మన అగ్ర హీరోలందరూ ఇప్పుడు తెలుగు మార్కెట్ని దాటి తమ మార్కెట్ ఎలా విస్తరించుకోవాలనే దానిపై తర్జనభర్జనలు పడుతున్నారు. ప్రభాస్ ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ అయిపోగా, ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ ‘ఆర్.ఆర్.ఆర్.’తో ఆ హోదా సాధిస్తామనే ధీమాతో వున్నారు. అల్లు అర్జున్ మాత్రం రాజమౌళి తనతో సినిమా చేసే వరకు వేచి చూడకుండా సుకుమార్ చేస్తోన్న ‘పుష్ప’తోనే పాన్ ఇండియా మార్కెట్ మీద కన్నేసాడు. మహేష్ కూడా త్వరలోనే రాజమౌళితో సినిమా చేస్తాడు కనుక ఆ బెంగ లేదు. కొందరు యువ హీరోలు ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలు లాంఛ్ చేసేసారు.
ఇదిలావుంటే టయర్ 2 హీరోలలో నంబర్వన్గా కొనసాగుతోన్న నాని కూడా పాన్ ఇండియా మార్కెట్పై దృష్టి పెట్టవచ్చునని అంటున్నారు. శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని వేరే భాషలలో విడుదల చేస్తామనేది ఇంకా ప్రకటించలేదు కానీ ఆ ఐడియా అయితే వుందట. సినిమా బాగా వచ్చిందనే కాన్ఫిడెన్స్ వస్తే అప్పుడు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషలలోకి అనువదిస్తారట. పునర్జన్మ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోల్కతా నేపథ్యంలో వుంటుంది. నాని ఇందులో ఒక రచయితగా వినూత్న పాత్రలో కనిపిస్తాడని సమాచారం.
గత కొన్ని వారాలుగా రీ రిలీజుల ప్రహసనం మరీ ఎక్కువైపోయింది. హిట్టు ఫ్లాపు సంబంధం లేకుండా వరసబెట్టి దించేస్తున్నారు. అవి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానుల విషయంలో ఏ రీతిన స్పందిస్తారన్న విషయాన్ని ఇప్పుడు…
రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 3 స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లలో మిస్…
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…
మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…
విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…