మలయాళంలో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు వాలా 2. అతి తక్కువ బడ్జెట్ లో రూపొంది రెండు వందల కోట్ల వైపు పరుగులు పెడుతున్న ఈ బ్లాక్ బస్టర్ కు టాలీవుడ్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరించడం అసలు విశేషం. కొంచెం ఆలస్యంగా అయినా సరే వాలా 2ని డబ్బింగ్ చేసి తెలుగులో వచ్చే వారం ఏప్రిల్ 24 విడుదల చేయబోతున్నారు. పెద్దగా పోటీ లేదు. హాలీవుడ్ మూవీ మైఖేల్ తప్ప మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న రిలీజులు లేవు.
ఒకరకంగా చెప్పాలంటే ఆలస్యం చేయడం వాలా 2కి మేలే చేస్తోంది. ఎందుకంటే థియేటర్లు ఫీడింగ్ లేక అల్లాడిపోతున్నాయి. ప్రమోషన్లతో తెగ హంగామా చేసిన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ రెండు చేతులు ఎత్తేశాయి. బ్యాడ్ బాయ్ కార్తీక్ మొదటి షోకే సెలవు తీసుకుంది. ఉన్నంతలో డెకాయిట్ కాస్త ఆక్సీజెన్ లా పనిచేస్తోంది కానీ బైకర్, రాకాస ఆల్రెడీ థియేటర్ రన్ పూర్తి చేసుకున్నాయి. సో బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉన్న టైంలో వాలా 2 వస్తోంది.
ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేశారు. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. స్కూల్ కాలేజీ లైఫ్, స్నేహితుల సరదాలు అల్లరి, అమ్మాయిలతో ప్రేమ, బస్ స్టాప్ లో అల్లర్లు, రౌడీల ప్రమేయం వగైరా అన్ని అంశాలు ఇందులో పొందుపరిచారు. ప్రేమలు తరహాలో సెన్సేషన్ అవుతుందో లేక యూత్ లాగా సోసోగా ఆడుతుందో చూడాలి. కంటెంట్ చూస్తుంటే మన జనాలకు కనెక్ట్ అయ్యేలానే ఉంది. గురి కుదిరిందా సూపర్ హిట్టు పడిపోతుంది.
ఎంతలేదన్నా వారం రోజులు సాలిడ్ రన్ దక్కుతుంది. కాకపోతే మన ఆడియన్స్ తో బాగుందనిపించుకోవాలి. లేదంటే రెండో రోజుకే హాండ్స్ అప్ అనాల్సి ఉంటుంది. మన శంకరవరప్రసాద్ గారితో 2026 వన్ అండ్ ఓన్లీ బ్లాక్ బస్టర్ సాధించిన సాహూ గారపాటికి ఇప్పుడీ వాలా 2 మరింత జోష్ ఇచ్చింది. వెంకటేష్ – కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో తెరకెక్కించబోయే మల్టీస్టారర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. దీని డీల్స్ గురించి అప్పుడే ఫిలిం నగర్ వర్గాల్లో తెగ చర్చ జరుగుతోంది.
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోసారి ఆసుపత్రిలో చేరారు. 40 రోజుల కిందట ఆయన…