దాదాపు రెండు దశాబ్దాల పాటు బాలీవుడ్లో ఖాన్ త్రయానిదే ఆధిపత్యం. పారితోషకాల్లో కొత్త రికార్డులు నమోదు చేసినా.. కలెక్షన్ల రికార్డులు కొల్లగొట్టినా వారికే చెల్లింది. వార్షికాదాయం విషయంలోనూ వాళ్లను కొట్టే హీరోలు మరెవ్వరూ కనిపించలేదు. నంబర్ గేమ్ కూడా వారి చుట్టూనే తిరిగింది. మధ్యలో హృతిక్ రోషన్ కొంత పోటీ ఇచ్చాడు కానీ.. నిలకడ లేక ఖాన్ త్రయం ముందు నిలవలేకపోయాడు.
ఐతే ఇదంతా ఐదారేళ్ల ముందు మాట. ఈ ఐదారేళ్లలో మాత్రం కథ మారిపోయింది. ఖాన్ త్రయం జోరు తగ్గింది. అక్షయ్ కుమార్ అనే మీడియం రేంజ్ హీరో ఇంతింతై అన్నట్లు ఎదిగిపోయాడు. పారితోషకం, వార్షికాదాయం విషయంలో ఖాన్ త్రయాన్ని దాటి అతను ముందుకు వెళ్లిపోయాడు. ఇప్పుడు ఒక్కో సినిమాకు ఏకంగా రూ.100 కోట్లుక పైగా పారితోషకం తీసుకునే రేంజికి చేరుకున్నాడతను.
ఖాన్ త్రయంలా కాకుండా చాలా వేగంగా సినిమాలు చేసే అక్షయ్.. ఏడాదికి మూణ్నాలుగు చిత్రాలు లాగించేస్తుంటాడు. అందుకే వార్షికాదాయంలో ప్రస్తుతం అతణ్ని కొట్టే బాలీవుడ్ హీరో లేడు. ఆరేళ్ల వ్యవధిలో అతను ఏకంగా రూ.1744 కోట్లు ఆర్జించాడంటే అతి స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
గత ఏడాది కోవిడ్ సినీ పరిశ్రమపై ఏ స్థాయి ప్రభావం చూపిందో తెలిసిందే. ఇలాంటి సమయంలోనూ ఏడాదిలో రూ.356.57 కోట్ల ఆదాయం అందుకుని ఔరా అనిపించాడు అక్షయ్. అంతకుముందు ఏడాది ఇంతకంటే మించి ఆదాయం అతడి సొంతమైంది. 2019లో రూ.459.22 కోట్లు ఆర్జించాడు అక్షయ్. అంతకుముందు నాలుగేళ్ల సంగతి చూస్తే.. 2015లో రూ.208.42 కోట్లు, 2016లో రూ.211.58 కోట్లు, 2017లో 231.06 కోట్లు, రూ.277.06 కోట్ల చొప్పున ఆదాయం అందుకున్నాడు అక్షయ్. ఇలా ఆరేళ్ల వ్యవధిలో రూ.1744 కోట్ల ఆదాయంతో ఇండియాలో ఏ హీరో అందుకోలేని స్థాయిలో అక్షయ్ నిలిచినట్లు ఫోర్బ్స్ ప్రకటించింది.
This post was last modified on January 4, 2021 5:31 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…