అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ సినిమా త్వరలోనే మొదలు కానున్న సంగతి తెలిసిందే. సురేందర్ ఈ చిత్రాన్ని ఎవరైనా అగ్ర హీరోతో చేద్దామని అనుకున్నాడు. కానీ అందరు పెద్ద హీరోలు బిజీగా వుండడంతో అఖిల్తో ఈ చిత్రం ఖరారు చేసుకున్నాడు. అఖిల్ హీరో అనేసరికి అగ్ర హీరోకు అనుకున్న బడ్జెట్లో మూడోవంతుకే ఈ చిత్రాన్ని చేయాల్సి వుంటుంది. ఓ విధంగా అఖిల్ ప్రస్తుత మార్కెట్పై అది కూడా రిస్కే. ఈ కారణంగానే సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి పార్టనర్షిప్ తీసుకుని చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసిన సురేందర్ రెడ్డి ఈ చిత్రంలో కథానాయికగా ప్రముఖ మోడల్ సాక్షి వైద్యను ఖరారు చేసినట్టు వినిపిస్తోంది కానీ ఇంకా కచ్చితమైన సమాచారం లేదు.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చిత్రంలో పూజ హెగ్డేతో నటించిన అఖిల్ ఈ చిత్రంలో కూడా లీడింగ్ హీరోయిన్ వుండాలని కోరాడని అప్పట్లో వదంతులు వినిపించాయి. అయితే సురేందర్ రెడ్డిదే ఫైనల్ కాల్ కనుక బడ్జెట్ కారణాల దృష్ట్యా సాక్షి వైద్య ఫైనల్ అయి వుండొచ్చు. ఇది జేమ్స్బాండ్ తరహా యాక్షన్ థ్రిల్లర్ అని, అఖిల్ ఇందులో స్పైగా కనిపిస్తాడనేది మరో ఊహాగానం. అయితే అందుకు సంబంధించిన క్లారిటీ ఇంకా సురేందర్ నుంచి రాలేదు.
ఇదిలావుంటే అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలా వద్దా అనే దానిపై ఇంకా మీమాంస కొనసాగుతూనే వుంది. ఇప్పటికే చాలా సినిమాలు సంక్రాంతి బరిలో దిగడంతో పాటు జనవరి 31 వరకు థియేటర్లపై వున్న ఆంక్షలు కొనసాగనున్న నేపథ్యంలో ఆ చిత్ర బృందం విడుదల తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం తన పొరుగు రాష్ట్రం తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని హన్మకొండ…
వయసు ఒక నంబర్ మాత్రమే అనే నానుడిని రుజువు చేస్తూ 94 ఏళ్ల వయసులో ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిం…
సమంత మా ఇంటి బంగారం బాగానే బోణీ కొట్టేలా ఉంది. ఓవర్సీస్ లో ఇప్పటికే లక్షా పాతిక వేల డాలర్లు…
వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానున్న వారణాసి నుంచి ఇప్పుడప్పుడే అప్డేట్స్ వచ్చేలా లేవు కానీ ఈ ప్రాజెక్టుకు…
దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…
నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…