ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి అమీర్ పేట్ దాకా, కూకట్ పల్లి నుంచి కర్మాన్ ఘాట్ దాకా ఎన్ని ఉండేవో చరిత్ర కనక తవ్వితే ఆ నెంబర్ కి మతి పోవడం ఖాయం. నగరాల్లోనే కాదు జిల్లా కేంద్రాల్లోనూ అంతే. ఏడెనిమిది థియేటర్లతో నిత్యం కళకళలాడుతూ ఉండేవి. డిజాస్టర్లు సైతం కనీసం మూడు వారాలు ఆడే గొప్ప రోజులవి. బ్లాక్ బస్టర్ అయితే మినిమమ్ సిల్వర్ జూబ్లీ ఆడాల్సిందే. ఇదంతా గతం.
ఇప్పుడు మల్టీప్లెక్సుల డామినేషన్ పెరిగిపోయింది. జనాల ఆదాయంలో గణనీయమైన మార్పులు, భార్యా భర్తా ఇద్దరూ సంపాదించే కుటుంబాలు ఎక్కువ కావడంతో దానికి తగ్గట్టే సౌకర్యాలను డిమాండ్ చేయడం మొదలయ్యింది. ఫలితంగా కార్పొరేట్ సంస్థలు రంగప్రవేశం చేసి, ఒకే చోట నాలుగైదు స్క్రీన్లు ఉండే సముదాయాలు కట్టేసి, ఒకవేళ ఒక సినిమాకు టికెట్లు దొరక్కపోయినా వెనక్కు వెళ్లే అవసరం రానివ్వకుండా ఒక కొత్త తరహా ట్రెండ్ కి శ్రీకారం చుట్టాయి.
కాలక్రమేణా బుకింగ్ యాప్స్ రావడం, టెక్నాలజీ వాడకం లాంటివి జనాలకు టికెట్లు బుక్ చేసుకోవడం, సినిమాకు వెళ్ళడం మరింత సులభతరం చేశాయి. అంత గొప్ప సౌలభ్యాలు లేని సింగల్ స్క్రీన్లు క్రమంగా వైభవం తగ్గించుకున్నాయి. మెయింటెనెన్స్ లేకపోవడం ప్రధాన లోపంగా చెప్పొచ్చు. మైత్రి రవిశంకర్ అన్నట్టు శుభ్రమైన వాష్ రూమ్స్ , 4కె స్క్రీన్లు ఉన్న ఒంటి థియేటర్లు ఎన్ని ఉన్నాయంటే భాగ్యనగరం మొత్తం మీద సింగల్ నెంబర్లోనే ఉంటాయి.
సో ఇప్పుడు దృష్టి పెట్టాల్సింది అనుభూతిని పై స్థాయికి తీసుకెళ్లడం గురించి. ఇవాళ మీటింగ్ లో చెప్పినట్టు బాలానగర్ విమల్, వైజాగ్ జగదాంబ – మెలోడీ – సంగం శరత్ తరహాలో అన్ని సింగల్ స్క్రీన్లు ఎక్స్ పీరియన్స్ ఇవ్వడంలో కనక పోటీ పడితే ఆడియన్స్ ఖచ్చితంగా వీటికే వస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా రిచ్ కావాలనుకునే వాళ్లు ఎలాగూ మల్టీప్లెక్సులకు వెళ్తారు. సో రెండూ మనుగడ కొనసాగిస్తాయి. ముందు ఆలోచన చేయాల్సింది ఈ కోణంలోనే.
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న 'ధర్మన్' ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. దర్శకులు మారుతూ వచ్చిన ఈ…
ఇంకో పది రోజుల్లో రావు బహదూర్ విడుదల కానుంది. సత్యదేవ్ ఎప్పుడూ లేనంత వైవిధ్యంగా వివిధ గెటప్స్ లో ఇందులో…
నిన్న పెద్ది సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి నిలిచారు. గతంలో తండ్రి కొడుకుల స్టేజి కలయిక…
ప్రభుత్వాలు చేపట్టే కీలక కార్యక్రమాలకు పేర్లు సూచించే వారికి బహుమానాలు ఇస్తుంటాయి. అలానే కానుకలు కూడా ఇస్తాయి. గతంలో స్వచ్ఛ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఐదేళ్లు పాలించిన జగన్.. నానుస్తూ వచ్చి.. చివరకు తనకు సాధ్యంకాదని…