కూలీ నంబర్ వన్.. 90ల్లో తెలుగులో సూపర్ హిట్టయిన సినిమా. వెంకటేష్, టబు జంటగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తర్వాత హిందీలో రీమేక్ చేశారు. అప్పుడు గోవిందా, కరిష్మా కపూర్ జంటగా ఆ చిత్రాన్ని రూపొందించిన డేవిడ్ ధావన్.. పాతికేళ్ల తర్వాత అదే పేరుతో కొడుకు వరుణ్ ధావన్ను హీరోగా పెట్టి సినిమా తీశారు.
పాత కథకు కొత్త హంగులు అద్ది రూపొందించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా అమేజాన్ ప్రైమ్ ద్వారా రిలీజైంది. ఈ మాస్ మసాలా సినిమాకు ప్రైమ్లో మంచి స్పందన లభించినట్లే ఉంది. ఇప్పటిదాకా ఇండియాలో రిలీజైన ఓటీటీ సినిమాల్లో 24 గంటల్లో అత్యధిక మంది వీక్షించిన చిత్రాల్లో ఒకటిగా దీన్ని చెబుతున్నారు. ఈ లెక్కల్లో ఇదే నంబర్ వన్ అని కూడా అంటున్నారు. కానీ ఈ చిత్రానికి ఐఎండీబీలో వచ్చిన రేటింగ్ మాత్రం షాకింగ్గా ఉంది.
బాలీవుడ్లో ఇప్పటిదాకా ఏ పేరున్న సినిమాకూ రాని విధంగా ఐఎండీబీలో ప్రస్తుతం 1.3 రేటింగ్తో కొనసాగుతోంది ‘కూలీ నంబర్ వన్’. ప్రేక్షకుల అభిప్రాయం ఆధారంగానే ఐఎండీబీ రేటింగ్ ఇస్తుందన్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా 25 వేల మందికి పైగా రేటింగ్ ఇవ్వగా.. దాని సగటు 1.3కి మించలేదు. ఇప్పటిదాకా ఇండియాలో స్టార్లు నటించిన హిందీ సినిమాల్లో అత్యల్ప ఐఎండీబీ రేటింగ్ తెచ్చుకున్న సినిమా అజయ్ దేవగణ్ ‘హిమ్మత్ వాలా’నే. సల్మాన్ ఖాన్ మూవీ ‘రేస్ 3’కి 1.9 రేటింగ్ వచ్చింది. కమల్ ఆర్.ఖాన్ తీసిన ‘దేశ్ ద్రోహి’ ఇంతకంటే తక్కువ రేటింగ్ తెచ్చుకుంది కానీ.. అతడి స్థాయి దృష్ట్యా దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన పని లేదు.
రాబోయే రోజుల్లో ‘కూలీ నంబర్ వన్’కు రేటింగ్ ఏమైనా పెరుగుతుందేమో కానీ ఇప్పటికైతే.. స్పందన పూర్తి ప్రతికూలంగా ఉంది. మూడు దశాబ్దాల కిందటి కథతో మరీ రొటీన్గా సినిమాను నడిపించడం.. కామెడీ మరీ లౌడ్గా ఉండటం.. లాజిక్ను అసలేమాత్రం పట్టించుకోకుండా పాత స్టయిల్లో సినిమాను తెరకెక్కించడం ప్రేక్షకులకు నచ్చినట్లు లేదు. రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నప్పటికీ.. అందులో మెజారిటీ జనాలకు సినిమా రుచించట్లేదనడానికి ఐఎండీబీ రేటింగే నిదర్శనం.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…