దాదాపు రెండు దశాబ్దాల పాటు బాలీవుడ్లో ఖాన్ త్రయానిదే ఆధిపత్యం. పారితోషకాల్లో కొత్త రికార్డులు నమోదు చేసినా.. కలెక్షన్ల రికార్డులు కొల్లగొట్టినా వారికే చెల్లింది. వార్షికాదాయం విషయంలోనూ వాళ్లను కొట్టే హీరోలు మరెవ్వరూ కనిపించలేదు. నంబర్ గేమ్ కూడా వారి చుట్టూనే తిరిగింది. మధ్యలో హృతిక్ రోషన్ కొంత పోటీ ఇచ్చాడు కానీ.. నిలకడ లేక ఖాన్ త్రయం ముందు నిలవలేకపోయాడు.
ఐతే ఇదంతా ఐదారేళ్ల ముందు మాట. ఈ ఐదారేళ్లలో మాత్రం కథ మారిపోయింది. ఖాన్ త్రయం జోరు తగ్గింది. అక్షయ్ కుమార్ అనే మీడియం రేంజ్ హీరో ఇంతింతై అన్నట్లు ఎదిగిపోయాడు. పారితోషకం, వార్షికాదాయం విషయంలో ఖాన్ త్రయాన్ని దాటి అతను ముందుకు వెళ్లిపోయాడు. ఇప్పుడు ఒక్కో సినిమాకు ఏకంగా రూ.100 కోట్లుక పైగా పారితోషకం తీసుకునే రేంజికి చేరుకున్నాడతను.
ఖాన్ త్రయంలా కాకుండా చాలా వేగంగా సినిమాలు చేసే అక్షయ్.. ఏడాదికి మూణ్నాలుగు చిత్రాలు లాగించేస్తుంటాడు. అందుకే వార్షికాదాయంలో ప్రస్తుతం అతణ్ని కొట్టే బాలీవుడ్ హీరో లేడు. ఆరేళ్ల వ్యవధిలో అతను ఏకంగా రూ.1744 కోట్లు ఆర్జించాడంటే అతి స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
గత ఏడాది కోవిడ్ సినీ పరిశ్రమపై ఏ స్థాయి ప్రభావం చూపిందో తెలిసిందే. ఇలాంటి సమయంలోనూ ఏడాదిలో రూ.356.57 కోట్ల ఆదాయం అందుకుని ఔరా అనిపించాడు అక్షయ్. అంతకుముందు ఏడాది ఇంతకంటే మించి ఆదాయం అతడి సొంతమైంది. 2019లో రూ.459.22 కోట్లు ఆర్జించాడు అక్షయ్. అంతకుముందు నాలుగేళ్ల సంగతి చూస్తే.. 2015లో రూ.208.42 కోట్లు, 2016లో రూ.211.58 కోట్లు, 2017లో 231.06 కోట్లు, రూ.277.06 కోట్ల చొప్పున ఆదాయం అందుకున్నాడు అక్షయ్. ఇలా ఆరేళ్ల వ్యవధిలో రూ.1744 కోట్ల ఆదాయంతో ఇండియాలో ఏ హీరో అందుకోలేని స్థాయిలో అక్షయ్ నిలిచినట్లు ఫోర్బ్స్ ప్రకటించింది.
This post was last modified on January 4, 2021 5:31 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…