ఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమాలో ఒక హీరోయిన్ పాత్ర విషయంలో విపరీతమైన విమర్శలు వచ్చింది ‘పెద్ది’ సినిమాకే. ఇందులో జాన్వి కపూర్ చేసిన అచ్చియమ్మ పాత్ర విషయంలో రిలీజ్ ముందే విమర్శలు మొదలయ్యాయి. రిలీజ్ తర్వాత అవి మరింత పెరిగాయి. తెలుగు ప్రేక్షకులకు ఇతర భాషల వాళ్లు కూడా తోడై ఈ పాత్రను చూపించిన విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో సినిమా థియేటర్లలో ఉండగానే దర్శకుడు బుచ్చిబాబు జాన్వి మీద తీసిన కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
అయినప్పటికీ విమర్శలేమీ ఆగిపోలేదు. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిశాక.. ఓటీటీలో రిలీజైనపుడు కూడా జాన్వి పాత్ర విషయంలో కౌంటర్లు కొనసాగాయి. ఇతర ఇండస్ట్రీల వాళ్లకు ఇదొక ఆయుధంలా మారింది. అక్కడ కూడా హీరోయిన్లను అంత గొప్పగా ఏమీ ప్రెజెంట్ చేయకపోయినా సరే.. టాలీవుడ్లో మాత్రమే తప్పు జరుగుతున్నట్లుగా కామెంట్లు చేస్తూనే ఉన్నారు..తాజాగా తమిళ కథానాయిక అదితి బాలన్.. ‘పెద్ది’ సినిమాలో హీరోయిన్ పాత్రను చూపించిన విధానాన్ని తప్పుబట్టింది.
తమిళంలో ‘అరువి’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన అదితి.. తెలుగులో ‘సరిపోదా శనివారం’లో నటించిన సంగతి తెలిసిందే. ఆమె తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ‘పెద్ది’ సినిమా ప్రస్తావన తెచ్చింది. ఇటీవలే పెద్ది సినిమా చూశానని.. అందులో హీరోయిన్ జాన్వి పాత్రను సరిగా చూపించలేదని వ్యాఖ్యానించింది. ఆ పాత్రను రాసిన విధానమే బాగా లేదని.. అది కరెక్ట్ కాదని ఆమె అంది.
ఆ సినిమాలో ఆ పాత్ర చేసేదేమీ లేదని ఆమె పేర్కొంది. ఆ క్యారెక్టర్ను ఇంకా బాగా రాసి ఉండొచ్చని.. హీరోయిన్లను చూపించే పద్ధతి మారాలని అదితి వ్యాఖ్యానించింది. ఇలా ఓ పాత్ర గురించి విశ్లేషకులు, సామాన్య ప్రేక్షకులు కామెంట్ చేయడం మామూలే కానీ.. ఇండస్ట్రీలో భాగమైన ఒక నటి ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం అరుదే. కాకపోతే తెలుగు సినిమాల్లో మాత్రమే ఇలాంటివి ఉన్నట్లు కొందరు వ్యాఖ్యానించడమే ఆశ్చర్యం కలిగించే విషయం.
This post was last modified on August 8, 2026 2:37 pm
ఇండియా మోస్ట్ కాస్ట్లీ మూవీగా ప్రచారం జరుపుకుంటున్న రామాయణ విడుదల తేదీ విషయంలో కొత్త ట్విస్టు బయట పడింది. ఓవర్సీస్…
బడ్జెట్ తో సంబంధం లేకుండా తన సినిమా ఏదైనా రాజమౌళి అనుసరించే పద్దతి ఒకటుంది. కథను దాచుకోరు. వీలైనంత ముందే…
కేంద్రంలోని బీజేపీతోను.. ఇటు రాష్ట్రంలోని బీజేపీతోనూ కయ్యానికి సుముఖంగా లేమని వైసీపీ స్పష్టం చేస్తోంది. నిజానికి ఆది నుంచి కూడా…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఈవీవీ సత్యనారాయణ గారు అలీబాబా అరడజను దొంగలు అనే సినిమా తీశారు. రాజేంద్ర ప్రసాద్…
గత కొంత కాలంగా సౌత్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ తన స్థాయికి తగ్గ మ్యూజిక్ ఇవ్వడం లేదని సంగీత ప్రియులు…
సచిన్ అంటే ఒక బ్రాండ్. అందుకే ఆయన బ్రాండ్ విలువ ఏమాత్రం తగ్గలేదు. దేశంలోని ప్రముఖ కంపెనీలు ఆయనను బ్రాండ్…