Movie News

నమ్రత పేరు మిస్ చేసిందని నిర్మాత హర్టు

తెలుగు సినిమా చరిత్రలో నిర్మాత ఎం.ఎస్.రాజుది ఒక ప్రత్యేక ప్రస్థానం. ‘శ్రతువు’ సినిమాతో మొదలుపెట్టి.. దేవి, ఒక్కడు, మనసంతా నువ్వే, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్‌బస్టర్లు అందించిన నిర్మాత ఆయన. ఇప్పుడు దిల్ రాజు పేరు ఎలా అయితే ఒక బ్రాండ్ లాగా మారిందో.. ఒకప్పుడు అంతకుమించిన ఇమేజ్ తెచ్చుకున్న నిర్మాత ఆయన.

రాజు కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అంటే ‘ఒక్కడు’నే. అంతకుముందు ఫ్లాపుల్లో ఉన్న గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్‌గా అప్పుడే ఎదుగుతున్న మహేష్ బాబును పెట్టి రాజు నిర్మించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. మహేష్ బాబును సూపర్ స్టార్‌ను చేసింది. సరిగ్గా 18 ఏళ్ల కిందట ఈ చిత్రం సంక్రాంతికే విడుదలై భారీ విజయాన్నందుకుంది. ఈ సందర్భంగా రాజు ఈ సినిమా అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

ఇలాంటి తరుణంలో రాజును హర్ట్ చేసే పరిణామం చోటు చేసుకుంది. ‘ఒక్కడు’ సినిమా గురించి మహేష్ బాబు భార్య నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెట్టగా.. అందులో దర్శకుడు గుణశేఖర్ పేరు ప్రస్తావించి.. నిర్మాత రాజు పేరును మరిచిపోయింది. నిజానికి ‘ఒక్కడు’ లాంటి సాహసోపేత సినిమా సాధ్యమైందంటే అందుకు ఎక్కువ క్రెడిట్ నిర్మాతకే ఇవ్వాలి. ఏమాత్రం రాజీ లేకుండా ఆ సినిమాను నిర్మించారాయన. పొరబాటుగా అయినా సరే.. రాజు పేరును విస్మరించడం తప్పే. ఈ విషయంపై రాజు కొంత ఆవేదన పూర్వకంగానే ట్వీట్ పెట్టాడు.

మహేష్ బాబు ట్విట్టర్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేస్తూ.. ‘‘కొన్నిసార్లు తప్పులు జరుగుతాయి బాబూ. ఒక్కడు సినిమాకు 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పెట్టిన ఇన్‌స్టాగ్రామ్‌లో నమ్రత గారు నా పేరు మరిచిపోయారు. ఐతే ఈ సినిమా ఆమె ఫేవరెట్ క్లాసిక్ అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నా. మీకంతా మంచే జరగాలి’’ అంటూ ట్వీట్ వేశారు. ఏం పర్వాలేదు అంటూనే నమ్రత తీరుతో తాను హర్టయిన విషయాన్ని చెప్పకనే చెప్పారు రాజు.

Satya

Recent Posts

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

13 minutes ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

2 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

3 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

3 hours ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

5 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

7 hours ago