కరోనా వల్ల థియేటర్లు మూతపడ్డ లాక్ డౌన్ కాలంలో చిన్న సినిమాలతో మొదులపెట్టి పెద్ద సినిమాల వరకు చాలానే ఓటీటీల బాట పట్టాయి. తెలుగులో ఆ మార్గంలో రిలీజైన తొలి పెద్ద సినిమా అంటే.. ‘వి’నే. ఈ చిత్రంపై ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. మంచి హైప్ మధ్య అమేజాన్ ప్రైమ్లో రిలీజైన ఆ సినిమా ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసింది.
ఇంద్రగంటి మోహనకృష్ణ నుంచి వచ్చిన తొలి యాక్షన్ థ్రిల్లర్ ఆయన స్థాయికి ఏమాత్రం తగని విధంగా ఉండటంతో ప్రేక్షకులు నిట్టూర్చేశారు. దీనికి రివ్యూలు బాగా రాలేదు. ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్ కూడా బాగా లేదు. ఐతే ఓటీటీ రిలీజ్ కాబట్టి దీని ఫలితాన్ని అంచనా వేయడం కష్టమైంది. ఆ తర్వాత ఈ చిత్రాన్ని టీవీలో ప్రిమియర్గా కూడా వేశారు. అక్కడ రేటింగ్ బాగా తక్కువొచ్చింది. ఐతే డిజిటల్లో అందుబాటులో ఉండి, టీవీల్లో కూడా రిలీజైపోయిన ఈ సినిమాను ఇప్పుడు థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.
2021 జనవరి 1న ‘వి’ సినిమా థియేటర్లలో రిలజీ్ కాబోతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. నాని కూడా దీని గురించి ట్వీట్ చేశాడు. అమేజాన్ వాళ్లతో ఒప్పందం చేసుకున్నపుడే.. డిజిటల్ రిలీజ్ తర్వాత కొంత విరామానంతరం థియేటర్లలో రిలీజ్ చేసుకుంటామని నిర్మాత దిల్ రాజు హామీ తీసుకున్నాడు. డిజిటల్ రిలీజ్ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి అమేజాన్ వాళ్లకు అభ్యంతరాలు ఉండకపోవచ్చు.
ఐతే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాను ఇంత లేటుగా థియేటర్లలో రిలీజ్ చేస్తే ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తి చూపిస్తారన్నదే ప్రశ్న. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు ప్రేక్షకులు రావడం సందేహమే. ఇంతకుముందు పాత సినిమాల్ని ప్రదర్శిస్తే స్పందన అంతంతమాత్రమే. ఇప్పుడు ‘సోలో బ్రతుకే సో బెటర్’కు మంచి స్పందనే వస్తోంది. ఇది రిలీజయ్యాక ‘వి’పై ప్రేక్షకుల చూపు ఉంటుందా అన్నది డౌటే.
This post was last modified on December 25, 2020 12:49 pm
రాష్ట్రంలో కీలకమైన నాలుగు రాజ్యసభ ఖాళీ అవుతున్నాయి. వీటిలో మూడు వైసీపీకి చెందిన నాయకులవి కాగా ఒకటి టిడిపికి చెందిన…
ఐపీఎల్-2026లో అత్యధిక క్రేజ్ దక్కించుకున్న మ్యాచ్లలో సన్రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరు ఒకటి. మే 22న ఉప్పల్లోని రాజీవ్…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ప్రమోషన్లలో జాన్వీ కపూర్ కనిపించకపోవడం గురించి సోషల్ మీడియాలో రకరకాల అర్థాలు తీస్తున్నారు.…
తెలుగు దేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు ఈ దఫా సరికొత్తగా జరగనుంది. ఏటా మే నెల 27,28 తేదీల్లో…
ఏపీలో టీడీపీ సారథ్యంలో కొనసాగుతున్న కూటమి సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే విషయంలో ప్రత్యేకించి రాష్ట్రానికి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలే శస్త్ర చికిత్స తీసుకుని… అనంతరం స్వల్ప వ్యవధి విశ్రాంతి…