ఈ రోజుల్లో సోషల్ మీడియా నెగెటివిటీ సినిమాలకు ఎంత నష్టం చేకూరుస్తుందో తెలిసిందే. ఫ్యాన్ వార్స్ తీవ్ర స్థాయికి చేరుకుని, తమ ఫేవరెట్ హీరో సినిమాకు ఎలివేషన్ ఇచ్చుకోవడంకంటే అవతలి హీరో సినిమా మీద విషం కక్కడానికే అభిమానులు ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితులు వచ్చేశాయి. ఒక పెద్ద హీరో సినిమా రిలీజవుతుంటే.. అవతల వేరే హీరోల ఫ్యాన్స్ అంతా ఒక్కటై నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. తర్వాత ఆ హీరో సినిమా రిలీజపుడు ఈ హీరో ఫ్యాన్స్ రంగంలోకి దిగుతున్నారు.
దీంతో ఎంత మంచి సినిమాకైనా నెగెటివిటీ తప్పట్లేదు. ఇదే విషయమై సీనియర్ నటుడు జగపతిబాబు పెద్ది దర్శకుడు బుచ్చిబాబు సానాతో కలిసి చేసిన ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో స్పందించారు. పెద్ది సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన నెఎటివ్ కామెంట్లు, రివ్యూలు రావడం గమనించానని.. అది చూసి తాను చాలా నిరాశచెందానని జగపతి చెప్పారు.
ఈ సినిమాను మొదటి రెండు మూడు రోజుల్లో ఎక్కువగా రామ్ చరణ్ అభిమానులు, రెగ్యులర్ సినిమా గోయర్స్తో పాటు.. యాంటీ ఫ్యాన్స్ కూడా పెద్ద సంఖ్యలోనే చూశారని ఆయనన్నారు. ఇలా థియేటర్లకు వచ్చిన వాళ్లలో 90 శాతం మంది సినిమా పోవాలనే కోరుకునే వాళ్లే ఉంటారని జగపతిబాబు వ్యాఖ్యానించారు.
ఇప్పుడు ప్రతి పెద్ద సినిమాకూ ఇలాంటి నెగెటివిటీ సహజం అయిపోయిందని.. వీళ్లు పని గట్టుకుని సినిమా మీద విష ప్రచారం చేస్తుంటారని ఆయనన్నారు. ఐతే పెద్ది సినిమా ఈ నెగెటివిటీని దాటుకుని ప్రేక్షకాదరణ పొందిందని జగపతిబాబు అభిప్రాయపడ్డారు.
ఫ్యామిలీ ఆడియన్స్కు ఈ సినిమా బాగా నచ్చిందని.. తనతో కూర్చుని మాట్లాడిన చాలామంది సినిమా ఇంత బాగుంటే, నెగెటివ్ రివ్యూలు, కామెంట్లు ఇస్తున్నారేంటి అని తన దగ్గర ఆశ్చర్యపోయినట్లు జగపతిబాబు వ్యాఖ్యానించారు.
రూ.300 టికెట్ రేటు పెట్టి సినిమా చూసే వ్యక్తి సినిమా మీద నెగెటివ్ కామెంట్లు, రివ్యూలు చేయడం ద్వారా 10 వేల రూపాయలు సంపాదిస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. కానీ 350 కోట్లు పెట్టి సినిమా తీసే మనకంటే 300 పెట్టి సినిమా చూసే ప్రేక్షకుడే కింగ్ అని ఆయన పేర్కొన్నారు.
ఐపీఎల్లో సిక్సర్ల సునామీతో అందరినీ ఆశ్చర్యపరిచిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఇండియా A జట్టు తరఫున ఆడుతూ ఇప్పుడిప్పుడే…
ఏపీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణం తవ్వుతున్న కొద్దీ సరికొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. దాదాపుగా రూ.3 వేల కోట్లకు…
అమెరికాలో వస్తువుల ధరలు గత మూడు సంవత్సరాలలో ఎన్నడూ లేనంత వేగంగా పెరిగిపోతుండటంతో జనాల్లో విషయం చర్చనీయాంశంగా మారింది. గత…
పెద్ది టాక్స్, డిస్కషన్ల సంగతి పక్కనపెడితే బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా ఉన్న మాట వాస్తవం. కొన్ని ఏరియాలలో పుష్ప…
రాజ్యసభ స్థానాల అభ్యర్థుల ఎంపికలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పేరు ప్రముఖంగా వినిపించింది. ఆమెను కర్ణాటక నుంచి రాజ్యసభకు…
రాజ రాజ చోర, స్వాగ్ దర్శకుడు హసిత్ గోలి, మాస్ మహారాజ రవితేజ కలయికలో ఒక సినిమా రూపొందబోయే సంగతి…