కొత్త ఏడాదిలో టాలీవుడ్కు మంచి ఆరంభాన్నే ఇచ్చింది ‘క్రాక్’. కరోనా విరామం తర్వాత పున:ప్రారంభమైన థియేటర్లకు ముందుగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ హోప్ ఇస్తే.. ‘క్రాక్’ మరింత కళను తీసుకొచ్చింది థియేటర్లకు. 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నప్పటికీ.. హౌస్ ఫుల్ బోర్డులు పెద్ద ఎత్తున పడటం ఇండస్ట్రీకి ఉత్సాహాన్నిచ్చేదే.
ఆదివారం రిలీజ్ రోజు బాక్సాఫీస్ దగ్గర అంచనాల్ని మించి పెర్ఫామ్ చేసిన ‘క్రాక్’ ఏకంగా రూ.10 కోట్లకు పైగా గ్రాస్, రూ.6 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఔరా అనిపించింది. కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతుండగా, థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తుండగా ఈ వసూళ్లు రాబట్టడం చిన్న విషయం కాదు. రెండో రోజు సోమవారం కూడా బాక్సాఫీస్ పరీక్షకు ‘క్రాక్’ నిలబడింది. రూ.3 కోట్లకు పైగా షేర్, రూ.6 కోట్లకు అటు ఇటుగా గ్రాక్ కలెక్ట్ చేసింది.
దీంతో ‘క్రాక్’ మొత్తం షేర్ రూ.10 కోట్ల మార్కుకు చేరువైంది. బ్రేక్ ఈవెన్ కావాలంటే ‘క్రాక్’ ఇంకా రూ.6.5 కోట్ల దాకా షేర్ రాబట్టాల్సి ఉంది. మంగళవారం వసూళ్ల వివరాలు రావాల్సి ఉండగా.. రెండో రోజు సాధించిన వసూళ్లనే మూడో రోజు కూడా రాబట్టే అవకాశాలున్నాయి కాబట్టి ‘క్రాక్’ బ్రేక్ ఈవెన్ కావడానికి మంచి అవకాశాలున్నట్లే. బుధ, గురు వారాల్లో మూడు సినిమాలు వస్తుండటంతో ‘క్రాక్’ స్క్రీన్లు బాగా తగ్గిపోతాయి.
వసూళ్ల మీద కూడా ప్రభావం ఉంటుంది. కాకపోతే ఈ మాస్ మసాలా సినిమాకు రాబోయే వీకెండ్ ముగిసేలోపు రూ.3-4 కోట్ల షేర్ రాబట్టడం కష్టం కాకపోవచ్చు. కాబట్టి ‘క్రాక్’కు నష్టాల భయం లేదు. 2021లో రిలీజైన తొలి తెలుగు సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లడటం, ‘హిట్’ అనిపించుకోవడం ఖాయమన్నమాట. మరి మిగతా సంక్రాంతి సినిమాల సంగతేంటన్నదే చూడాలి.
This post was last modified on January 13, 2021 2:39 pm
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…
ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…