థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు ఇతర బాషల ప్రేక్షకులు పెద్ద తెరమీద చూడలేదు కాబట్టి డిజిటల్ వ్యూస్ భారీగా వస్తాయని అటు నెట్ ఫ్లిక్స్ తో పాటు ఇటు మెగా ఫ్యాన్స్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఊహించని విధంగా ఇంకా వారం కాకుండానే పెద్ది టాప్ 5లోనే ఉండటం షాక్ కలిగిస్తోంది. నిజానికి జనాలు అంచనా వేసింది ఖచ్చితంగా టాప్ 3లో ఉంటుందని.
టీవీలో స్మార్ట్ ఫోన్లలో చూసిన ఉత్తరాది జనాలు పెద్దిలో చరణ్ నటనకు ప్రశంసలు అందిస్తున్నారు కానీ కంటెంట్ పట్ల మాత్రం పెదవి విరుపులే వినిపిస్తున్నాయి. ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలు వాళ్ళు చాలా చూసేసి ఉండటం ఒక కారణమైతే దర్శకుడు బుచ్చిబాబు చూపించిన మాస్ క్రికెట్ వాళ్లకు అంతగా ఎక్కలేదు. ట్రోలింగ్ కి ఆస్కారం ఇచ్చేలా ఇలాంటి ఆట చూపిస్తారా అంటూ ఎక్స్ లో ట్వీట్లు పెట్టేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఎక్కువ నెగటివ్ టాక్ నడుస్తోంది.
జరిగిపోయిన కథ గురించి ఇప్పుడు ఎందుకంటే కారణాలు లేకపోలేదు. రెండు మూడు సంవత్సరాలు మనం ఎలాంటి కథల మీద వర్క్ చేస్తున్నామో దర్శకులు గుర్తించాలి. ప్యాన్ ఇండియా స్టాంప్ వేసేసి, బడ్జెట్ లు పెంచేసి, నిర్మాతల మీద భారం పెట్టేసి కేవలం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను మెప్పించే పనైతే వందల కోట్లు ఖర్చు పెట్టడం వలన లాభం లేదు. ఓవర్సీస్ లో కనీసం బ్రేక్ ఈవెన్ కాకపోతే టయర్ 1 హీరోల మార్కెట్ రిస్కులో పడుతుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో.
పెద్దిని ఒక పాఠంగా చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎక్కువ కాలం ఖర్చు పెట్టినంత మాత్రాన సానుభూతితో ఆడియన్స్ సినిమాలు చూసేయరు. అలా అయితే అంజి నుంచి రాజా సాబ్ దాకా కేవలం సింపతీ మీద డబ్బులు తెచ్చి ఉండాలి. కానీ అలా జరగలేదు. రంగస్థలంని మించి ఉంటుందని పదే పదే ఊదరగొట్టిన పెద్ది బృందం రామ్ చరణ్ నుంచి బెస్ట్ పెర్ఫార్మన్స్ అయితే రాబట్టుకుంది కానీ సబ్జెక్టులో అసలైన దమ్ముని ప్రేక్షకులకు ఇవ్వలేకపోయింది.
మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…