Movie News

సాక్షితో అఖిల్‍ రొమాన్స్!


అక్కినేని అఖిల్‍ హీరోగా సురేందర్‍ రెడ్డి దర్శకత్వంలో భారీ సినిమా త్వరలోనే మొదలు కానున్న సంగతి తెలిసిందే. సురేందర్‍ ఈ చిత్రాన్ని ఎవరైనా అగ్ర హీరోతో చేద్దామని అనుకున్నాడు. కానీ అందరు పెద్ద హీరోలు బిజీగా వుండడంతో అఖిల్‍తో ఈ చిత్రం ఖరారు చేసుకున్నాడు. అఖిల్‍ హీరో అనేసరికి అగ్ర హీరోకు అనుకున్న బడ్జెట్‍లో మూడోవంతుకే ఈ చిత్రాన్ని చేయాల్సి వుంటుంది. ఓ విధంగా అఖిల్‍ ప్రస్తుత మార్కెట్‍పై అది కూడా రిస్కే. ఈ కారణంగానే సురేందర్‍ రెడ్డి ఈ చిత్రానికి పార్టనర్‍షిప్‍ తీసుకుని చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్‍ వర్క్ కంప్లీట్‍ చేసిన సురేందర్‍ రెడ్డి ఈ చిత్రంలో కథానాయికగా ప్రముఖ మోడల్‍ సాక్షి వైద్యను ఖరారు చేసినట్టు వినిపిస్తోంది కానీ ఇంకా కచ్చితమైన సమాచారం లేదు.

మోస్ట్ ఎలిజిబుల్‍ బ్యాచ్‍లర్‍ చిత్రంలో పూజ హెగ్డేతో నటించిన అఖిల్‍ ఈ చిత్రంలో కూడా లీడింగ్‍ హీరోయిన్‍ వుండాలని కోరాడని అప్పట్లో వదంతులు వినిపించాయి. అయితే సురేందర్‍ రెడ్డిదే ఫైనల్‍ కాల్‍ కనుక బడ్జెట్‍ కారణాల దృష్ట్యా సాక్షి వైద్య ఫైనల్‍ అయి వుండొచ్చు. ఇది జేమ్స్బాండ్‍ తరహా యాక్షన్‍ థ్రిల్లర్‍ అని, అఖిల్‍ ఇందులో స్పైగా కనిపిస్తాడనేది మరో ఊహాగానం. అయితే అందుకు సంబంధించిన క్లారిటీ ఇంకా సురేందర్‍ నుంచి రాలేదు.

ఇదిలావుంటే అఖిల్‍ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్‍ బ్యాచ్‍లర్‍’ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలా వద్దా అనే దానిపై ఇంకా మీమాంస కొనసాగుతూనే వుంది. ఇప్పటికే చాలా సినిమాలు సంక్రాంతి బరిలో దిగడంతో పాటు జనవరి 31 వరకు థియేటర్లపై వున్న ఆంక్షలు కొనసాగనున్న నేపథ్యంలో ఆ చిత్ర బృందం విడుదల తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

This post was last modified on December 29, 2020 10:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎల‌క్ష‌న్ మూడ్‌: మోడీ మ్యానియా ఫ‌లించేనా?

దేశంలో ప్ర‌స్తుతం ఎన్నిక‌ల మూడ్ నెల‌కొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…

1 hour ago

అభిమానులను ఊరిస్తున్న ‘ఉస్తాద్’ తొలిప్రేమ

ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

2 hours ago

రీల్ కోసం స్టంట్… ప్రాణం తీసిన తుపాకీ

ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…

3 hours ago

పిఠాపురానికి ప్ర‌త్యేకం.. ప‌వ‌న్ ఏం చేశారంటే ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయ‌ల‌పై ప‌ట్టు పెంచుకునే విధంగా కార్యాచ‌ర‌ణ ప్రారంభించిన…

4 hours ago

దేవి కోసమే తమన్‌‌ రాలేదట

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…

5 hours ago

చివరి నిమిషం ఒత్తిడిలో దురంధర్ రివెంజ్

రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…

5 hours ago