Movie News

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జన్మదినం. అదే నెలలో ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ కూడా జన్మించడం విశేషం. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన తారక్‌కు భారీగా అభిమాన గణం ఉంది. వాళ్లు ప్రతి సంవత్సరం తారక్ పుట్టిన రోజైన మే 20న తమ హీరో సినిమాకు సంబంధించి ఏదో అప్‌డేట్ ఆశిస్తారు. ఈసారి ట్రీట్ చాలా భారీగానే ఉండబోతున్నట్లు ముందే సంకేతాలు అందాయి.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) నుంచి ఫస్ట్ గ్లింప్స్ ఈ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. తారక్ కెరీర్లోనే అత్యంత హైప్ తెచ్చుకున్న సినిమా ఇది. కేజీఎఫ్, కేజీఎఫ్-2, సలార్ ప్రోమోలతో ప్రశాంత్ ఎంతటి సంచలనాలు రేపాడో గుర్తుండే ఉంటుంది. అలాంటి దర్శకుడు తారక్ లాంటి పెద్ద మాస్ హీరోతో సినిమా చేస్తుండడంతో గ్లింప్స్ ఒక రేంజిలో ఉంటుందని ఆశిస్తున్నారు ఫ్యాన్స్.

ఈ గ్లింప్స్ లాంచింగ్‌కు ముహూర్తం కూడా ఖరారైనట్లు సమాచారం. తారక్ పుట్టిన రోజుకు ముందు రోజు అర్ధరాత్రే ఈ వీడియో బయటికి వచ్చేస్తుందట. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు గ్లింప్స్ లాంచ్ చేస్తారట. అంచనాలకు తగ్గట్లే భారీ లెవెల్లో.. యాక్షన్-ఎలివేషన్లతో ఈ గ్లింప్స్ నిండి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అర్ధరాత్రి గ్లింప్స్ లాంచ్ అంటే.. ఇక ఆ రోజు రాత్రంతా తారక్ అభిమానులకు నిద్ర ఉండదన్నట్లే. గ్లింప్స్ అంచనాలకు తగ్గట్లు ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో సంబరాలు మిన్నంటడం ఖాయం.

ఈ ఏడాదే రిలీజ్ కావాల్సిన ‘డ్రాగన్’.. స్క్రిప్టులో మార్పులు, షూటింగ్ ఆలస్యం వల్ల వచ్చే ఏడాదికి వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. 2027 జూన్ 11న ‘డ్రాగన్’ థియేటర్లలోకి దిగుతుంది. తారక్ సరసన రుక్మిణి వసంత్ నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. మరోవైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ నటించబోయే ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టు గురించి కూడా ఈ పుట్టిన రోజుకు అనౌన్స్‌మెంట్ ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి.

This post was last modified on May 12, 2026 12:50 pm

Share

Recent Posts

మాజీ ముఖ్యమంత్రి తనయుడు అరెస్టు… అక్కడ పొలిటికల్ హీట్!

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…

16 minutes ago

ఆ వైరస్ యమ డేంజర్… ఇప్పటికే 22 మంది పిల్లలు మృతి

గుజరాత్‌లో చాందిపుర వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…

33 minutes ago

సినిమా చూడాలంటే మ‌నోళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా…

సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వ‌రైనా ఒప్పుకోవాల్సిందే. త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డం కోసం తెలుగు రాష్ట్రాల‌కు…

48 minutes ago

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

2 hours ago

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

5 hours ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

9 hours ago