బలమైన వారసత్వంతో అడుగు పెట్టే హీరోలకు తొలి సినిమా విడుదల కాకుండానే అవకాశాలు వస్తుంటాయి. ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కూడా ఛాన్సులు అందుకుంటారు. కానీ ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన అమ్మాయిలకు మాత్రం తొలి సినిమా ఫలితం ఎంతో కీలకం. ఆ సినిమా రిలీజై మంచి విజయం సాధించాక కానీ తదుపరి అవకాశాలు రావు. కానీ కృతి శెట్టి అనే కొత్తమ్మాయి మాత్రం ఇందుకు మినహాయింపుగా నిలుస్తోంది.
మెగాస్టార్ చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ఉప్పెన సినిమాతోనే ఈ అమ్మాయి కూడా టాలీవుడ్లోకి అడుగు పెడుతోంది. గత ఏడాది వేసవికే రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడి ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఐతే సినిమా రిలీజ్ కాకున్నప్పటికీ ప్రోమోల్లో తనదైన అందం, హావభావాలతో కృతి ఆకట్టుకుంది.
కృతి గురించి చిత్ర బృందం నుంచి మంచి ఫీడ్ బ్యాక్ ఉండటం, ఇండస్ట్రీలో కొందరు సినిమా కూడా చూసి తన పెర్ఫామెన్స్ పట్ల ఇంప్రెస్ కావడంతో ఈ అమ్మాయికి మంచి మంచి అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని సరసన శ్యామ్ సింగరాయ్లో ఓ కథానాయికగా కృతి ఎంపికైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇంకో క్రేజీ ప్రాజెక్టులో కృతి అవకాశం దక్కించుకుంది.
ఇంద్రగంటి మోహనకృష్ణ లాంటి అభిరుచి ఉన్న దర్శకుడి కొత్త సినిమాలో కృతినే కథానాయిక. ఇందులో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. సోమవారమే ఈ సినిమా లాంచ్ అయింది. ఇంద్రగంటి సినిమాల్లో కథానాయికలకు ఉండే ప్రాధాన్యం ఎలాంటిదో, ఆయన హీరోయిన్లను ఎంత బాగా చూపిస్తారో తెలిసిందే కాబట్టి కృతి మరో బంపరాఫర్ కొట్టేసినట్లే. ఉప్పెన రిలీజ్ కాకముందే ఈమె జోరిలా ఉంటే.. ఆ సినిమా విడుదలై మంచి పేరొస్తే ఇంకెంత ఊపుంటుందో?
This post was last modified on January 5, 2021 8:40 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…