ఒక బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ అనగానే ప్రేక్షకుల్లో అమితాసక్తి కనిపిస్తుంది. మళ్లీ అలాంటి మ్యాజిక్ను రిపీట్ చేయడం కష్టమే అయినప్పటికీ.. ఫిలిం మేకర్స్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అందులోనూ గత దశాబ్ద కాలంలో ఈ ట్రెండు బాగా ఊపందుకుంది. ఐతే అనౌన్స్ చేసిన సీక్వెల్స్ అన్నీ సెట్స్ మీదికి వెళ్తాయనే గ్యారెంటీ ఉండదు. వేరే సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి సీక్వెల్స్ గురించి ఊరించడం కూడా ఇప్పుడొక ట్రెండుగా మారింది.
ఆమిర్ ఖాన్ కూడా ఈ బాటలోనే సాగుతున్నాడా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఒకప్పుడు ఆమిర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ‘3 ఇడియట్స్’కు సీక్వెల్ వస్తుందనే ప్రచారం ఇప్పటిది కాదు. ఇటు ఆమిర్, అటు దర్శకుడు రాజ్ కుమార్ హిరాని ఈ విషయంలో ఊరిస్తూనే ఉన్నారు. కానీ ఎంతకీ అది కార్యరూపం దాల్చడం లేదు. ఐతే తాజాగా ఆమిర్ ఖాన్ ఈ ప్రాజెక్టు విషయంలో క్యూరియాసిటీ పెంచే మాటలు మాట్లాడాడు.
ఐతే కొన్ని నెలల కిందట హిరాని తాను ‘3 ఇడియట్స్’ సీక్వెల్ కోసం స్క్రిప్టు రెడీ చేస్తున్నట్లు చెప్పారు. తాజాగా ఆమిర్ ఈ సినిమా గురించి స్పందించాడు. తన కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘ఏక్ దిన్’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన ఆయన.. ‘3 ఇడియట్స్’ స్క్రిప్టును తాను చదివానని.. అది అద్భుతంగా వచ్చిందని, ఆ కథ రొటీన్కు భిన్నంగా ఉంటుందని చెప్పాడు.
ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. ‘3 ఇడియట్స్’లోని మిత్రులు ముగ్గురూ పదేళ్ల తర్వాత కలిస్తే ఎలా ఉంటుందనే నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని.. ఒరిజినల్లోనే ఫన్, ఎమోషనల్ యాంగిల్ సీక్వెల్లోనూ కొనసాగుతాయని.. ‘3 ఇడియట్స్’లోని బేసిక్ థీమ్ తీసుకుని డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమాను హిరాని నడిపించబోతున్నారని ఆమిర్ చెప్పాడు.
ఆయన మాటలు సీక్వెల్ మీద క్యూరియాసిటీని పెంచేలాగే ఉన్నాయి. కాకపోత హిరాని ఇంతకుముందు ‘మున్నాబాయ్-3’ గురించి ఊరించి తర్వాత ఉస్సూరుమనిపించాడు. మరి ఈ సీక్వెల్ విషయంలో అలా కాకుండా నిజంగానే సినిమాను ముందుకు తీసుకెళ్తే ‘3 ఇడియట్స్’ లవర్స్కు అంతకంటే శుభవార్త ఇంకొకటి ఉండదు.
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…