50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్నప్పటికీ ధైర్యం చేసి కొత్త సినిమాలను విడుదల చేసేస్తున్నారు. క్రిస్మస్కు రిలీజ్ చేసిన సోలో బ్రతుకే సో బెటర్ చిత్రానికి మంచి స్పందన రావడంతో సంక్రాంతికి ఒకేసారి నాలుగు చిత్రాలు విడుదలవుతున్నాయి. కానీ అసలే పోటీ ఎక్కువ, పైగా సగం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్న నేపథ్యంలో రెవెన్యూ ఏమాత్రం వస్తుందో అన్న భయం ఉంది. ఇంత పోటీ ఉండాల్సింది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఐతే సంక్రాంతి సినిమాలకు అనుకోని వరం దక్కేలా ఉందన్నది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల మాట. తమిళనాట 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడపడానికి రెండు రోజుల కిందటే అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్లోనూ ఆశలు రేగాయి.
ఇక్కడి సినీ పెద్దలు ఆలస్యం చేయకుండా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. నిర్మాతల మండలి తరఫున అధికారికంగా ప్రభుత్వానికి విన్నపం కూడా పంపించేశారు. మరోవైపు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 100 శాతం ఆక్యుపెన్సీ కోసం విజ్ఞప్తులు వెళ్తున్నాయి. బెంగాల్లోనూ ఈ దిశగా అనుమతులు లభించనున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ కూడా సినీ పరిశ్రమకు వరం ఇవ్వబోతున్నట్లు చెబుతున్నారు.
తెలుగు సినిమాలకు సంబంధించి సంక్రాంతి అతి పెద్ద సీజన్ అన్న సంగతి తెలిసిందే. కాబట్టి ఇప్పుడే 100 శాతం ఆక్యుపెన్సీకి ఛాన్స్ ఇస్తే.. పండక్కి పోటీలో ఉన్న చిత్రాలకు ఎంతో లబ్ది చేకూరినట్లవుతుంది. ఈ నెల 9న క్రాక్ రిలీజవుతున్న నేపథ్యంలో నిర్ణయంతీసుకుంటే రాబోయే రెండు మూడు రోజుల్లోనే తీసుకోవచ్చని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?
This post was last modified on January 6, 2021 10:10 am
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…