోపేత సినిమా సాధ్యమైందంటే అందుకు ఎక్కువ క్రెడిట్ నిర్మాతకే ఇవ్వాలి. ఏమాత్రం రాజీ లేకుండా ఆ సినిమాను నిర్మించారాయన. పొరబాటుగా అయినా సరే.. రాజు పేరును విస్మరించడం తప్పే. ఈ విషయంపై రాజు కొంత ఆవేదన పూర్వకంగానే ట్వీట్ పెట్టాడు.

మహేష్ బాబు ట్విట్టర్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేస్తూ.. ‘‘కొన్నిసార్లు తప్పులు జరుగుతాయి బాబూ. ఒక్కడు సినిమాకు 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పెట్టిన ఇన్‌స్టాగ్రామ్‌లో నమ్రత గారు నా పేరు మరిచిపోయారు. ఐతే ఈ సినిమా ఆమె ఫేవరెట్ క్లాసిక్ అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నా. మీకంతా మంచే జరగాలి’’ అంటూ ట్వీట్ వేశారు. ఏం పర్వాలేదు అంటూనే నమ్రత తీరుతో తాను హర్టయిన విషయాన్ని చెప్పకనే చెప్పారు రాజు.

This post was last modified on January 16, 2021 2:02 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

6 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

6 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

8 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

8 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

8 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

10 hours ago