తమిళంలో హీరో ధనుష్, దర్శకుడు సెల్వ రాఘవన్లది తిరుగులేని కాంబినేషన్. ఈ అన్నదమ్ముల కలయికలో తుళ్లువదో ఎలమై (జూనియర్స్), కాదల్ కొండేన్ (నేను), పుదుప్పేట్టై (ధూల్ పేట), మయక్కం ఎన్న లాంటి క్లాసిక్స్ వచ్చాయి. వీళ్లిద్దరూ ఒకరి అండతో ఒకరు ఎదిగి.. తిరుగులేని స్థాయిని అందుకున్న వాళ్లే. మళ్లీ ఈ బ్రదర్స్ కలయికలో ఓ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇటీవలే వీరి కలయికలో ‘యుగానికి ఒక్కడు-2’ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు సినిమా అనౌన్స్ చేస్తూ 2024లో రిలీజ్ అని పోస్టర్ మీద వేయడమేంటో జనాలకు అర్థం కాలేదు. అంత టైం ఎందుకు అన్న సందేహం కలిగింది. ఐతే ఈ అన్నదమ్ములు ‘యుగానికి ఒక్కడు-2’ లాంటి భారీ చిత్రం చేయడానికి ముందు వేరే సినిమాతో పలకరించబోతున్నారు. సడెన్ సర్ప్రైజ్ అన్నట్లుగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు.
‘నానే వరువేన్’.. ఇదీ ధనుష్-సెల్వ కలయికలో రాబోతున్న కొత్త చిత్రం పేరు. సెల్వతో ఇంతకుముందు చేసిన సినిమాలతో పోలిస్తే రెగ్యులర్.. మోడర్న్ లుక్లో కనిపిస్తున్నాడు ఈ సినిమా ఫస్ట్ లుక్లో. సిటీ నేపథ్యంలో ఒక మామూలు కమర్షియల్ సినిమానే తీయబోతున్నాడనిపిస్తోంది సెల్వ ఈసారి. అతడి సినిమాల్లో మామూలుగా కనిపించే వైవిధ్యం అయితే పోస్టర్లో కనిపించలేదు.
కొన్నేళ్లుగా సెల్వ నుంచి అతడి స్థాయికి తగ్గ సినిమాలు రాలేదు. చివరగా సూర్యతో చేసిన ‘ఎన్జీకే’ చెత్త సినిమాగా పేరు తెచ్చుకుంది. తమిళంలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా.. తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదు. మరోవైపు సూర్యతో చేసిన ఓ సినిమా విడుదలకే నోచుకోకుండా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో నేరుగా ‘యుగానికి ఒక్కడు-2’ లాంటి భారీ చిత్రం చేయడం కంటే ముందు.. తాను ఫామ్లోకి రావడానికి తమ్ముడితోనే మరో సినిమా చేస్తున్నట్లు కనిపిస్తోంది.
This post was last modified on January 14, 2021 12:15 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…