అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ సినిమా త్వరలోనే మొదలు కానున్న సంగతి తెలిసిందే. సురేందర్ ఈ చిత్రాన్ని ఎవరైనా అగ్ర హీరోతో చేద్దామని అనుకున్నాడు. కానీ అందరు పెద్ద హీరోలు బిజీగా వుండడంతో అఖిల్తో ఈ చిత్రం ఖరారు చేసుకున్నాడు. అఖిల్ హీరో అనేసరికి అగ్ర హీరోకు అనుకున్న బడ్జెట్లో మూడోవంతుకే ఈ చిత్రాన్ని చేయాల్సి వుంటుంది. ఓ విధంగా అఖిల్ ప్రస్తుత మార్కెట్పై అది కూడా రిస్కే. ఈ కారణంగానే సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి పార్టనర్షిప్ తీసుకుని చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసిన సురేందర్ రెడ్డి ఈ చిత్రంలో కథానాయికగా ప్రముఖ మోడల్ సాక్షి వైద్యను ఖరారు చేసినట్టు వినిపిస్తోంది కానీ ఇంకా కచ్చితమైన సమాచారం లేదు.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చిత్రంలో పూజ హెగ్డేతో నటించిన అఖిల్ ఈ చిత్రంలో కూడా లీడింగ్ హీరోయిన్ వుండాలని కోరాడని అప్పట్లో వదంతులు వినిపించాయి. అయితే సురేందర్ రెడ్డిదే ఫైనల్ కాల్ కనుక బడ్జెట్ కారణాల దృష్ట్యా సాక్షి వైద్య ఫైనల్ అయి వుండొచ్చు. ఇది జేమ్స్బాండ్ తరహా యాక్షన్ థ్రిల్లర్ అని, అఖిల్ ఇందులో స్పైగా కనిపిస్తాడనేది మరో ఊహాగానం. అయితే అందుకు సంబంధించిన క్లారిటీ ఇంకా సురేందర్ నుంచి రాలేదు.
ఇదిలావుంటే అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలా వద్దా అనే దానిపై ఇంకా మీమాంస కొనసాగుతూనే వుంది. ఇప్పటికే చాలా సినిమాలు సంక్రాంతి బరిలో దిగడంతో పాటు జనవరి 31 వరకు థియేటర్లపై వున్న ఆంక్షలు కొనసాగనున్న నేపథ్యంలో ఆ చిత్ర బృందం విడుదల తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
This post was last modified on December 29, 2020 10:33 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…