హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే చివరి పబ్లిక్ ఈవెంట్ కావడంతో వాళ్ళ తాకిడి అధికంగా ఉంది. గెస్టులు ఎవరు వస్తున్నారో ముందే చెప్పేయడంతో సుకుమార్ ఎలాంటి అప్డేట్ ఇస్తారనే ఎగ్జైట్ మెంట్ తో ఫ్యాన్స్ ఎదురు చూశారు. ఊహించినట్టే ఆయన స్టేజి మీద మైకు అందుకున్నప్పుడు ఆర్సి 17 గురించి చెప్పమని చాలాసేపు అరిచి మాట్లాడకుండా చేశారు.
దానికి సమాధానంగా సుకుమార్ చాలా స్పష్టంగా నేను చెప్పను, చెప్పుకోవడం ఇష్టం ఉండదు, మీరే ఊహించుకోండి అంటూ తనదైన స్టయిల్ లో చాలా సున్నితమైన ఎలివేషన్ ఇచ్చారు. నిజానికి ఆ మూవీ గురించి ఏదైనా చెప్పడానికి వేదిక అది కాదు. ఏ చిన్న మాట చెప్పినా పెద్ది టాపిక్ పక్కకు వెళ్ళిపోయి సోషల్ మీడియాలో ఇదే హైలైట్ అవుతుంది. ఇది ముందే పసిగట్టిన సుకుమార్ అంత గోల వినిపించినా సరే చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
చిరంజీవి సినిమా ఫ్లాప్ అయితే ఆయన పడుకుంటారేమో కానీ మరో హిట్ వచ్చేవరకు మేం నిద్రపోయే వాళ్ళం కాదని చెప్పిన తీరు సగటు మాస్ అభిమాని ఎమోషన్ ని బయట పెట్టినట్టు అయ్యింది. నిజానికి ఈ కాంబో రావాలని మూవీ లవర్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. కానీ పుష్పకు ఎక్కువ సమయం ఖర్చయిపోవడం తర్వాత రామ్ చరణ్ కు కమిట్ మెంట్ ఇవ్వడం వల్ల మెగాస్టార్ సుక్కు కలయిక తెరమీద చూసే అదృష్టం ఫ్యాన్స్ కి కలగడం లేదు.
ఈవెంట్ సంగతి కాసేపు పక్కనపెడితే ఆర్సి 17 ప్రారంభం కావడానికి ఇంకో నాలుగైదు నెలలు పట్టేలా ఉంది. స్క్రిప్ట్ దాదాపు సిద్ధమయ్యిందని టాక్. టైటిల్ కూడా లాక్ చేసుకున్నారట. కాకపోతే అధికారిక ప్రకటన ఇవ్వడానికి ఇంకా బోలెడు సమయం ఉంది కాబట్టి అప్పటిదాకా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి డిసెంబర్ లేదా జనవరికి సెట్స్ మీదకు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రంగస్థలంని మించినది రావాలని సగటు ప్రేక్షకులు కూడా ఆశిస్తున్నారు.
This post was last modified on June 23, 2026 10:39 pm
నందమూరి బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి కాంబో రిపీట్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 111కు రెండు…
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దాల పాటు నంబర్ వన్ హీరోగా నిలవడం కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంత…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కంగనా రనౌత్.. పరిశ్రమలో ఒక స్థాయి అందుకున్న దగ్గర్నుంచి తాను పని చేసే ఇండస్ట్రీలోనే…
రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…
ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…
స్థానిక ఎన్నికలపై జనసేన త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..…