ఒక బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ అనగానే ప్రేక్షకుల్లో అమితాసక్తి కనిపిస్తుంది. మళ్లీ అలాంటి మ్యాజిక్ను రిపీట్ చేయడం కష్టమే అయినప్పటికీ.. ఫిలిం మేకర్స్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అందులోనూ గత దశాబ్ద కాలంలో ఈ ట్రెండు బాగా ఊపందుకుంది. ఐతే అనౌన్స్ చేసిన సీక్వెల్స్ అన్నీ సెట్స్ మీదికి వెళ్తాయనే గ్యారెంటీ ఉండదు. వేరే సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి సీక్వెల్స్ గురించి ఊరించడం కూడా ఇప్పుడొక ట్రెండుగా మారింది.
ఆమిర్ ఖాన్ కూడా ఈ బాటలోనే సాగుతున్నాడా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఒకప్పుడు ఆమిర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ‘3 ఇడియట్స్’కు సీక్వెల్ వస్తుందనే ప్రచారం ఇప్పటిది కాదు. ఇటు ఆమిర్, అటు దర్శకుడు రాజ్ కుమార్ హిరాని ఈ విషయంలో ఊరిస్తూనే ఉన్నారు. కానీ ఎంతకీ అది కార్యరూపం దాల్చడం లేదు. ఐతే తాజాగా ఆమిర్ ఖాన్ ఈ ప్రాజెక్టు విషయంలో క్యూరియాసిటీ పెంచే మాటలు మాట్లాడాడు.
ఐతే కొన్ని నెలల కిందట హిరాని తాను ‘3 ఇడియట్స్’ సీక్వెల్ కోసం స్క్రిప్టు రెడీ చేస్తున్నట్లు చెప్పారు. తాజాగా ఆమిర్ ఈ సినిమా గురించి స్పందించాడు. తన కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘ఏక్ దిన్’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన ఆయన.. ‘3 ఇడియట్స్’ స్క్రిప్టును తాను చదివానని.. అది అద్భుతంగా వచ్చిందని, ఆ కథ రొటీన్కు భిన్నంగా ఉంటుందని చెప్పాడు.
ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. ‘3 ఇడియట్స్’లోని మిత్రులు ముగ్గురూ పదేళ్ల తర్వాత కలిస్తే ఎలా ఉంటుందనే నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని.. ఒరిజినల్లోనే ఫన్, ఎమోషనల్ యాంగిల్ సీక్వెల్లోనూ కొనసాగుతాయని.. ‘3 ఇడియట్స్’లోని బేసిక్ థీమ్ తీసుకుని డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమాను హిరాని నడిపించబోతున్నారని ఆమిర్ చెప్పాడు.
ఆయన మాటలు సీక్వెల్ మీద క్యూరియాసిటీని పెంచేలాగే ఉన్నాయి. కాకపోత హిరాని ఇంతకుముందు ‘మున్నాబాయ్-3’ గురించి ఊరించి తర్వాత ఉస్సూరుమనిపించాడు. మరి ఈ సీక్వెల్ విషయంలో అలా కాకుండా నిజంగానే సినిమాను ముందుకు తీసుకెళ్తే ‘3 ఇడియట్స్’ లవర్స్కు అంతకంటే శుభవార్త ఇంకొకటి ఉండదు.
This post was last modified on April 28, 2026 2:16 pm
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…
వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…