పదమూడేళ్ల క్రితం ప్రకటించిన సినిమా ధృవ నచ్చతిరం. విక్రమ్ హీరోగా, పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్ గా, గౌతమ్ మీనన్ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామా పూర్తయి పదేళ్లు దాటుతున్నా ఆర్థిక కారణాల వల్ల ఇంకా ల్యాబ్ నుంచి బయటికి రాలేదు. వ్యవహారం కోర్టు దాకా వెళ్లి తాజాగా జూన్ 15 లోపు రిలీజ్ చేయాలనే ఉత్తర్వులు రావడంతో విక్రమ్ ఫ్యాన్స్ హమ్మయ్యా అనుకుంటున్నారు. ఇక్కడ సూర్య ప్రస్తావన ఎందుకు వచ్చిందో చూద్దాం.
ధృవ నచ్చతిరంని మేలోనే రిలీజ్ చేయాలనేది గౌతమ్ మీనన్ ప్లాన్. కానీ మే 14 సూర్య వీరభద్రుడు (కరుప్పు) ఆల్రెడీ అఫీషియల్ గా లాక్ చేసుకుంది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల వాయిదా వేయాల్సి వస్తే మే 22 షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నారు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా కొత్త ప్రమోషన్ పోస్టర్లలో రిలీజ్ డేట్ తీసేశారు. కరుప్పు నిర్మాతలతో సంప్రదింపులు జరిపి ధృవ నచ్చతిరంకు పోటీ లేకుండా చూసే విధంగా గౌతమ్ మీనన్ అడుగులు వేస్తున్నారని చెన్నై టాక్.
అసలు కరుప్పునే విపరీతమైన వాయిదాల వల్ల ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. ఇప్పుడు విక్రమ్ కోసం సూర్య త్యాగం చేయాల్సి వస్తే ఒక రిస్క్ పొంచి ఉంది. జూన్ 4 పెద్ది వస్తున్న నేపథ్యంలో దానికి దగ్గరలో క్లాష్ అవ్వడం తెలుగు రాష్ట్రాల వరకు అంత సేఫ్ అనిపించుకోదు. పైగా కర్ణాటకలో కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దాని బదులు మే 14కే కట్టుబడితే బాగుంటుందనేది డిస్ట్రిబ్యూటర్ల సలహా. ఇంకా ఏదీ తేలలేదు.
ఇంకో ట్విస్టు ఏంటంటే ధృవ నచ్చతిరం సింగల్ పార్ట్ కాదు. రెండు భాగాలు వస్తాయట. బిజినెస్ పరంగా ఇది ప్లస్ అవుతుంది కానీ ఒకవేళ మొదటి భాగం ఫెయిల్ అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. హారిస్ జైరాజ్ సంగీతం సమకూర్చిన ఈ యాక్షన్ మూవీలో ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, పార్తిబన్, రాధికా శరత్ కుమార్, అర్జున్ దాస్ లాంటి పెద్ద క్యాస్టింగ్ ఉంది. ఇంతకీ మే 14 విక్రమ్, సూర్యలో ఎవరో ఒకరు వస్తారో రారో చూడాలి. అన్నట్టు సమంత మా ఇంటి బంగారం కూడా మే 15 నుంచి షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉందట.
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి…
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఒక విడాకుల కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై…