లాక్డౌన్కి ముందు సీక్రెట్గా వున్న చాలా బాలీవుడ్ లవ్స్టోరీలు ఇప్పుడు సడన్గా పబ్లిక్ అయిపోయాయి. లాక్డౌన్కి ముందే ఈ లవ్స్టోరీల గురించి మీడియాలో గుసగుసలు వినిపించేవి కానీ అప్పుడు సీక్రెట్గా వుండడానికే ఇష్టపడ్డారు. అయితే నెలల తరబడి ఇంటికి పరిమితం కావాల్సి రావడంతో చాలా బాలీవుడ్ జంటలు న్యూ ఇయర్కి ఓపెన్ అయిపోయారు. మాస్కులు ధరించి వెళితే జనం గుర్తు పట్టలేరని అతి తెలివి చూపించడం కూడా ఇవి పబ్లిక్ అయిపోవడానికి కారణం కావచ్చు. టైగర్ ష్రాఫ్తో దిశా పటానీ అఫైర్ ఇప్పుడు పబ్లిక్ అయింది.
అలాగే సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణం సాగిస్తోన్న కియారా అద్వానీ కూడా అతనితో కలిసి మాల్దీవుల ట్రిప్పుకి వెళుతూ ఎయిర్పోర్టులో ఫోటోగ్రాఫర్లకు దొరికింది. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్కి కార్తీక్ ఆర్యన్తో లవ్స్టోరీ వుందనేది కూడా న్యూ ఇయర్ ట్రిప్ వల్లే లీకయింది. జాన్వీతో దడక్లో నటించిన ఇషాన్ ఖత్తర్ కూడా అనన్య పాండేతో ప్రేమలో మునిగి తేలుతున్నాడు. బాలీవుడ్ మీడియాకు అడపాదడపా ఇలాంటి విషయాలు తెలుస్తుంటాయి కానీ ఒకేసారి ఇంతమంది బయట పడడం మాత్రం పాండమిక్ మహత్యమేనని అంటున్నారు.
This post was last modified on January 7, 2021 1:28 am
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…
ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…
అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…