చేసినవి తక్కువ సినిమాలే అయినా దర్శకుడిగా మంచి గుర్తింపే ఉంది చందూ మొండేటికి. తొలి చిత్రం ‘కార్తికేయ’తోనే అతను బలమైన ముద్ర వేశాడు. ఆ తర్వాత ‘సవ్యసాచి’తో నిరాశపరిచినా.. ఆపై కార్తికేయ-2, తండేల్ చిత్రాలతో విజయాలందుకున్నాడు.
చందూతో ఈసారి ఒక భారీ యానిమేషన్ సినిమా చేయడానికి టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ నాగవంశీ రెడీ అయ్యాడు. గత ఏడాది యానిమేషన్ మూవీ ‘మహావతార నరసింహ’ భారీ విజయాన్నందుకున్న నేపథ్యంలో అదే తరహాలో ఆంజనేయుడి కథతో ‘వాయుపుత్ర’ తీయాలని వీళ్లిద్దరూ సంకల్పించారు.
దాదాపు ఏడాది నుంచి ఈ ప్రాజెక్టు మీద పని చేస్తున్నాడు చందూ మొండేటి. ఈ ప్రాజెక్టు గురించి నాగవంశీ మీడియా ముందు కూడా ఎంతో ఎగ్జైట్ అయ్యాడు. త్వరలో అనౌన్స్మెంట్ గ్లింప్స్ వస్తుందని కూడా గతంలో చెప్పాడు. కానీ ఇప్పుడేమో ఈ ప్రాజెక్టుకు బ్రేక్ పడిందంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ యానిమేషన్ మూవీని చందూ విజన్కు తగ్గట్లు తీయాలంటే బడ్జెట్ కొంచెం ఎక్కువే అవుతుందని.. కానీ బిజినెస్ పరంగా ఆ బడ్జెట్ను వర్కవుట్ చేయడం కష్టమని భావిస్తున్నారట. ఇటీవల డిజిటల్ మార్కెట్ బాగా దెబ్బ తినేయడం వల్ల అనుకున్న రేట్లు రావట్లేదు.
నాగవంశీ సినిమాలను రెగ్యులర్గా కొనే ఓటీటీ సంస్థ.. ‘వాయుపుత్ర’కు ఆఫర్ చేసిన రేటు ప్రకారం ఈ సినిమా బడ్జెట్ను వర్కవుట్ చేయడం సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చారట. ఈ సినిమాను క్యాన్సిల్ చేయడం కాదు కానీ.. హోల్డ్లో పెట్టినట్లు తెలుస్తోంది.
మార్కెట్ సరిగా లేని నేపథ్యంలో ప్రస్తుతానికి ఆపి, పరిస్థితులు మారాక దీన్ని పట్టాలెక్కించాలని చూస్తున్నారట. ఈలోపు వంశీ, చందూ వేరే సినిమా కోసం చేతులు కలిపే అవకాశముంది. ఎవరైనా స్టార్ హీరోతో రెగ్యులర్ సినిమానే తీయాలని చూస్తున్నారట. త్వరలోనే దీని గురించి క్లారిటీ రావచ్చు.
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో పాటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు…