పైరసీలో ఎన్నో రకాలు చూశాం. కానీ ఒక సినిమా విడుదలకు చాలా రోజుల ముందే హెచ్డీ ప్రింట్ ఆన్ లైన్లోకి వచ్చేయడం ఇంతకుముందు ఎన్నడూ జరిగింది లేదు. తమిళ టాప్ స్టార్ విజయ్ చిత్రం ‘జననాయగన్’ విషయంలో ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతికే రావాల్సిన ఈ చిత్రం.. సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. తమిళనాట ఎన్నికలు అయ్యాక మే నెలాఖరులో లేదా జూన్లో ‘జననాయగన్’ విడుదలవుతుందని అనుకుంటుండగా.. మొత్తం సినిమా హెచ్డీ క్వాలిటీతో ఆన్ లైన్లోకి వచ్చేసింది.
పైరసీ ప్రింట్ డౌన్ లోడ్ చేసి చూడడం చట్టరీత్యా నేరం, నైతికంగా దారుణం అయినా సరే.. ఈ ఇంటర్నెట్ సముద్రంలో ఎవరిని ఎవరు ఆపగలరు? పైరసీ వెబ్ సైట్ల ద్వారా లక్షల్లో డౌన్లోడ్లు అవుతున్నాయన్నది స్పష్టం. ఎంతోమంది సీక్రెట్గా సినిమా చూస్తున్నారు. ఐతే ఇప్పుడు ఏకంగా ఒక లోకల్ ఛానెల్లో ‘జననాయగన్’ చిత్రాన్ని ప్రదర్శించడం సంచలనం రేపింది.
తమిళనాట ప్రముఖ నగరాల్లో ఒకటైన కోయంబత్తూరులో ఒక లోకల్ ఛానెల్ ‘జననాయగన్’ను ప్రసారం చేసేసింది. ఈ విషయం విజయ్ అభిమానులు, ఆయన పార్టీ కార్యకర్తలకు తెలిసి వెంటనే షో ఆపించేశారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ఆ లోకల్ ఛానెల్ యజమానికి పోలీసులు అరెస్ట్ చేశారు. ఐతే షో ఆపించేసరికే దాదాపుగా సినిమా పూర్తి కావచ్చిందట.
‘జననాయగన్’ సినిమా లీక్ వ్యవహారం ఇంత సంచలనం రేపాక.. రాజకీయంగా కూడా దాని మీద పెద్ద చర్చ జరుగుతుండగా.. పైరసీ వెర్షన్ను లోకల్ ఛానెల్లో వేసేశారంటే వాళ్లకు ఎంత ధైర్యం ఉండాలి? మరోవైపు ఈ సినిమా లీక్ విషయమై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది.
ఇప్పటికే ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఎడిటింగ్ విభాగం నుంచి సినిమా లీక్ అయి ఉండొచ్చన్న ప్రచారాన్ని ఆల్ ఇండియా ఎడిటర్స్ అసోసియేషన్ ఖండించిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర ఎడిటర్ ప్రదీప్ రాఘవ్కు లీక్తో ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ స్పష్టం చేసింది.
This post was last modified on April 14, 2026 12:18 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…