ఒక బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ అనగానే ప్రేక్షకుల్లో అమితాసక్తి కనిపిస్తుంది. మళ్లీ అలాంటి మ్యాజిక్ను రిపీట్ చేయడం కష్టమే అయినప్పటికీ.. ఫిలిం మేకర్స్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అందులోనూ గత దశాబ్ద కాలంలో ఈ ట్రెండు బాగా ఊపందుకుంది. ఐతే అనౌన్స్ చేసిన సీక్వెల్స్ అన్నీ సెట్స్ మీదికి వెళ్తాయనే గ్యారెంటీ ఉండదు. వేరే సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి సీక్వెల్స్ గురించి ఊరించడం కూడా ఇప్పుడొక ట్రెండుగా మారింది.
ఆమిర్ ఖాన్ కూడా ఈ బాటలోనే సాగుతున్నాడా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఒకప్పుడు ఆమిర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ‘3 ఇడియట్స్’కు సీక్వెల్ వస్తుందనే ప్రచారం ఇప్పటిది కాదు. ఇటు ఆమిర్, అటు దర్శకుడు రాజ్ కుమార్ హిరాని ఈ విషయంలో ఊరిస్తూనే ఉన్నారు. కానీ ఎంతకీ అది కార్యరూపం దాల్చడం లేదు. ఐతే తాజాగా ఆమిర్ ఖాన్ ఈ ప్రాజెక్టు విషయంలో క్యూరియాసిటీ పెంచే మాటలు మాట్లాడాడు.
ఐతే కొన్ని నెలల కిందట హిరాని తాను ‘3 ఇడియట్స్’ సీక్వెల్ కోసం స్క్రిప్టు రెడీ చేస్తున్నట్లు చెప్పారు. తాజాగా ఆమిర్ ఈ సినిమా గురించి స్పందించాడు. తన కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘ఏక్ దిన్’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన ఆయన.. ‘3 ఇడియట్స్’ స్క్రిప్టును తాను చదివానని.. అది అద్భుతంగా వచ్చిందని, ఆ కథ రొటీన్కు భిన్నంగా ఉంటుందని చెప్పాడు.
ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. ‘3 ఇడియట్స్’లోని మిత్రులు ముగ్గురూ పదేళ్ల తర్వాత కలిస్తే ఎలా ఉంటుందనే నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని.. ఒరిజినల్లోనే ఫన్, ఎమోషనల్ యాంగిల్ సీక్వెల్లోనూ కొనసాగుతాయని.. ‘3 ఇడియట్స్’లోని బేసిక్ థీమ్ తీసుకుని డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమాను హిరాని నడిపించబోతున్నారని ఆమిర్ చెప్పాడు.
ఆయన మాటలు సీక్వెల్ మీద క్యూరియాసిటీని పెంచేలాగే ఉన్నాయి. కాకపోత హిరాని ఇంతకుముందు ‘మున్నాబాయ్-3’ గురించి ఊరించి తర్వాత ఉస్సూరుమనిపించాడు. మరి ఈ సీక్వెల్ విషయంలో అలా కాకుండా నిజంగానే సినిమాను ముందుకు తీసుకెళ్తే ‘3 ఇడియట్స్’ లవర్స్కు అంతకంటే శుభవార్త ఇంకొకటి ఉండదు.
జనసేన పార్టీ మహిళలకు ఎంత ప్రాధాన్యతనిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర లేదు. వీర మహిళలు అని సంబోధిస్తూ పార్టీలో మహిళలకు జనసేన…
ప్రస్తుతం రాజధాని అమరావతి ప్రాంతం అభివృద్ధిలో ముందుకు సాగాలన్నది ప్రపంచ స్థాయి నగరంగా మారాల న్నది సీఎం చంద్రబాబు ఆలోచన.…
అన్నీ అనుకున్నట్టు జరిగితే మరోసారి మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ సూపర్ స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ క్లాష్ జరిగేలా ఉంది. ఎప్పటి…
ఏపీలోని అల్లూరి సీతారామ రాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలో విస్తరించిన అరకు పార్లమెంటు స్థానం పెద్దది. ఈ…
తన సొంత జిల్లా కడపపై వైసీపీ అధినేత జగన్ పట్టుకోల్పోయారా? ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది ? ఏనేత ఏం…
రాష్ట్ర రాజధాని విషయంలో జగన్ తీసుకుంటున్న యూ టర్న్ లపై ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే.…