బలమైన వారసత్వంతో అడుగు పెట్టే హీరోలకు తొలి సినిమా విడుదల కాకుండానే అవకాశాలు వస్తుంటాయి. ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కూడా ఛాన్సులు అందుకుంటారు. కానీ ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన అమ్మాయిలకు మాత్రం తొలి సినిమా ఫలితం ఎంతో కీలకం. ఆ సినిమా రిలీజై మంచి విజయం సాధించాక కానీ తదుపరి అవకాశాలు రావు. కానీ కృతి శెట్టి అనే కొత్తమ్మాయి మాత్రం ఇందుకు మినహాయింపుగా నిలుస్తోంది.
మెగాస్టార్ చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ఉప్పెన సినిమాతోనే ఈ అమ్మాయి కూడా టాలీవుడ్లోకి అడుగు పెడుతోంది. గత ఏడాది వేసవికే రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడి ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఐతే సినిమా రిలీజ్ కాకున్నప్పటికీ ప్రోమోల్లో తనదైన అందం, హావభావాలతో కృతి ఆకట్టుకుంది.
కృతి గురించి చిత్ర బృందం నుంచి మంచి ఫీడ్ బ్యాక్ ఉండటం, ఇండస్ట్రీలో కొందరు సినిమా కూడా చూసి తన పెర్ఫామెన్స్ పట్ల ఇంప్రెస్ కావడంతో ఈ అమ్మాయికి మంచి మంచి అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని సరసన శ్యామ్ సింగరాయ్లో ఓ కథానాయికగా కృతి ఎంపికైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇంకో క్రేజీ ప్రాజెక్టులో కృతి అవకాశం దక్కించుకుంది.
ఇంద్రగంటి మోహనకృష్ణ లాంటి అభిరుచి ఉన్న దర్శకుడి కొత్త సినిమాలో కృతినే కథానాయిక. ఇందులో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. సోమవారమే ఈ సినిమా లాంచ్ అయింది. ఇంద్రగంటి సినిమాల్లో కథానాయికలకు ఉండే ప్రాధాన్యం ఎలాంటిదో, ఆయన హీరోయిన్లను ఎంత బాగా చూపిస్తారో తెలిసిందే కాబట్టి కృతి మరో బంపరాఫర్ కొట్టేసినట్లే. ఉప్పెన రిలీజ్ కాకముందే ఈమె జోరిలా ఉంటే.. ఆ సినిమా విడుదలై మంచి పేరొస్తే ఇంకెంత ఊపుంటుందో?
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…
ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…
తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…
ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…