టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు, 100 రోజుల సెంటర్ల రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసి.. కొత్త ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ‘మగధీర’ వచ్చే వరకు ఆ సినిమా రికార్డులు నిలబడ్డాయి.
రిలీజైనపుడు యావరేజ్ రివ్యూలు, కొంచెం డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమా.. ఏకంగా ఇండస్ట్రీ హిట్ అవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. తెలుగులో వచ్చిన కమర్షియల్ సినిమాల్లో పతాక స్థాయి వినోదాన్ని అందించిన చిత్రాల్లో ఒకటైన ‘పోకిరి’లో కామెడీ కూడా బాగా పేలింది.
బ్రహ్మానందం-ఆలీ ట్రాక్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఐతే రిలీజ్కు ముందు ఈ ట్రాక్ మొత్తం లేపేయాలనే ఆలోచన చేశాడట దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ సినిమా రష్ చూసిన వాళ్లు ఈ ట్రాక్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేశారట. మహేష్ సినిమాలో ఇలాంటి ట్రాక్ బాగుండదని అభిప్రాయపడ్డారట. దీంతో పూరి కూడా ఆ ఫీడ్ బ్యాక్ తీసుకుని ఆ ట్రాక్ వరకు తీసేద్దామా ఆలోచించాడట.
కానీ ఈ విషయాన్ని ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్కు చెబితే.. ఆయన వద్దే వద్దు అని తేల్చేశారట. ‘పోకిరి’ హెవీ డోస్ యాక్షన్ మూవీ అని.. అందులో రిలీఫ్ కోసం ఇలాంటి కామెడీ ట్రాక్ లేకపోతే సినిమా కొంచెం భారంగా మారుతుందని.. ఆ ట్రాక్ చాలా అవసరమని మార్తాండ్.కె.వెంకటేష్ చాలా బలంగా చెప్పారట.
ఆయన మాట మేరకు పూరి దాన్ని అలాగే ఉంచేశాడట. ‘పోకిరి’ సినిమా సూపర్ హిట్ అని డే-1 నుంచి తాము నమ్మామని.. కానీ పూరికి మాత్రం ఆ ట్రాక్ విషయంలో సందేహాలు కలిగాయని.. కానీ తాను మాత్రం అది కూడా వర్కవుట్ అవుతుందని నమ్మానని మార్తాండ్.కె.వెంకటేష్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
పూరి టెక్నీషియన్లను ఎంతో గౌరవించే వ్యక్తి అని.. ఎవరు ఫీడ్ బ్యాక్ చెప్పినా చాలా సానుకూలంగా తీసుకుంటాడని.. మార్పులు చేర్పులు చేస్తాడని.. సినిమా బాలేదన్నా ఫీల్ కాడని.. డ్యామేజ్ కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో మాత్రమే ఇతరుల మాటను పట్టించుకోడని మార్తాండ్ తెలిపాడు.
మరోవైపు వెంకటేష్ ‘జయం మనదేరా’ సినిమా ప్రివ్యూ చూసిన కొందరు జనాల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ మేరకు నిర్మాత సురేష్ బాబు.. దాదాపు 20 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను తీసేసి ఆ చిత్రాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దినట్లు మార్తాండ్ వెల్లడించాడు.
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…