సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దర్శకుడు బుచ్చిబాబు వీడియో క్లిప్పులు దర్శనమిస్తున్నాయి. పెద్ది ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆయన పంచుకున్న విశేషాలతో అభిమానులు ఫుల్ హ్యాపీ అవుతున్నారు. గత కొద్దిరోజులుగా పబ్లిసిటీ విషయంలో ప్లానింగ్ సరిగా లేదనే అసంతృప్తి మెగాభిమానుల్లో బలంగా ఉంది. దాన్ని తగ్గించే పనిని ఇప్పుడీ క్లిప్పులు విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. ఓ రెండు రోజులు ఇలా మేనేజ్ చేస్తే ట్రైలర్ వచ్చేస్తుంది.
పెద్ది మేకింగ్, రామ్ చరణ్ డెడికేషన్, ఖుషి కపూర్ ని అనుకుని ఆమె అక్క జాన్వీని తీసుకోవడం, చిరంజీవి సెట్స్ కి వచ్చినప్పుడు కాసేపే సమయం గడపడం, ఎమోషనల్ క్లైమాక్స్, ఐటెం సాంగ్, మూడు క్రీడల నేపథ్యం ఇలా బోలెడు కబుర్లు మనసారా పంచుకున్నాడు బుచ్చిబాబు. రెహమాన్ తో అనుభవాన్ని వివరించిన తీరు మ్యూజిక్ లవర్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. చాలా గ్రౌండెడ్ గా కనిపించే ఈ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అన్ని ఇంటర్వ్యూలు వరసగా ఇచ్చినా ప్రశాంతంగా మాట్లాడ్డం గమనార్హం.
రిలీజ్ ఇంకో పద్దెనిమిది రోజులు మాత్రమే ఉండటంతో థియేటర్లు ఎప్పుడెప్పుడు జూన్ 4 వస్తుందా అని ఎదురు చూస్తున్నాయి. సంక్రాంతి సినిమాలు అన్నింటికీ వచ్చిన ఓపెనింగ్స్ కలిపినా దాని కంటే పెద్ద మొత్తమే పెద్దికి రిజిస్టర్ అవుతుందని ట్రేడ్ బల్లగుద్ది చెబుతోంది. జనాలు ఎంత కరువులో ఉన్నారో డబ్బింగ్ సినిమా వీరభద్రుడు బుకింగ్స్ చూస్తే అర్థమవుతుంది. టాక్ ఎలా ఉన్నా ఒకసారి చూద్దామని మాస్ ఆడియన్స్ వెళ్లిపోతున్నారు.
దానికే ఇలా ఉంటే ఇక పెద్ది చేయబోయే భీభత్సం గురించి వేరే చెప్పాలా. చివరి దశ పనులు ఇంకొంచెం పెండింగ్ ఉండటంతో పాటు వరస ఈవెంట్ల వల్ల బుచ్చిబాబు ముందస్తుగానే తెలుగు మీడియాకు ముఖాముఖీ చేసేశారు. దీని వల్ల పెద్ది ముచ్చట్లు తెలుసుకోవడానికి అడ్వాన్స్ గా దొరికింది. ఎక్కువ లీకులు పంచుకోకపోయినా ముఖ్యమైన విషయాలు షేర్ చేసుకున్నారు కాబట్టి ఇంతకన్నా ఆశించడం భావ్యం కాదు. 18న ముంబై ట్రైలర్ వేడుకలో ఏమైనా సర్ప్రైజులు ఉంటాయేమో చూడాలి.
వైసీపీ ఏపీలో డీలా పడిన విషయం తెలిసిందే. గత 2024 ఎన్నికల వరకు 151 మంది ఎమ్మెల్యేలతో కళకళ లాడిన…
ఏది జరిగినా మంచికే అని పెద్దలు ఊరికే అనలేదు. సమంతకు ఇది ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తోంది. ఖుషి తర్వాత బాగా…
హీరోలు నిర్మాతలు కావడం కొత్తేమి కాదు. చిరంజీవి పీక్స్ లో ఉన్నప్పుడే అంజనా ప్రొడక్షన్స్ స్థాపించారు. కార్డు నాగబాబు పేరు…
వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడుపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం…
వైసీపీ అధినేత జగన్పై ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో…
అనుకున్నంతా అయ్యింది. గత కొంతకాలంగా బీజేపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై తాజాగా ఆ…