Political News

శాశ్వతంగా ఉద్యోగం కోల్పోయిన వెంకట్రామిరెడ్డి

ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఏపీ సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్ గా కొనసాగుతున్న ఈ రెడ్డి గారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయనను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ సాధారణ పరిపాలనా శాఖ జీవో ఎంఎస్ నెం:43 పేరిట ఉత్తర్వులను జారీ చేసింది. ఓ ప్రభుత్వ ఉద్యోగిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించడం చాలా అరుదు. అయితే ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ సదరు ఉద్యోగం విధివిధానాలను తుంగలో తొక్కుతూ సాగే ఉద్యోగులకు మాత్రం ఈ తరహా గుణపాఠం సరైనదేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.

వైసీపీ అధికారంలో ఉండగా…ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘానికి వెంకట్రామిరెడ్డి అధ్యక్షుడిగా పనిచేశారు. సచివాలయ ఉద్యోగుల ఎన్నికల సమయంలోనే ఆయన అధికార పార్టీ వైసీపీకి చెందిన కార్యకర్తగా వ్యవహరించినట్లుగా ఆయనపై ఆరోపణలు వినిపించాయి. ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన ఏకంగా వైసీపీ విధివిధానాలను అనుసరిస్తూ ఒక అసిస్టెంట్ సెక్రటరీగా ప్రభుత్వ ఉద్యోగి అవలంబించాల్సిన నియమాలకు తిలోదకాలిచ్చారు. వైసీపీ సర్కారు చెప్పినట్టుగా నడుచుకున్న వెంకట్రామిరెడ్డి… ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి వెళ్లకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలను ఎదుర్కొన్నారు. 

ఇదంతా ఒక ఎత్తు అయితే… 2024 ఎన్నికల్లో ఆయన ఏకంగా వైసీపీకి ఎన్నికల ప్రచారం చేశారు. నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో వైసీపీకి చెందిన ఓ నేత మాదిరిగా వెంకట్రామిరెడ్డి ప్రచారంలో పాలు పంచుకున్నారు. ఈ వ్యవహారంపై నాడే ఎన్నికల సంఘానికి విపక్షాలు ఫిర్యాదు చేశాయి. ఆ సమయంలో ఎన్నికల సంఘం విచారణ చేపట్టి ఏపీ ప్రభుత్వానికి మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాలను అనుసరించి వెంకట్రామిరెడ్డిపై సమగ్ర దర్యాప్తునకు ఏపీ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా విచారణ ముగిసేదాకా  వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది.

ప్రభుత్వ దర్యాప్తులో ఆయనపై వచ్చిన ఆరోపణలు అన్నీ వాస్తవమేనని తేలింది. దీంతో వెంకట్రామిరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. రెడ్డిని శాశ్వతంగా సర్వీసు నుంచి తొలగిస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామం సర్కారీ కొలువులో ఉంటూ రాజకీయ పార్టీలకు కొమ్ము కాసే వారికి ఓ గుణపాఠం అన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

Kumar

Recent Posts

‘బ‌లిదానాల‌తో ఏర్ప‌డిన తెలంగాణ‌లో నాయ‌కులు గ‌ద్దెనెక్కారు’

తెలంగాణ‌పై మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం జ‌న‌సేన పార్టీ అధినేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో సోమ‌వారం చేప‌ట్టిన జాతీయ…

12 minutes ago

ఆప‌రేష‌న్ టైగ‌ర్‌… బీజేపీ దూకుడు!

దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేత‌లు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…

29 minutes ago

అమరావతిపై ఆరా తీసిన సింగపూర్ ప్రధాని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…

2 hours ago

రవితేజ సేఫ్ గేమ్ ఆడతారా

మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…

3 hours ago

కాక్‌రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిపై దాడి..!

కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో నిర్వహించిన…

6 hours ago

దేవర 2 ఆశలు వదులుకోక తప్పదా

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…

8 hours ago