ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఈవీవీ సత్యనారాయణ గారు అలీబాబా అరడజను దొంగలు అనే సినిమా తీశారు. రాజేంద్ర ప్రసాద్ హీరో. క్లైమాక్స్ లో ఆరుగురు కమెడియన్లు ఆరుగురు స్టార్ హీరోల వేషాల్లో వచ్చి విలన్ డెన్ లో కామెడీ చేస్తారు. వాళ్ళు ఎవరిని ఇమిటేట్ చేశారు, ఏ మూవీ నుంచి తీసుకున్నారనేది సులభంగా గుర్తు పట్టేలా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్, జాకీ చాన్ గెటప్స్ వేయించారు. ఈ ఎపిసోడ్ థియేటర్లలో ఓ రేంజ్ లో పేలింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
అప్పట్లో ఇలా చేయడం వల్ల ఎవరి మనోభావాలు దెబ్బ తినలేదు. ఆయా హీరోలు ఆ చిత్రం చూసి స్పోర్టివ్ గా తీసుకున్నారు. మిమిక్రి ఆర్టిస్ట్ శివారెడ్డి నటులను, రాజకీయ నాయకులను ఇమిటేట్ చేసి వందల జోకులతో నవ్వించడం కొన్ని వందల సార్లు జరిగింది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా కాలం. చిన్న చిన్న వాటిని భూతద్దంలో చూపిస్తూ ట్రోలింగ్ పేరుతో ఆనందం పొందుతున్న వాళ్ళ సంఖ్య వందల వేల నుంచి లక్షలకు చేరుకొని క్రమంగా దేశాలు దాటిపోతోంది. కొత్త జడలు విప్పుకుంటోంది.
యుగపురుషుడు సినిమాలో ఎన్టీఆర్ సన్నివేశాన్ని తీసుకుని కొన్ని రోజుల క్రితం ఎక్స్, ఇన్స్ టాలో ఎంత రచ్చ చేశారో చూశాం. ఒక మాములు సీన్ కాస్తా ట్రోల్ మెటీరియల్ అయిపోయింది. దీనికి కౌంటర్ ఇవ్వాలన్నట్టు చిరంజీవి జేబుదొంగ, ఆరని మంటలు లాంటి క్లిప్పులు పట్టుకొచ్చి వైరల్ చేసే ప్రయత్నం చేశారు. కొరియన్ కనకరాజులో సత్య పైన ఉదహరించిన ఎన్టీఆర్ డైలాగుని పలకడం మరో రాద్ధాంతానికి దారి తీసేలా ఉంది. చిన్నగా మొదలైన గొడవ కాంట్రావర్సీగా మారుతోంది.
ఫ్యాన్స్ ఎవరైనా గుర్తుంచుకోవాల్సింది ఒకటుంది. కావాలని ఎగతాళి చేస్తే తప్పకుండా ఖండించాల్సిందే. కానీ అనుకరించే ప్రయత్నం చేస్తూ అందులో దురుద్దేశం ఉందొ లేదో చెక్ చేసుకోవాలి. దర్శకులు రచయితలు స్క్రిప్ట్ రాసే టైంలో మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతా జరిగాక వాటిని కట్ చేస్తే సరిపోదు. అప్పటికే డ్యామేజ్ అయిపోతుంది. అయినా సరే ఇలా ఎవరికి వారు ట్రోలింగ్ ఉచ్చులో పడి పరస్పరం కవ్వించుకుంటే చివరికి రిస్క్ లో పడేది టాలీవుడ్ పరువే.
This post was last modified on August 8, 2026 10:14 am
కేంద్రంలోని బీజేపీతోను.. ఇటు రాష్ట్రంలోని బీజేపీతోనూ కయ్యానికి సుముఖంగా లేమని వైసీపీ స్పష్టం చేస్తోంది. నిజానికి ఆది నుంచి కూడా…
గత కొంత కాలంగా సౌత్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ తన స్థాయికి తగ్గ మ్యూజిక్ ఇవ్వడం లేదని సంగీత ప్రియులు…
సచిన్ అంటే ఒక బ్రాండ్. అందుకే ఆయన బ్రాండ్ విలువ ఏమాత్రం తగ్గలేదు. దేశంలోని ప్రముఖ కంపెనీలు ఆయనను బ్రాండ్…
``దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చేందుకు మన వాళ్లు తుపాకీ తూటాలకే వెనుకాడలేదు. మీరు ఎంపీ అయి ఉండి.. కోడిగుడ్లకు భయపడతారా?``అంటూ.. తృణమూల్…
ప్రస్తుతం వైసీపీ పెట్టుకున్న లక్ష్యం.. మంత్రి నారా లోకేష్ తో రాజీనామా చేయించడం. గత వారం రోజులుగా ఈ విషయాన్ని…
నా భర్తను యాక్సిడెంట్ చేసి చంపేయ్.. లేకుంటే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతానంటూ ఒక భార్య ప్రియుడికి వాట్సాప్ మెసేజ్…