బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన మార్కెట్ ని డ్యామేజ్ చేసిన మాట నిజమే కానీ ఒక హిట్టు పడితే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చే సహృదయం టాలీవుడ్ ఆడియన్స్ కి ఉంది తాజాగా విడుదలైన వంద దేవుళ్ళుకు డీసెంట్ టాక్ వచ్చింది. రివ్యూలు మరీ నెగటివ్ గా రాలేదు. కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా సౌండ్ లేదు. ప్రమోషన్ల పరంగా శ్రద్ధ తీసుకోకపోవడం కలెక్షన్ల మీద ప్రభావం చూపిస్తోంది.
కథ పరంగా ఉన్న సున్నితమైన అంశం మన జనాలకు కనెక్ట్ కావడంలో కొంత ఇబ్బంది కలిగిస్తుందేమోననే అభిప్రాయం రెస్పాన్స్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో ప్రత్యేకంగా హీరో హీరోయిన్ అంటూ ఎవరూ లేరు. ప్రధాన పాత్ర పోషించిన శ్వాసిక భర్తను కోల్పోయి పిల్లల్ని పెంచి పెద్దచేసి ప్రయోజకులను చేశాక, సమాజం సూటిపోటి మాటలు భరించలేక మళ్ళీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. తర్వాత జరిగే పరిణామాలే వంద దేవుళ్ళులో ఉన్న మెయిన్ పాయింట్.
గతంలో తెలుగులో ఇలాంటివి కొన్ని వచ్చాయి. మా నాన్నకు పెళ్లి, స్రవంతి, సౌందర్య నటించిన అరుంధతి లాంటివి ఈ క్యాటగిరీలో వస్తాయి. అయితే అన్ని సక్సెస్ కాలేదు. కొన్ని ఫెయిలయ్యాయి. వంద దేవుళ్ళు సీరియస్ నెరేషన్ లో వెళ్లడం, అసలు కథ సెకండాఫ్ లో ఉండటం, విజయ్ ఆంటోనీ రెండో సగంలోనే ఎంట్రీ ఇవ్వడం లాంటివి కొంత మైనస్ గా నిలిచాయి. దర్శకుడు శశి కొన్ని అంశాలను చాలా బాగా హ్యాండిల్ చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ తీర్చిద్దిద్దిన విధానం.
కాకపోతే ఒకటి గమనించాలి. జనాలు మా ఇంటి బంగారం ఫీవర్ లో ఉన్నారు. ఫ్యామిలీస్ గంపగుత్తగా దానికి వెళ్లిపోతున్నారు. పెద్దిని ఇప్పటిదాకా చూడనివాళ్ళు సండే ఆప్షన్ గా రామ్ చరణ్ కు ఓటేస్తున్నారు. దీవానాకు యూత్ మద్దతు ఏ సెంటర్స్ కు పరిమితమయ్యింది. కంటెంట్ అంతో ఇంతో బాగున్నప్పుడు జనాల్లోకి దాన్ని మరింత బలంగా తీసుకెళ్లాలి. అప్పుడే వంద దేవుళ్ళు లాంటివి కాసిన్ని డబ్బులు చేసుకుంటాయి. వీక్ డేస్ లో ఏం చేయనుందో చూడాలి.
This post was last modified on June 21, 2026 11:12 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…