హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు కమిట్ అవుతూ దూసుకుపోతున్నాడు నాగచైతన్య. గత ఏడాది ‘మజిలీ’, ‘వెంకీ మామ’ సినిమాలతో రెండు హిట్లు కొట్టిన చైతూ, ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ చేస్తున్నాడు. సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ లాక్డౌన్ ముగిసిన వెంటనే షూటింగ్ ముగించుకుని థియేటర్లలోకి రానుంది. దాంతో తర్వాతి సినిమాలను కూడా లైన్లో పెడుతున్నాడీ యంగ్ స్టార్.
శేఖర్ కమ్ములతో లవ్ స్టోరీ తర్వాత ఇద్దరు క్రియేటివ్ దర్శకులతో చైతన్య సినిమాలకు కమిట్ అయ్యినట్టు టాక్ వినిపిస్తోంది. ఇంద్రగంటి మోహన కృష్ణతో ఓ మూవీ చేస్తుండగా… క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ డైరెక్షన్లో మరో మూవీ చేయబోతున్నాడు చై.
ఇంతకుముందు ‘సవ్యసాచి’, ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాల షూటింగ్లను ఒకేసారి కానిచ్చిన చైతూ… ఇప్పుడు ఈ రెండు సినిమాలను కూడా ఒకేసారి లైన్లో పెట్టనున్నాడట. దిల్ రాజు నిర్మాణంలో విక్రమ్ కె. కుమార్ రూపొందించే చిత్రానికి ‘థ్యాంక్యూ’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.
అయితే నిజానికి ‘లవ్ స్టోరీ’ తర్వాత లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో చై మూవీ చేయాల్సింది. సమంత ‘ఓ బేబీ’ తర్వాత గ్యాప్ తీసుకున్న నందినిరెడ్డి, నాగచైతన్య మూవీ కోసం స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేశారని, స్వప్న సినిమా బ్యానర్లో రూపొందే ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక నటిస్తుందని కూడా వార్తలు వినిపించాయి. అయితే సడెన్గా లేడీ డైరెక్టర్ మూవీని పక్కనబెట్టి, ఇద్దరు దర్శకులతో మూవీస్ కమిట్ అయ్యాడు నాగచైతన్య.
సక్సెస్ దక్కుతున్నా, స్టార్డమ్కి దూరంగా ఉంటున్న చైతన్య… ఆ దిశగా అడుగులు వేస్తున్నాడట. అందుకే సాఫ్ట్ స్టోరీస్ డీల్ చేసే నందినిరెడ్డి కంటే విభిన్నమైన కథలతో చిత్రాలు రూపొందించే ఇంద్రగంటి, విక్రమ్ కుమార్ సినిమాలను ముందుగా లైన్లో పెట్టినట్టు టాక్.
This post was last modified on May 5, 2020 6:06 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…