Movie News

సాక్షితో అఖిల్‍ రొమాన్స్!


అక్కినేని అఖిల్‍ హీరోగా సురేందర్‍ రెడ్డి దర్శకత్వంలో భారీ సినిమా త్వరలోనే మొదలు కానున్న సంగతి తెలిసిందే. సురేందర్‍ ఈ చిత్రాన్ని ఎవరైనా అగ్ర హీరోతో చేద్దామని అనుకున్నాడు. కానీ అందరు పెద్ద హీరోలు బిజీగా వుండడంతో అఖిల్‍తో ఈ చిత్రం ఖరారు చేసుకున్నాడు. అఖిల్‍ హీరో అనేసరికి అగ్ర హీరోకు అనుకున్న బడ్జెట్‍లో మూడోవంతుకే ఈ చిత్రాన్ని చేయాల్సి వుంటుంది. ఓ విధంగా అఖిల్‍ ప్రస్తుత మార్కెట్‍పై అది కూడా రిస్కే. ఈ కారణంగానే సురేందర్‍ రెడ్డి ఈ చిత్రానికి పార్టనర్‍షిప్‍ తీసుకుని చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్‍ వర్క్ కంప్లీట్‍ చేసిన సురేందర్‍ రెడ్డి ఈ చిత్రంలో కథానాయికగా ప్రముఖ మోడల్‍ సాక్షి వైద్యను ఖరారు చేసినట్టు వినిపిస్తోంది కానీ ఇంకా కచ్చితమైన సమాచారం లేదు.

మోస్ట్ ఎలిజిబుల్‍ బ్యాచ్‍లర్‍ చిత్రంలో పూజ హెగ్డేతో నటించిన అఖిల్‍ ఈ చిత్రంలో కూడా లీడింగ్‍ హీరోయిన్‍ వుండాలని కోరాడని అప్పట్లో వదంతులు వినిపించాయి. అయితే సురేందర్‍ రెడ్డిదే ఫైనల్‍ కాల్‍ కనుక బడ్జెట్‍ కారణాల దృష్ట్యా సాక్షి వైద్య ఫైనల్‍ అయి వుండొచ్చు. ఇది జేమ్స్బాండ్‍ తరహా యాక్షన్‍ థ్రిల్లర్‍ అని, అఖిల్‍ ఇందులో స్పైగా కనిపిస్తాడనేది మరో ఊహాగానం. అయితే అందుకు సంబంధించిన క్లారిటీ ఇంకా సురేందర్‍ నుంచి రాలేదు.

ఇదిలావుంటే అఖిల్‍ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్‍ బ్యాచ్‍లర్‍’ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలా వద్దా అనే దానిపై ఇంకా మీమాంస కొనసాగుతూనే వుంది. ఇప్పటికే చాలా సినిమాలు సంక్రాంతి బరిలో దిగడంతో పాటు జనవరి 31 వరకు థియేటర్లపై వున్న ఆంక్షలు కొనసాగనున్న నేపథ్యంలో ఆ చిత్ర బృందం విడుదల తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

This post was last modified on December 29, 2020 10:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

10 minutes ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

33 minutes ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

53 minutes ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

1 hour ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

1 hour ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

2 hours ago