కొన్ని రోజుల నుంచి అనుకున్నట్లే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా పెద్ది మరోసారి వాయిదా పడిపోయింది. ఏప్రిల్ 30న ఆ సినిమా రావట్లేదు. దీంతో మిడ్ సమ్మర్లో క్రేజీ వీకెండ్ను ఉపయోగించుకునే సినిమాలు ఏవని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే ఓటీటీ డీల్స్ ఎటూ తేలకపోవడం వల్ల రిలీజ్ డేట్లు కన్ఫమ్ చేసుకోవడంలో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు ఇబ్బంది తప్పట్లేదు.
పెద్ది రాకపోతే తాము వస్తామంటూ ముందే మే 1 డేట్ను గాయపడ్డ సింహం సినిమా ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఇది ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ అన్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయమని దాని ప్రోమోలు చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రానికి తోడు.. కామెడీ ప్రధానంగా సాగే మరో చిత్రం మే 1 బాక్సాఫీస్ వేటకు రెడీ అయింది. ఆ చిత్రమే.. జెట్లీ.
మత్తువదలరా, మత్తువదలరా-2 చిత్రాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన రితేష్ రాణా.. ఆ చిత్రాల్లో కామెడీ రోల్స్ చేసిన సత్యను హీరోగా పెట్టి రూపొందించిన చిత్రం.. జెట్లీ. ఈ సినిమా అనౌన్స్మెంట్ దగ్గర్నుంచి క్రేజీ, ఫన్నీ ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. సత్య కామెడీ టైమింగ్ను రితేష్ కంటే బాగా ఇంకెవరూ వాడుకోలేరన్నది స్పష్టం. ఈసారి తన నుంచి ఎక్స్ట్రా డోస్ కామెడీ ఉంటుందని తన అభిమానులు ఆశిస్తున్నారు. ఈ మధ్యే రిలీజ్ చేసిన పాటలో సత్య స్టెప్పులు కూడా అదిరిపోయాయి. జెట్లీ రిలీజ్ ఇంకా ఆలస్యంగా ఉంటుందని అంచనా వేశారు కానీ.. మంచి డేట్ దొరకడంతో నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ విడుదలకు రెడీ అయిపోయింది.
ఇందులో ఏస్ కమెడియన్ వెన్నెల కిషోర్ సత్యతో సమానమైన రోల్ చేస్తున్నాడు. ఇదొక ఫ్లైట్ హైజాక్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ కామెడీ ఫిలిం. ఇందులో సత్యకు జోడీగా మాజీ మిస్ ఇండియా యూనివర్శ్ రియా శర్మ నటిస్తుండడం విశేషం. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండాలే కానీ.. మత్తు వదలరా, మత్తు వదలరా-2కు మించి పెద్ద హిట్టయ్యే అవకాశాలున్నాయి. గాయపడ్డ సింహం సైతం కామెడీ ఫిలిమే కావడంతో మే 1న తెలుగు ప్రేక్షకులకు నవ్వుల విందే అన్నమాట.
This post was last modified on April 18, 2026 10:52 am
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…