హిందీలో మలైకా అరోరా.. తెలుగులో హంసా నందిని లాంటి వాళ్లు కేవలం ఐటెం పాటలతోనే పాపులర్ అయ్యారు. వాళ్లు హీరోయిన్లుగా ఎవరికీ గుర్తుండరు. ఐటెం భామలుగానే పేరు సంపాదించారు. ఐతే ఇంతకుముందు ఐటెం సాంగ్స్ను వేరుగా చూసేవాళ్లు. వాటిలో హీరోయిన్లు కనిపించేవాళ్లు కాదు. ఆ తరహా పాటల్లో కనిపించే వాళ్ల స్థాయి కొంచెం తక్కువగా ఉండేది.
కానీ గత కొన్నేళ్లలో శ్రుతి హాసన్, తమన్నా, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ హీరోయిన్లు ఐటెం సాంగ్స్ చేసి ఆ తరహా పాటల స్థాయి పెంచారు. ఆ నేపథ్యంలో వేరే హీరోయిన్లు కూడా ఐటెం సాంగ్స్ చేయడానికి వెనుకాడట్లేదు. ఈ పాటల్లో అందాలు ఆరబోస్తూ మాస్ స్టెప్పులు వేస్తే వచ్చే గుర్తింపు, క్రేజే వేరు. ఇప్పుడు హెబ్బా పటేల్ ఇదే పని చేసింది. రామ్ సినిమా రెడ్ కోసం ఆమె చేసిన దించక్ పాట ఇన్స్టంట్ హిట్టయిపోయింది.
ఇంకో రెండు వారాల్లో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో దించక్ సాంగ్ లిరికల్ వీడియో వదిలారు. అందులో కొన్ని విజువల్స్ కూడా చూపించారు. మాస్ పల్స్ బాగా తెలిసిన జానీ మాస్టర్.. మాంచి నాటు స్టెప్పులేయించాడు. అవి చూస్తే థియేటర్లలో మాస్ ప్రేక్షకులు కుదురుగా ఉండటం కష్టమే అనిపిస్తోంది.
ఇక తాను నటిస్తున్న సినిమాల్లో రోజు రోజుకూ బోల్డ్ నెస్ పెంచేస్తున్న హెబ్బా ఈ పాటలో మరింతగా అందాలు ఆరబోసింది. ఆమె లుక్స్, డ్రెస్సింగ్, హావభావాలు, స్టెప్పులు అన్నీ కూడా చాలా హాట్గా ఉండి కుర్రాళ్ల గుండెల్ని లయ తప్పించేలా ఉన్నాయి. సినిమాలో కచ్చితంగా ఈ పాట హైలైట్ అవుతుందనిపిస్తోంది. హీరోయిన్గా కెరీర్పై పెద్దగా ఆశల్లేని హెబ్బా.. ఇకపై భీష్మ తరహా హాట్ క్యామియోలు.. ఈ తరహా ఐటెం సాంగ్స్ చేస్తూ నడిపించేయొచ్చు అనిపిస్తోంది చూస్తుంటే.
This post was last modified on December 31, 2020 1:14 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నెల 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్…
తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ పై అన్ని వర్గాలు స్పందించాయి. రాజకీయ వర్గాల నుంచి పారిశ్రామిక వర్గాల…
నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తండేల్ రాజ్ ని పుష్పరాజ్ కలుసుకోవడాన్ని చూసి ఆనందిద్దామని ఎదురు చూసిన…
వైసీపీ పాలనలో ఏపీలో భూముల అన్యాక్రాంతం యథేచ్చగా సాగిందన్న ఆరోపణలు ఒకింత గట్టిగానే వినిపించాయి. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి…
పియర్ పండు, లేదా బేరిపండు, రుచిలో మధురమైనది మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ పండు…
రాష్ట్రంలోని కూటమి సర్కారు ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులను మాత్రమే భర్తీ చేస్తోంది. అయితే.. ఈ క్రమంలో సీఎం విచక్షణ…