Political News

శాశ్వతంగా ఉద్యోగం కోల్పోయిన వెంకట్రామిరెడ్డి

ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఏపీ సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్ గా కొనసాగుతున్న ఈ రెడ్డి గారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయనను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ సాధారణ పరిపాలనా శాఖ జీవో ఎంఎస్ నెం:43 పేరిట ఉత్తర్వులను జారీ చేసింది. ఓ ప్రభుత్వ ఉద్యోగిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించడం చాలా అరుదు. అయితే ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ సదరు ఉద్యోగం విధివిధానాలను తుంగలో తొక్కుతూ సాగే ఉద్యోగులకు మాత్రం ఈ తరహా గుణపాఠం సరైనదేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.

వైసీపీ అధికారంలో ఉండగా…ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘానికి వెంకట్రామిరెడ్డి అధ్యక్షుడిగా పనిచేశారు. సచివాలయ ఉద్యోగుల ఎన్నికల సమయంలోనే ఆయన అధికార పార్టీ వైసీపీకి చెందిన కార్యకర్తగా వ్యవహరించినట్లుగా ఆయనపై ఆరోపణలు వినిపించాయి. ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన ఏకంగా వైసీపీ విధివిధానాలను అనుసరిస్తూ ఒక అసిస్టెంట్ సెక్రటరీగా ప్రభుత్వ ఉద్యోగి అవలంబించాల్సిన నియమాలకు తిలోదకాలిచ్చారు. వైసీపీ సర్కారు చెప్పినట్టుగా నడుచుకున్న వెంకట్రామిరెడ్డి… ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి వెళ్లకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలను ఎదుర్కొన్నారు. 

ఇదంతా ఒక ఎత్తు అయితే… 2024 ఎన్నికల్లో ఆయన ఏకంగా వైసీపీకి ఎన్నికల ప్రచారం చేశారు. నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో వైసీపీకి చెందిన ఓ నేత మాదిరిగా వెంకట్రామిరెడ్డి ప్రచారంలో పాలు పంచుకున్నారు. ఈ వ్యవహారంపై నాడే ఎన్నికల సంఘానికి విపక్షాలు ఫిర్యాదు చేశాయి. ఆ సమయంలో ఎన్నికల సంఘం విచారణ చేపట్టి ఏపీ ప్రభుత్వానికి మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాలను అనుసరించి వెంకట్రామిరెడ్డిపై సమగ్ర దర్యాప్తునకు ఏపీ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా విచారణ ముగిసేదాకా  వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది.

ప్రభుత్వ దర్యాప్తులో ఆయనపై వచ్చిన ఆరోపణలు అన్నీ వాస్తవమేనని తేలింది. దీంతో వెంకట్రామిరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. రెడ్డిని శాశ్వతంగా సర్వీసు నుంచి తొలగిస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామం సర్కారీ కొలువులో ఉంటూ రాజకీయ పార్టీలకు కొమ్ము కాసే వారికి ఓ గుణపాఠం అన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

This post was last modified on April 20, 2026 7:32 pm

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

2 hours ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

2 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

9 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

10 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

11 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

12 hours ago