ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి అమీర్ పేట్ దాకా, కూకట్ పల్లి నుంచి కర్మాన్ ఘాట్ దాకా ఎన్ని ఉండేవో చరిత్ర కనక తవ్వితే ఆ నెంబర్ కి మతి పోవడం ఖాయం. నగరాల్లోనే కాదు జిల్లా కేంద్రాల్లోనూ అంతే. ఏడెనిమిది థియేటర్లతో నిత్యం కళకళలాడుతూ ఉండేవి. డిజాస్టర్లు సైతం కనీసం మూడు వారాలు ఆడే గొప్ప రోజులవి. బ్లాక్ బస్టర్ అయితే మినిమమ్ సిల్వర్ జూబ్లీ ఆడాల్సిందే. ఇదంతా గతం.
ఇప్పుడు మల్టీప్లెక్సుల డామినేషన్ పెరిగిపోయింది. జనాల ఆదాయంలో గణనీయమైన మార్పులు, భార్యా భర్తా ఇద్దరూ సంపాదించే కుటుంబాలు ఎక్కువ కావడంతో దానికి తగ్గట్టే సౌకర్యాలను డిమాండ్ చేయడం మొదలయ్యింది. ఫలితంగా కార్పొరేట్ సంస్థలు రంగప్రవేశం చేసి, ఒకే చోట నాలుగైదు స్క్రీన్లు ఉండే సముదాయాలు కట్టేసి, ఒకవేళ ఒక సినిమాకు టికెట్లు దొరక్కపోయినా వెనక్కు వెళ్లే అవసరం రానివ్వకుండా ఒక కొత్త తరహా ట్రెండ్ కి శ్రీకారం చుట్టాయి.
కాలక్రమేణా బుకింగ్ యాప్స్ రావడం, టెక్నాలజీ వాడకం లాంటివి జనాలకు టికెట్లు బుక్ చేసుకోవడం, సినిమాకు వెళ్ళడం మరింత సులభతరం చేశాయి. అంత గొప్ప సౌలభ్యాలు లేని సింగల్ స్క్రీన్లు క్రమంగా వైభవం తగ్గించుకున్నాయి. మెయింటెనెన్స్ లేకపోవడం ప్రధాన లోపంగా చెప్పొచ్చు. మైత్రి రవిశంకర్ అన్నట్టు శుభ్రమైన వాష్ రూమ్స్ , 4కె స్క్రీన్లు ఉన్న ఒంటి థియేటర్లు ఎన్ని ఉన్నాయంటే భాగ్యనగరం మొత్తం మీద సింగల్ నెంబర్లోనే ఉంటాయి.
సో ఇప్పుడు దృష్టి పెట్టాల్సింది అనుభూతిని పై స్థాయికి తీసుకెళ్లడం గురించి. ఇవాళ మీటింగ్ లో చెప్పినట్టు బాలానగర్ విమల్, వైజాగ్ జగదాంబ – మెలోడీ – సంగం శరత్ తరహాలో అన్ని సింగల్ స్క్రీన్లు ఎక్స్ పీరియన్స్ ఇవ్వడంలో కనక పోటీ పడితే ఆడియన్స్ ఖచ్చితంగా వీటికే వస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా రిచ్ కావాలనుకునే వాళ్లు ఎలాగూ మల్టీప్లెక్సులకు వెళ్తారు. సో రెండూ మనుగడ కొనసాగిస్తాయి. ముందు ఆలోచన చేయాల్సింది ఈ కోణంలోనే.
This post was last modified on May 13, 2026 9:33 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…