బలమైన వారసత్వంతో అడుగు పెట్టే హీరోలకు తొలి సినిమా విడుదల కాకుండానే అవకాశాలు వస్తుంటాయి. ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కూడా ఛాన్సులు అందుకుంటారు. కానీ ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన అమ్మాయిలకు మాత్రం తొలి సినిమా ఫలితం ఎంతో కీలకం. ఆ సినిమా రిలీజై మంచి విజయం సాధించాక కానీ తదుపరి అవకాశాలు రావు. కానీ కృతి శెట్టి అనే కొత్తమ్మాయి మాత్రం ఇందుకు మినహాయింపుగా నిలుస్తోంది.
మెగాస్టార్ చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ఉప్పెన సినిమాతోనే ఈ అమ్మాయి కూడా టాలీవుడ్లోకి అడుగు పెడుతోంది. గత ఏడాది వేసవికే రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడి ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఐతే సినిమా రిలీజ్ కాకున్నప్పటికీ ప్రోమోల్లో తనదైన అందం, హావభావాలతో కృతి ఆకట్టుకుంది.
కృతి గురించి చిత్ర బృందం నుంచి మంచి ఫీడ్ బ్యాక్ ఉండటం, ఇండస్ట్రీలో కొందరు సినిమా కూడా చూసి తన పెర్ఫామెన్స్ పట్ల ఇంప్రెస్ కావడంతో ఈ అమ్మాయికి మంచి మంచి అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని సరసన శ్యామ్ సింగరాయ్లో ఓ కథానాయికగా కృతి ఎంపికైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇంకో క్రేజీ ప్రాజెక్టులో కృతి అవకాశం దక్కించుకుంది.
ఇంద్రగంటి మోహనకృష్ణ లాంటి అభిరుచి ఉన్న దర్శకుడి కొత్త సినిమాలో కృతినే కథానాయిక. ఇందులో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. సోమవారమే ఈ సినిమా లాంచ్ అయింది. ఇంద్రగంటి సినిమాల్లో కథానాయికలకు ఉండే ప్రాధాన్యం ఎలాంటిదో, ఆయన హీరోయిన్లను ఎంత బాగా చూపిస్తారో తెలిసిందే కాబట్టి కృతి మరో బంపరాఫర్ కొట్టేసినట్లే. ఉప్పెన రిలీజ్ కాకముందే ఈమె జోరిలా ఉంటే.. ఆ సినిమా విడుదలై మంచి పేరొస్తే ఇంకెంత ఊపుంటుందో?
This post was last modified on January 5, 2021 8:40 am
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…