‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయి రూ.300 కోట్ల వసూళ్ల మార్కును అందుకోవడం తన పేరు మార్మోగింది. ఇండియాలో మోస్ట్ వాంటెడ్ దర్శకుల్లో ఒకడైపోయాడు ప్రశాంత్. తన నుంచి వరుసగా సినిమాలు అనౌన్స్ అయ్యాయి. రకరకాల కాంబినేషన్లలో సినిమాలు చేస్తాడని ప్రచారం జరిగింది.
కానీ రణ్వీర్ సింగ్తో అనుకున్న సినిమా ముందుకు కదలకపోవడం.. మోక్షజ్ఞతో అనౌన్స్ చేసిన ప్రాజెక్టూ ఆగిపోవడం.. మరోవైపు ‘జై హనుమాన్’ ఎంతకీ సెట్స్ మీదికి వెళ్లకపోవడంతో ఇదేం ప్లానింగ్ అంటూ ప్రశాంత్ మీద కౌంటర్లు పడ్డాయి. అతను స్క్రిప్టు అందించిన మహాకాళి, జాంబిరెడ్డి-2 సినిమాలు కూడా ఆలస్యం కావడంతో తన పట్ల ఒక రకమైన నెగెటివిటీ ముసురుకుంది. ఊరికే హడావుడి చేస్తాడు తప్ప సినిమాలు పట్టాలెక్కించడంటూ విమర్శలు మొదలయ్యాయి.
ఐతే కొంచెం లేటుగా, ఇప్పుడు ప్రశాంత్ ట్రాక్లో పడ్డట్లున్నాడు. కొన్ని రోజుల వ్యవధిలో తన రెండు సినిమాల అప్డేట్స్ బయటికి వచ్చాయి. ప్రశాంత్ స్క్రిప్టుతో రూపొందిన ‘జాంబిరెడ్డి-2’ గ్లింప్స్ ఇటీవలే రిలీజ్ చేశారు. దానికి మంచి స్పందనే వచ్చింది. మరోవైపు ప్రశాంత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తన ప్రశాాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్ నుంచి రిలీజ్ చేయబోతున్న ‘మహాకాళి’ కూడా టీజర్తో ఆకట్టుకుంది. ఇది పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేయగల సినిమాలా కనిపిస్తోంది.
ఈ సినిమా కాన్సెప్ట్, కాస్టింగ్, వీఎఫెక్స్ అన్నీ వేరే లెవెల్ అనిపిస్తున్నాయి. మరోవైపు ప్రశాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘హనుమాన్’ కూడా కొన్ని నెలల ముందే సెట్స్ మీదికి వెళ్లిన సంగతి తెలిసిందే. దాని షూటింగ్ కూడా చురుగ్గా సాగుతోంది. ఆ సినిమా ఫస్ట్ గ్లింప్స్ను కూడా త్వరలో రిలీజ్ చేయబోతున్నారట. అందులో ప్రశాంత్ మరింతగా మెరుపులు మెరిపిస్తాడని అంచనా వేస్తున్నారు. ఈ మూడు సినిమాలూ వచ్చే ఏడాదే రిలీజ్ కానుండడం విశేషం. దీంతో 2027లో ప్రశాంత్ వర్మ పేరు మార్మోగడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on August 25, 2026 11:02 pm
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…
అందం అభినయం రెండూ ఉన్న కియారా అద్వానీతో అదృష్టం దోబూచులాడుతోంది. ఒకదశలో కరీనా కపూర్ ఎంజాయ్ చేసిన స్టార్ డం…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక విషయాన్ని ప్రజలతో పంచుకున్నారు. 30 ఏళ్ల కిందట తాను చేసిన శంకు స్థాపన తాలూకు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్ వావ్ అనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆలస్యంగా ఓపెన్ చేసినప్పటికీ టికెట్లు…