సంక్రాంతి సందర్భంగా భారీ అంచనాల మధ్య విడుదలైంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ‘వకీల్ సాబ్’ టీజర్. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో టీజర్ ఉండటంతో రెస్పాన్స్ అదిరిపోతోంది. యూట్యూబ్లో వ్యూస్, లైక్స్ పరంగా తెలుగు టీజర్ల రికార్డులను సవరిస్తూ సాగిపోతోందీ టీజర్. నిమిషం పైగా నిడివి ఉన్న టీజర్లో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకాంక్షలకు తగ్గట్లే సూపర్ స్టైలిష్గా, పవర్ ఫుల్గా కనిపించడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. పవర్ స్టార్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు వెర్రెత్తిపోతున్నారు. అభిమానుల వరకు ‘వకీల్ సాబ్’ టీజర్ సూపర్ అనడంలో మరో మాట లేదు.
ఐతే అదే సమయంలో ఈ టీజర్ విషయమై కొన్ని అభ్యంతరాలు, విమర్శలు తప్పట్లేదు. ఈ చిత్రం బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇది మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నేపథ్యంలో సాగే కోర్ట్ రూం డ్రామా అన్న సంగతి తెలిసిందే. కథ మొత్తం ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది. అమితాబ్ బచ్చన్ వారి కథలో అతిథిలా కనిపిస్తాడు.
ఐతే తమిళంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేసినపుడు అమితాబ్ స్థానంలోకి అజిత్ రావడంతో ఆయన పాత్రను బాగా ఎలివేట్ చేశారు. ఇక తెలుగులోకి వచ్చేసరికి పూర్తిగా ముగ్గురు లేడీస్ పాత్రల్ని పక్కకు నెట్టేసి పవన్నే హైలైట్ చేస్తున్నారన్న విమర్శ ముందు నుంచి ఉంది.
ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లో ఇప్పటికే లేడీ క్యారెక్టర్లకు స్థానం లేకుండా చేశాడు. ఇప్పుడు టీజర్ కూడా పూర్తిగా పవన్ మీదే నడవడంపై ఫెమినిస్టులు.. ‘పింక్’ను ఇష్టపడ్డ వాళ్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మాత్రానికి ‘పింక్’ను రీమేక్ చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
లేడీ క్యారెక్టర్లను టీజర్లో చూపించలేదన్న వారికి.. రెప్పపాటులో బ్యాగ్రౌండ్లో అలా మెరిసి మాయమైనట్లుగా అంజలి, నివేథా థామస్ కనిపించిన స్క్రీన్ షాట్ తీసి చూపిస్తున్నారు కానీ.. అక్కడ వాళ్లు ఉన్నా లేనట్లే ఉంది. దీనిపై ఓ వర్గం విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు కానీ.. ఒక రీమేక్ సినిమాను ఇలాగే తీయాలని రూల్ ఏమైనా ఉందా.. ఎవరిష్టం వాళ్లది అంటూ మరో వర్గం వాదిస్తోంది.
This post was last modified on January 15, 2021 1:08 pm
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…