లాక్డౌన్కి ముందు సీక్రెట్గా వున్న చాలా బాలీవుడ్ లవ్స్టోరీలు ఇప్పుడు సడన్గా పబ్లిక్ అయిపోయాయి. లాక్డౌన్కి ముందే ఈ లవ్స్టోరీల గురించి మీడియాలో గుసగుసలు వినిపించేవి కానీ అప్పుడు సీక్రెట్గా వుండడానికే ఇష్టపడ్డారు. అయితే నెలల తరబడి ఇంటికి పరిమితం కావాల్సి రావడంతో చాలా బాలీవుడ్ జంటలు న్యూ ఇయర్కి ఓపెన్ అయిపోయారు. మాస్కులు ధరించి వెళితే జనం గుర్తు పట్టలేరని అతి తెలివి చూపించడం కూడా ఇవి పబ్లిక్ అయిపోవడానికి కారణం కావచ్చు. టైగర్ ష్రాఫ్తో దిశా పటానీ అఫైర్ ఇప్పుడు పబ్లిక్ అయింది.
అలాగే సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణం సాగిస్తోన్న కియారా అద్వానీ కూడా అతనితో కలిసి మాల్దీవుల ట్రిప్పుకి వెళుతూ ఎయిర్పోర్టులో ఫోటోగ్రాఫర్లకు దొరికింది. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్కి కార్తీక్ ఆర్యన్తో లవ్స్టోరీ వుందనేది కూడా న్యూ ఇయర్ ట్రిప్ వల్లే లీకయింది. జాన్వీతో దడక్లో నటించిన ఇషాన్ ఖత్తర్ కూడా అనన్య పాండేతో ప్రేమలో మునిగి తేలుతున్నాడు. బాలీవుడ్ మీడియాకు అడపాదడపా ఇలాంటి విషయాలు తెలుస్తుంటాయి కానీ ఒకేసారి ఇంతమంది బయట పడడం మాత్రం పాండమిక్ మహత్యమేనని అంటున్నారు.
This post was last modified on January 7, 2021 1:28 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…