ఒక బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ అనగానే ప్రేక్షకుల్లో అమితాసక్తి కనిపిస్తుంది. మళ్లీ అలాంటి మ్యాజిక్ను రిపీట్ చేయడం కష్టమే అయినప్పటికీ.. ఫిలిం మేకర్స్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అందులోనూ గత దశాబ్ద కాలంలో ఈ ట్రెండు బాగా ఊపందుకుంది. ఐతే అనౌన్స్ చేసిన సీక్వెల్స్ అన్నీ సెట్స్ మీదికి వెళ్తాయనే గ్యారెంటీ ఉండదు. వేరే సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి సీక్వెల్స్ గురించి ఊరించడం కూడా ఇప్పుడొక ట్రెండుగా మారింది.
ఆమిర్ ఖాన్ కూడా ఈ బాటలోనే సాగుతున్నాడా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఒకప్పుడు ఆమిర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ‘3 ఇడియట్స్’కు సీక్వెల్ వస్తుందనే ప్రచారం ఇప్పటిది కాదు. ఇటు ఆమిర్, అటు దర్శకుడు రాజ్ కుమార్ హిరాని ఈ విషయంలో ఊరిస్తూనే ఉన్నారు. కానీ ఎంతకీ అది కార్యరూపం దాల్చడం లేదు. ఐతే తాజాగా ఆమిర్ ఖాన్ ఈ ప్రాజెక్టు విషయంలో క్యూరియాసిటీ పెంచే మాటలు మాట్లాడాడు.
ఐతే కొన్ని నెలల కిందట హిరాని తాను ‘3 ఇడియట్స్’ సీక్వెల్ కోసం స్క్రిప్టు రెడీ చేస్తున్నట్లు చెప్పారు. తాజాగా ఆమిర్ ఈ సినిమా గురించి స్పందించాడు. తన కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘ఏక్ దిన్’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన ఆయన.. ‘3 ఇడియట్స్’ స్క్రిప్టును తాను చదివానని.. అది అద్భుతంగా వచ్చిందని, ఆ కథ రొటీన్కు భిన్నంగా ఉంటుందని చెప్పాడు.
ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. ‘3 ఇడియట్స్’లోని మిత్రులు ముగ్గురూ పదేళ్ల తర్వాత కలిస్తే ఎలా ఉంటుందనే నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని.. ఒరిజినల్లోనే ఫన్, ఎమోషనల్ యాంగిల్ సీక్వెల్లోనూ కొనసాగుతాయని.. ‘3 ఇడియట్స్’లోని బేసిక్ థీమ్ తీసుకుని డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమాను హిరాని నడిపించబోతున్నారని ఆమిర్ చెప్పాడు.
ఆయన మాటలు సీక్వెల్ మీద క్యూరియాసిటీని పెంచేలాగే ఉన్నాయి. కాకపోత హిరాని ఇంతకుముందు ‘మున్నాబాయ్-3’ గురించి ఊరించి తర్వాత ఉస్సూరుమనిపించాడు. మరి ఈ సీక్వెల్ విషయంలో అలా కాకుండా నిజంగానే సినిమాను ముందుకు తీసుకెళ్తే ‘3 ఇడియట్స్’ లవర్స్కు అంతకంటే శుభవార్త ఇంకొకటి ఉండదు.
This post was last modified on April 28, 2026 2:16 pm
అక్కినేని నాగార్జున ఆల్రెడీ షూటింగ్ లో ఉన్న తన వందో సినిమా కోసం పెద్ద కసరత్తే చేస్తున్నారు. తమిళ దర్శకుడు…
అదేదో నిన్నా మొన్నా చూసినట్టు ఉంది మహేష్ బాబు అభిమానులకు. సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం ఏప్రిల్ 28 బాక్సాఫీస్…
ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉండడం.. ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టమని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొనియాడారు.…
విశాఖపట్నం కీర్తి .. విశ్వఖ్యాతికి చేరింది. ఇక్కడ ఏర్పాటు చేయనున్న ప్రతిష్టాత్మక గూగుల్ ఏఐ డేటా కేంద్రానికి ఈ రోజు(మంగళవారం)…
దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేస్తే.. ఆ హీరో ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ అన్నీ ఒక్కసారిగా మారిపోవడం మామూలే. ముఖ్యంగా…
ఒడిశాలో మానవత్వాన్ని కలచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన సోదరి ఖాతా నుంచి డబ్బు తీసుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి,…