50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్నప్పటికీ ధైర్యం చేసి కొత్త సినిమాలను విడుదల చేసేస్తున్నారు. క్రిస్మస్కు రిలీజ్ చేసిన సోలో బ్రతుకే సో బెటర్ చిత్రానికి మంచి స్పందన రావడంతో సంక్రాంతికి ఒకేసారి నాలుగు చిత్రాలు విడుదలవుతున్నాయి. కానీ అసలే పోటీ ఎక్కువ, పైగా సగం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్న నేపథ్యంలో రెవెన్యూ ఏమాత్రం వస్తుందో అన్న భయం ఉంది. ఇంత పోటీ ఉండాల్సింది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఐతే సంక్రాంతి సినిమాలకు అనుకోని వరం దక్కేలా ఉందన్నది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల మాట. తమిళనాట 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడపడానికి రెండు రోజుల కిందటే అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్లోనూ ఆశలు రేగాయి.
ఇక్కడి సినీ పెద్దలు ఆలస్యం చేయకుండా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. నిర్మాతల మండలి తరఫున అధికారికంగా ప్రభుత్వానికి విన్నపం కూడా పంపించేశారు. మరోవైపు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 100 శాతం ఆక్యుపెన్సీ కోసం విజ్ఞప్తులు వెళ్తున్నాయి. బెంగాల్లోనూ ఈ దిశగా అనుమతులు లభించనున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ కూడా సినీ పరిశ్రమకు వరం ఇవ్వబోతున్నట్లు చెబుతున్నారు.
తెలుగు సినిమాలకు సంబంధించి సంక్రాంతి అతి పెద్ద సీజన్ అన్న సంగతి తెలిసిందే. కాబట్టి ఇప్పుడే 100 శాతం ఆక్యుపెన్సీకి ఛాన్స్ ఇస్తే.. పండక్కి పోటీలో ఉన్న చిత్రాలకు ఎంతో లబ్ది చేకూరినట్లవుతుంది. ఈ నెల 9న క్రాక్ రిలీజవుతున్న నేపథ్యంలో నిర్ణయంతీసుకుంటే రాబోయే రెండు మూడు రోజుల్లోనే తీసుకోవచ్చని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?
This post was last modified on January 6, 2021 10:10 am
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఇమేజ్ ఉన్న హీరోలకు ఎదురయ్యే డైలమా ఒకటుంది. అదే వెబ్ సిరీస్ లకు ఎస్ చెప్పాలా వద్దాని. నాగ చైతన్య…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…