అనివార్య కారణాలతో చాలా ఆలస్యంగా పట్టాలెక్కింది సుకుమార్, అల్లు అర్జున్ల పుష్ప సినిమా. షూటింగ్ మొదలయ్యాక కూడా ఆ చిత్రానికి అడ్డంకులు తప్పలేదు. పక్కాగా ప్లాన్ చేసుకుని తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ మొదలుపెడితే.. కొన్ని రోజుల వరకు అంతా బాగానే సాగింది. కానీ అంతలోనే కరోనా కాటుతో షూటింగ్కు బ్రేక్ పడింది.
దీంతో సుకుమార్ తీవ్ర నిరాశకే గురైనట్లు యూనిట్ వర్గాల సమాచారం. తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్కు తిరిగొచ్చేసిన చిత్ర బృందం.. కొన్ని రోజుల విరామం తర్వాత ఈ సిటీలోనే వేరే సన్నివేశాల చిత్రీకరణ మొదలుపెట్టింది. రెండు వారాల పాటు షూటింగ్ సాగింది. కాచిగూడ, పటాన్చెరు ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. తర్వాత విరామం తీసుకున్నారు.
ఇక పుష్ప టీం కొన్ని రోజుల్లోనే సుదీర్ఘ షెడ్యూల్ మొదలుపెట్టబోతోంది. మళ్లీ టీం అంతా కలిసి మారేడుమిల్లికే వెళ్లబోతున్నారు. జనవరి 7న ఈ షెడ్యూల్ మొదలవుతుందని సమాచారం. ఆరేడు వారాల పాటు విరామం లేకుండా అడవి నేపథ్యంలో అనుకున్న సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్లు, పాటలు అన్నీ పూర్తి చేయబోతున్నారట. ఈ షెడ్యూల్తో సగానికి పైగానే సినిమా పూర్తవుతుందని సమాచారం. మళ్లీ అడవిలోకి వెళ్లే అవసరం లేకుండా మొత్తం పని ముగించేయాలని సుక్కు పట్టుదలతో ఉన్నాడు.
ఈసారి కరోనా బెడద లేకుండా అన్ని జాగ్రత్తల మధ్య, సాధ్యమైనంత తక్కువమంది క్రూతో షూటింగ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారట. ఈ షెడ్యూల్ మధ్యలోనే విలన్ రంగప్రవేశం చేస్తాడట. త్వరలోనే ఆ పాత్రను చేసేదెవరో వెల్లడించనున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయిక.
This post was last modified on January 4, 2021 7:16 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…