బలమైన వారసత్వంతో అడుగు పెట్టే హీరోలకు తొలి సినిమా విడుదల కాకుండానే అవకాశాలు వస్తుంటాయి. ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కూడా ఛాన్సులు అందుకుంటారు. కానీ ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన అమ్మాయిలకు మాత్రం తొలి సినిమా ఫలితం ఎంతో కీలకం. ఆ సినిమా రిలీజై మంచి విజయం సాధించాక కానీ తదుపరి అవకాశాలు రావు. కానీ కృతి శెట్టి అనే కొత్తమ్మాయి మాత్రం ఇందుకు మినహాయింపుగా నిలుస్తోంది.
మెగాస్టార్ చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ఉప్పెన సినిమాతోనే ఈ అమ్మాయి కూడా టాలీవుడ్లోకి అడుగు పెడుతోంది. గత ఏడాది వేసవికే రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడి ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఐతే సినిమా రిలీజ్ కాకున్నప్పటికీ ప్రోమోల్లో తనదైన అందం, హావభావాలతో కృతి ఆకట్టుకుంది.
కృతి గురించి చిత్ర బృందం నుంచి మంచి ఫీడ్ బ్యాక్ ఉండటం, ఇండస్ట్రీలో కొందరు సినిమా కూడా చూసి తన పెర్ఫామెన్స్ పట్ల ఇంప్రెస్ కావడంతో ఈ అమ్మాయికి మంచి మంచి అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని సరసన శ్యామ్ సింగరాయ్లో ఓ కథానాయికగా కృతి ఎంపికైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇంకో క్రేజీ ప్రాజెక్టులో కృతి అవకాశం దక్కించుకుంది.
ఇంద్రగంటి మోహనకృష్ణ లాంటి అభిరుచి ఉన్న దర్శకుడి కొత్త సినిమాలో కృతినే కథానాయిక. ఇందులో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. సోమవారమే ఈ సినిమా లాంచ్ అయింది. ఇంద్రగంటి సినిమాల్లో కథానాయికలకు ఉండే ప్రాధాన్యం ఎలాంటిదో, ఆయన హీరోయిన్లను ఎంత బాగా చూపిస్తారో తెలిసిందే కాబట్టి కృతి మరో బంపరాఫర్ కొట్టేసినట్లే. ఉప్పెన రిలీజ్ కాకముందే ఈమె జోరిలా ఉంటే.. ఆ సినిమా విడుదలై మంచి పేరొస్తే ఇంకెంత ఊపుంటుందో?
This post was last modified on January 5, 2021 8:40 am
గత ఏడాది డిసెంబర్ లో రిలీజైన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏ…
కొన్ని ల్యాండ్ మార్క్ సినిమాలకు కాలదోషం ఉండదు. టాలీవుడ్ స్థాయిని ప్రపంచ వీధుల దాకా తీసుకెళ్లి అక్కడ జెండా పాతేలా…
మాటల మాంత్రీకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. తమ వ్యం గ్యాస్త్రాలు,…
ఈ ఏడాది ఎండలు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఏకంగా 44, 45 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీచేస్తున్నది. ఆంధ్రప్రదేశ్,…
తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…